Sanjay Raut: కొంతమంది రెబల్ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా తిరిగి వస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: కొంతమంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వస్తారని శివసేన (ఉద్ధవ్ వర్గం) నాయకుడు సంజయ్ రౌత్ శుక్రవారం ప్రకటించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద బెయిల్పై విడుదలైన రెండు రోజుల తర్వాత మాట్లాడుతూ, అటువంటి కేసులన్నింటినీ సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలించాలని కూడా అన్నారు. ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో సహా 40 మంది శివసేన ఎమ్మెల్యేలు జూన్లో పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేయడంతో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది.
“వారిలో కొందరు ఖచ్చితంగా తిరిగి వస్తారు. మరికొందరు తిరిగి వస్తారని నాకు నమ్మకం ఉంది” అని సంజయ్ రౌత్ అన్నారు.తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీని వీడడానికి కారణాలు చెబుతున్నారన్నారు.పీఎంఎల్ఏ కేసుల్లో శీఘ్ర బెయిల్కు అవకాశం లేదని, రాజకీయ పగతో ఇలాంటి కేసులు చాలా వరకు నమోదయ్యాయని రాజ్యసభ ఎంపీ తెలిపారు. ఈ కేసులను పరిశీలించేందుకు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా విపక్ష సభ్యుల అధిక ప్రాతినిధ్యంతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ బెంచ్ ఉండాలని సంజయ్ రౌత్ చెప్పారు. బీజేపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్పై తనకు ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదని రౌత్ చెప్పారు. పేదలకు గృహనిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలకు ఫడ్నవీస్ను ఆయన అభినందించారు.
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
కేంద్రంపై దాడి చేస్తూ, దేశంలో రాజకీయ శత్రువును దేశానికి శత్రువుగా చూసే పరిస్థితి ఉందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు శాశ్వతంగా ముగించే పరిస్థితులు దేశంలో కనిపిస్తు్న్నాయని రౌత్ అన్నారు.దేశంలో ఇలాంటి వాతావరణం ఎప్పుడూ లేదని ఆయన అన్నారు. ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత ఏడాది కంటే ఎక్కువ కాలం జైలు నుంచి బయటకు రాలేడని అన్నారని రౌత్ చెప్పారు.ఒక గంట జైలులో ఉండటం 100 రోజులకు సమానం, ఎందుకంటే ఒకరికి లోపల ఎటువంటి సౌకర్యాలు లేవు, అని సేన నాయకుడు తెలిపారు. భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో తాను భారత్ జోడో యాత్రలో పాల్గొంటానని, ఇది ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి సమానమని ఆయన అన్నారు.
రాహుల్ గాంధీ, ఆదిత్య ఠాక్రే దేశాన్ని నడిపించగల సమర్థులు
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, శివసేన నాయకుడు ఆదిత్య ఠాక్రేలు దేశాన్ని నడిపించగల సామర్థ్యం ఉన్న ఇద్దరు ప్రముఖ యువ నాయకులు అని రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం అన్నారు. అంతకుముందు రోజు గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఠాక్రే పాల్గొన్నారు. మనీలాండరింగ్ కేసులో బెయిల్ పొంది జైలు నుంచి విడుదలైన రౌత్, భారత్ జోడో యాత్రలో శివసేన భాగమని చెప్పారు. రాష్ట్రం, దేశం కోసం పని చేసే శక్తి వారికి (రాహుల్ గాంధీ, ఆదిత్య ఠాక్రే) చాలా ఎక్కువ అని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వాతావరణం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనను పెద్ద శక్తిగా మారుస్తుందని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..