రోడ్డు ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నప్పటికీ రోజు ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఓ రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వర్షం పడుతుండటంతో బైక్ అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Anurag Thakur: మణిపూర్ అంశంపై పార్లమెంట్లో చర్చకు రండి.. చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివారెడ్డిగూడలోని మారుతీనగర్కు చెందిన సూరజ్ (28) తన స్నేహితుడి కారును రెండు రోజుల క్రితం తీసుకున్నాడు. దానిని తిరిగి ఇచ్చేందుకు శనివారం రాత్రి బాలాజీనగర్కు వెళ్లాడు. అనంతరం స్నేహితుడి బైక్ పై ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఘట్కేసర్ సమీపంలోని మాధవరెడ్డి వంతెన వద్ద బైక్ అదుపుతప్పడంతో సూరజ్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు.
Huzur Nagar: వైద్యం వికటించి మూడేళ్ల చిన్నారి మృతి
మృతుడి సెల్ ఫోన్ ఆధారంగా అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడు హైదరాబాద్లోని కొండాపూర్లో ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.