Sanjay Raut: కొంతమంది రెబల్ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా తిరిగి వస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: కొంతమంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వస్తారని శివసేన (ఉద్ధవ్ వర్గం) నాయకుడు సంజయ్ రౌత్ శుక్రవారం ప్రకటించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద బెయిల్పై విడుదలైన రెండు రోజుల తర్వాత మాట్లాడుతూ, అటువంటి కేసులన్నింటినీ సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలించాలని కూడా అన్నారు. ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో సహా 40 మంది శివసేన ఎమ్మెల్యేలు జూన్లో పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేయడంతో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది.
“వారిలో కొందరు ఖచ్చితంగా తిరిగి వస్తారు. మరికొందరు తిరిగి వస్తారని నాకు నమ్మకం ఉంది” అని సంజయ్ రౌత్ అన్నారు.తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీని వీడడానికి కారణాలు చెబుతున్నారన్నారు.పీఎంఎల్ఏ కేసుల్లో శీఘ్ర బెయిల్కు అవకాశం లేదని, రాజకీయ పగతో ఇలాంటి కేసులు చాలా వరకు నమోదయ్యాయని రాజ్యసభ ఎంపీ తెలిపారు. ఈ కేసులను పరిశీలించేందుకు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా విపక్ష సభ్యుల అధిక ప్రాతినిధ్యంతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ బెంచ్ ఉండాలని సంజయ్ రౌత్ చెప్పారు. బీజేపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్పై తనకు ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదని రౌత్ చెప్పారు. పేదలకు గృహనిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలకు ఫడ్నవీస్ను ఆయన అభినందించారు.
Also Read
- Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
- Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
- Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
- Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో 'లగ్జరీ' ఫోన్.. రేపు అందుబాటులోకి..
కేంద్రంపై దాడి చేస్తూ, దేశంలో రాజకీయ శత్రువును దేశానికి శత్రువుగా చూసే పరిస్థితి ఉందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు శాశ్వతంగా ముగించే పరిస్థితులు దేశంలో కనిపిస్తు్న్నాయని రౌత్ అన్నారు.దేశంలో ఇలాంటి వాతావరణం ఎప్పుడూ లేదని ఆయన అన్నారు. ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత ఏడాది కంటే ఎక్కువ కాలం జైలు నుంచి బయటకు రాలేడని అన్నారని రౌత్ చెప్పారు.ఒక గంట జైలులో ఉండటం 100 రోజులకు సమానం, ఎందుకంటే ఒకరికి లోపల ఎటువంటి సౌకర్యాలు లేవు, అని సేన నాయకుడు తెలిపారు. భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో తాను భారత్ జోడో యాత్రలో పాల్గొంటానని, ఇది ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి సమానమని ఆయన అన్నారు.
రాహుల్ గాంధీ, ఆదిత్య ఠాక్రే దేశాన్ని నడిపించగల సమర్థులు
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, శివసేన నాయకుడు ఆదిత్య ఠాక్రేలు దేశాన్ని నడిపించగల సామర్థ్యం ఉన్న ఇద్దరు ప్రముఖ యువ నాయకులు అని రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం అన్నారు. అంతకుముందు రోజు గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఠాక్రే పాల్గొన్నారు. మనీలాండరింగ్ కేసులో బెయిల్ పొంది జైలు నుంచి విడుదలైన రౌత్, భారత్ జోడో యాత్రలో శివసేన భాగమని చెప్పారు. రాష్ట్రం, దేశం కోసం పని చేసే శక్తి వారికి (రాహుల్ గాంధీ, ఆదిత్య ఠాక్రే) చాలా ఎక్కువ అని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వాతావరణం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనను పెద్ద శక్తిగా మారుస్తుందని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!