Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Snake Catchers Retired Librarian Among Tamil Nadu Padma Awardees

Padma Shri: పాములు పట్టేవారిని వరించిన ప్రతిష్ఠాత్మక పురస్కారం

Published Date :January 27, 2023 , 12:17 pm
By Mahesh Jakki
Padma Shri: పాములు పట్టేవారిని వరించిన ప్రతిష్ఠాత్మక పురస్కారం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Padma Shri: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులకు ఎంపికైన వారిలో ఇరుల కమ్యూనిటీకి చెందిన పాములను పట్టడంలో నిపుణులైన వడివేల్ గోపాల్, మాసి సదయన్ ఉన్నారు. చెంగల్పట్టు నుంచి అమెరికా వరకు విషపూరిత పాములను పట్టుకోవడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన వెనుక బడిన తరగతుల సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరిని పద్మశ్రీ వరించింది. పాములు పట్టడంలో వీరికి వీరే సాటి. తమిళనాడు చెంగల్పట్టు జిల్లా సెందురి గ్రామానికి చెందిన వెనుకబడిన వర్గానికి చెందిన వడివేల్‌ గోపాల్‌, మాసి సడయన్‌ 2023 సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. పాములు పట్టడమే వృత్తిగా జీవించే వారికి ఇంత అత్యున్నత పురస్కారం దక్కడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వంశపారంపర్యంగా వస్తున్న ఈ విద్యతో ఈ ఇద్దరూ ఒక్క ఇండియాలోనే కాదు అగ్రరాజ్యం అమెరికా వరకూ తమ సేవలను అందించారు. అలాంటి వీరిని పద్మశ్రీ వరించడం అత్యంత అభినందనీయం.

వీరు పాములు పట్టడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో చాలా మందికి శిక్షణ కూడా ఇచ్చారు. అమెరికా ఫ్లోరిడాలో కొండ చిలువలను పట్టే ప్రముఖ నిపుణుడు రోమ్లస్‌ విక్టోరికర్‌ బృందంలో ఈ ఇద్దరు సభ్యులుగా కూడా ఉండడం గమనార్హం. దీంతో ఈ విషయం త్వరగా వెలుగులోకి వచ్చింది. కాగా తనకు పద్మశ్రీ అవార్డు రావడంపై వడివేల్‌ గోపాల్‌ మాట్లాడుతూ ఈ ఘనత అందుకోవడం ఎంతో ఆనందం కలిగిస్తోందన్నారు. అమెరికా, థాయ్‌ల్యాండ్‌ వంటి దేశాలలో తాము పాములు పట్టామని, అధిక విషం కలిగిన పాములు ఎన్ని పట్టామో తనకే తెలియదని పేర్కొన్నారు. పద్మశ్రీ రావడం చాలా గొప్ప అని.. తన ఆనందానికి అవధులు లేవని మాసి సదయన్‌ అన్నారు.

Also Read

  • AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
  • CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
  • RCB Vs DC: విరాట్‌ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే.. 
  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

Marriage: 28 ఏళ్ల కోడలిని మనువాడిన 70 ఏళ్ల మామ.. ఎందుకంటే?

ఇదిలా ఉండగా తమిళనాడు మొత్తం ఆరుగురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. పద్మభూషణ్ అవార్డుకు ప్రముఖ గాయని వాణీ జైరామ్ (78) ఎంపిక కాగా, పద్మశ్రీకి తమిళనాడుకు చెందిన పాలం కళ్యాణ సుందరం (సామాజిక సేవ), డాక్టర్ గోపాల్‌ స్వామి వేలుస్వామి(వైద్యం), కె కళ్యాణసుందరం పిళ్లై (కళ) ఎంపికయ్యారు.

వాణి జైరామ్ (78) వేలూరులో శాస్త్రీయ సంగీత విద్వాంసుల కుటుంబంలో జన్మించారు. 1971లో ప్లే బ్యాక్ సింగర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన జైరామ్ ఐదు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. సినిమా పాటలతో పాటు, ఆమె భారతదేశంలో, విదేశాలలో అనేక కచేరీలలో పాల్గొనడమే కాకుండా అనేక భక్తిగీతాలు మరియు ప్రైవేట్ ఆల్బమ్‌లను రికార్డ్ చేసింది. ఆమె కన్నడ, తమిళం, హిందీ, తెలుగు, మలయాళం, మరాఠీ, ఒడియా, గుజరాతీ, అస్సామీ, తుళు మరియు బెంగాలీ వంటి అనేక భారతీయ భాషలలో పాడింది.

డాక్టర్ గోపాల్‌స్వామి వేలుస్వామి (75), 2018 నుంచి 2021 వరకు ఆయుష్ మంత్రిత్వ శాఖ సిద్ధ పరిశోధన కోసం అపెక్స్ బాడీ అయిన సిద్ధాలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన సిద్ధకు గౌరవ ఛైర్మన్‌గా ఉన్నారు.

పాలం కళ్యాణసుందరం (82) ప్రజలకు సేవ చేస్తూ బ్రహ్మచారిగా మిగిలిపోయిన సామాజిక సేవకుడు. పని చేసిన కాలంలోని తన జీతం మొత్తాన్ని సామాజిక సంక్షేమం కోసం ఇచ్చాడు. అతను తన జీవితాన్ని పేదలకు, పేదలకు అంకితం చేసిన గాంధేయవాది. లైబ్రరీ సైన్స్‌లో గోల్డ్ మెడలిస్ట్, శ్రీవైకుంటం కాలేజీలో 35 ఏళ్ల పాటు లైబ్రేరియన్‌గా సేవలందించారు. 1998లో, దాతలు, లబ్ధిదారుల మధ్య వారధిగా పాలెం అనే సామాజిక సంక్షేమ సంస్థను స్థాపించారు. ఒక అమెరికన్ సంస్థ అతన్ని మ్యాన్ ఆఫ్ మిలీనియం అవార్డుతో సత్కరించింది. ఆయనకు 6.5 మిలియన్‌ డాలర్లు ఇచ్చింది. కళ్యాణసుందరం మొత్తం డబ్బును పేద పిల్లల సంక్షేమం కోసం వెచ్చించాడు.

పుదుచ్చేరికి చెందిన డాక్టర్ నళిని పార్థసారథి (వైద్యం) కూడా ఈ ఏడాది పద్మశ్రీకి ఎంపికయ్యారు. డాక్టర్ నళిని పార్థసారథి వైద్యం చేసి పద్మశ్రీకి ఎంపికయ్యారు. పుదుచ్చేరిలో ఎంపికైన ఏకైక వ్యక్తిగా ఆమె నిలిచారు.

తమిళనాడు నుండి అవార్డు గ్రహీతలు

పద్మ భూషణ్
వాణీ జైరామ్ (గాయకురాలు)

పద్మశ్రీ
వడివేల్ గోపాల్, మాసి సదయన్ (పాము పట్టేవారు)
పాలం కళ్యాణ సుందరం (సామాజిక సేవ)
డాక్టర్ గోపాల్‌స్వామి వేలుస్వామి(వైద్యం)
కె కళ్యాణసుందరం పిళ్లై (కళ)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Irula community
  • Masi Sadaiyan
  • Padma awardees
  • padma shri award
  • Republic Day 2023

తాజావార్తలు

  • Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్‌కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!

  • AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!

  • CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!

  • RCB Vs DC: విరాట్‌ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే.. 

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions