Sanjay Raut: కొంతమంది రెబల్ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా తిరిగి వస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: కొంతమంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వస్తారని శివసేన (ఉద్ధవ్ వర్గం) నాయకుడు సంజయ్ రౌత్ శుక్రవారం ప్రకటించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద బెయిల్పై విడుదలైన రెండు రోజుల తర్వాత మాట్లాడుతూ, అటువంటి కేసులన్నింటినీ సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలించాలని కూడా అన్నారు. ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో సహా 40 మంది శివసేన ఎమ్మెల్యేలు జూన్లో పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేయడంతో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది.
“వారిలో కొందరు ఖచ్చితంగా తిరిగి వస్తారు. మరికొందరు తిరిగి వస్తారని నాకు నమ్మకం ఉంది” అని సంజయ్ రౌత్ అన్నారు.తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీని వీడడానికి కారణాలు చెబుతున్నారన్నారు.పీఎంఎల్ఏ కేసుల్లో శీఘ్ర బెయిల్కు అవకాశం లేదని, రాజకీయ పగతో ఇలాంటి కేసులు చాలా వరకు నమోదయ్యాయని రాజ్యసభ ఎంపీ తెలిపారు. ఈ కేసులను పరిశీలించేందుకు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా విపక్ష సభ్యుల అధిక ప్రాతినిధ్యంతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ బెంచ్ ఉండాలని సంజయ్ రౌత్ చెప్పారు. బీజేపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్పై తనకు ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదని రౌత్ చెప్పారు. పేదలకు గృహనిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలకు ఫడ్నవీస్ను ఆయన అభినందించారు.
Also Read
కేంద్రంపై దాడి చేస్తూ, దేశంలో రాజకీయ శత్రువును దేశానికి శత్రువుగా చూసే పరిస్థితి ఉందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు శాశ్వతంగా ముగించే పరిస్థితులు దేశంలో కనిపిస్తు్న్నాయని రౌత్ అన్నారు.దేశంలో ఇలాంటి వాతావరణం ఎప్పుడూ లేదని ఆయన అన్నారు. ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత ఏడాది కంటే ఎక్కువ కాలం జైలు నుంచి బయటకు రాలేడని అన్నారని రౌత్ చెప్పారు.ఒక గంట జైలులో ఉండటం 100 రోజులకు సమానం, ఎందుకంటే ఒకరికి లోపల ఎటువంటి సౌకర్యాలు లేవు, అని సేన నాయకుడు తెలిపారు. భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో తాను భారత్ జోడో యాత్రలో పాల్గొంటానని, ఇది ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి సమానమని ఆయన అన్నారు.
రాహుల్ గాంధీ, ఆదిత్య ఠాక్రే దేశాన్ని నడిపించగల సమర్థులు
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, శివసేన నాయకుడు ఆదిత్య ఠాక్రేలు దేశాన్ని నడిపించగల సామర్థ్యం ఉన్న ఇద్దరు ప్రముఖ యువ నాయకులు అని రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం అన్నారు. అంతకుముందు రోజు గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఠాక్రే పాల్గొన్నారు. మనీలాండరింగ్ కేసులో బెయిల్ పొంది జైలు నుంచి విడుదలైన రౌత్, భారత్ జోడో యాత్రలో శివసేన భాగమని చెప్పారు. రాష్ట్రం, దేశం కోసం పని చేసే శక్తి వారికి (రాహుల్ గాంధీ, ఆదిత్య ఠాక్రే) చాలా ఎక్కువ అని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వాతావరణం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనను పెద్ద శక్తిగా మారుస్తుందని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!