తెలుగు మూలాలున్న అంతర్జాతీయ నటి శోభిత ధూళిపాళ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారారు. ‘గూఢచారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ వైజాగ్ భామ, చాలా కాలం తర్వాత ‘చీకటిలో’ అనే చిత్రంతో మళ్ళీ టాలీవుడ్ వెండితెరపై మెరిశారు. ఈ సినిమాలో పాడ్కాస్టర్గా తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న శోభిత, తాజాగా ఇండస్ట్రీలోని ‘పిఆర్’ (Public Relations) వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : Raveena Tandon : నీ భర్తకు నేను ఫ్యాన్ అయ్యాను!” – యామికి రవీనా స్పెషల్ కాల్
చాలా మంది హీరోయిన్ లు ఇతర భాషల నుండి వచ్చి తెలుగులో డబ్బింగ్ చెప్పడానికి ఇబ్బంది పడుతుంటారు. కానీ శోభిత మాత్రం తన మాతృభాషలో నటించడం పట్ల గర్వంగా ఉన్నానని చేప్పారు. ‘నేను తెలుగు అమ్మాయిని కావడం వల్ల ఎలాంటి కష్టమైన డైలాగులైన కూడా ఎంతో సులువుగా, హాయిగా చెప్పగలిగాను. భాషపై పట్టు ఉంటే నటనలో సహజత్వం దానంతట అదే వస్తుంది’ అని ఆమె పేర్కొన్నారు. అలాగే ప్రజంట్ ఇండస్ట్రీలో ఏ చిన్న విషయం జరిగినా పిఆర్ టీమ్స్ ద్వారా హడావుడి చేయడం మనం చూస్తున్నాం. కానీ శోభిత దీనికి పూర్తి విరుద్ధం..
‘గతంలో కొంతకాలం పిఆర్ ఏజెన్సీలతో పనిచేశాను కానీ, నా వ్యక్తిత్వానికి ఆ పద్ధతులు సెట్ కావని అర్థమైంది. అందుకే ఇప్పుడు నేను ఏ పిఆర్ టీమ్ తోనూ పని చేయడం లేదు. ఎప్పుడూ వార్తల్లోనే ఉండాలనే ఆరాటం నాకు లేదు..24 గంటలూ నా గురించి అందరూ మాట్లాడుకోవాలని అని నేను కోరుకోవడంలేదు. అలాగే పిఆర్ కల్చర్ కొందరికి వర్కవుట్ అవ్వొచ్చు, అది వారి వ్యక్తిగతం. కానీ నాకు ఏం కావాలో, ఏం వద్దో అనే విషయంలో క్లారిటీ ఉంది. రూల్స్ కి విరుద్ధంగా నాదైన దారిలో వెళ్లడమే నాకు ఇష్టం’ అని శోభిత తెలిపింది. తన సహజత్వమే తనకు శ్రీరామరక్ష అని నమ్ముతున్న ఈ భామ, ప్రస్తుతం ‘చీకటిలో’ సక్సెస్ను ఎంజాయ్ చేస్తోంది.
