Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Smriti Mandhana Takes Responsibility For Indias Loss Against England In Womens World Cup 2025

Smriti Mandhana: ఓటమికి బాధ్యత నాదే.. టీమిండియా వైస్ కెప్టెన్

Published Date :October 20, 2025 , 10:59 am
By Kothuru Ram Kumar
Smriti Mandhana: ఓటమికి బాధ్యత నాదే.. టీమిండియా వైస్ కెప్టెన్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Smriti Mandhana: మహిళల ప్రపంచ కప్‌ 2025లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా నాలుగు పరుగుల తేడాతో ఒదిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమికి బాధ్యత నాదే అంటూ టీమిండియా మహిళల వైస్ కెప్టెన్ స్మృతి మంధాన వహించింది. తన వికెట్ కోల్పోవడంతోనే బ్యాటింగ్ పతనం మొదలైందని, షాట్ ఎంపిక ఇంకా మెరుగ్గా ఉండాల్సిందని ఆమె అంగీకరించింది. 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్ స్మృతి మంధాన (88) అద్భుతంగా ఆడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి 125 పరుగుల కీలక భాగస్వామ్యం, ఆపై దీప్తి శర్మతో 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి లక్ష్యం వైపు అడుగులు వేసింది. అయితే, ఆమె లాంగాఫ్ దిశగా ఆడిన షాట్ మిస్‌టైమ్ అవ్వడంతో ఔట్ కావడం, ఆ వెంటనే రిచా ఘోష్, దీప్తి శర్మ కూడా వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో భారత జట్టుకు పరాజయం తప్పలేదు.

Husband Throws Wife: బ్రిడ్జి పైనుంచి భార్యను తోసేసి భర్త.. ఈ కేసులో బిగ్ ట్వీస్ట్ ఇదే!

మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మంధాన మాట్లాడుతూ.. ఆ సమయంలో ప్రతి ఒక్కరి షాట్ ఎంపిక మరింత మెరుగ్గా ఉండాల్సిందని.. ముఖ్యంగా ఈ పతనం నా నుంచే మొదలైంది కాబట్టి, నేను బాధ్యత తీసుకుంటానని ఆమె అన్నారు. షాట్ ఎంపిక ఇంకా బాగా ఉండాల్సింది అని పేర్కొంది. అలాగే మాకు ఓవర్‌కు కేవలం ఆరు పరుగులు మాత్రమే అవసరం. బహుశా మేము ఆటను మరింత ముందుకు తీసుకెళ్లాల్సి ఉండేది. పతనం నా నుంచే మొదలైంది కాబట్టి, నేను నాపైనే బాధ్యత తీసుకుంటానని స్మృతి అంది. ముఖ్యంగా ఏరియల్ షాట్‌లు (గాల్లోకి కొట్టే షాట్లు) ఆడకూడదనే తన ప్రణాళిక నుండి భావోద్వేగాల కారణంగా తాను పక్కకు వెళ్లానని మంధాన పేర్కొంది. నేను బౌలర్‌ను టార్గెట్ చేయగలనని అనుకున్నాను. ఎక్కువగా కవర్స్ మీదుగా కొట్టాలని ప్రయత్నించాను. కానీ ఆ షాట్ మిస్‌టైమ్ అయ్యింది. బహుశా ఆ సమయంలో ఆ షాట్ అవసరం లేదు. నేను మరింత సహనంతో ఉండాల్సింది.. ఎందుకంటే ఇన్నింగ్స్ మొత్తం నేను సహనంగా ఉండాలని, గాల్లోకి షాట్లు ఆడకూడదని నాకు నేను చెప్పుకున్నాను. భావోద్వేగాలు నాపై ఆధిపత్యం చెలాయించాయి. క్రికెట్‌లో అది ఎప్పుడూ మంచిది కాదని మంధాన వివరించింది.

పొరపాటుగా ధరను పెట్టేసారా ఏంటి..? MOTOROLA Edge 60 Fusion 5G భారీ తగ్గింపు.. డోంట్ మిస్!

అలాగే మంధాన బ్యాటింగ్ యూనిట్‌ను సమర్థించింది. ఫినిషింగ్ చేయడం ఎప్పుడూ కష్టమేనని, మీరు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను చూస్తే, వాళ్ళు కూడా సరిగ్గా ముగించలేకపోయారు. చివరికి వచ్చేసరికి ఓవర్‌కు ఏడు పరుగులు చేయడం అంత తేలికైన విషయం కాదు. తొలి రెండు, మూడు మ్యాచుల్లో మేము బాగానే ఫినిష్ చేశాం. సౌత్ ఆఫ్రికాపై చివరి 10 ఓవర్లలో దాదాపు 90కి పైగా పరుగులు చేశాం. కాబట్టి మా బ్యాటర్లు చాలా మంచి పనులు చేశారు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లుగా మేము ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యత తీసుకుని, యువకులకు మార్గనిర్దేశం చేయాలని పేర్కొంది. అలాగే గత నాలుగు మ్యాచుల్లో ఐదుగురు బౌలర్లతో ఆడిన టీమ్ మేనేజ్‌మెంట్, ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ స్థానంలో పేసర్ రేణుకా సింగ్‌ను తీసుకోవడంపై కూడా మంధాన మాట్లాడింది. గత రెండు మ్యాచుల్లో ముఖ్యంగా ఇండోర్ లేదా విశాఖపట్నం లాంటి ఫ్లాట్ పిచ్‌లపై ఐదుగురు బౌలింగ్ ఆప్షన్లు సరిపోవని మేము భావించాం. చాలా జట్లలో ఉండే విధంగా మాకు బౌలింగ్ చేయగలిగే బ్యాటర్లు లేరు. అందుకే, ఒక బౌలర్‌కు చెడ్డ రోజు అయితే, అది మాకు చాలా నష్టాన్ని కలిగిస్తుందని అనుకున్నాం. జెస్సీ (జెమీమా రోడ్రిగ్స్) లాంటి వారిని తప్పించడం చాలా కష్టమైన నిర్ణయం. కానీ కొన్నిసార్లు, బాలన్స్ చేయడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఇది శాశ్వతం కాదు.. పిచ్ ఎలా ఉంటుంది చూసి తదుపరి నిర్ణయం తీసుకుంటాం అని ఆమె వివరించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • India vs England
  • India women’s cricket team loss
  • smriti mandhana
  • Smriti Mandhana press conference
  • Smriti Mandhana statement

తాజావార్తలు

  • Astrology: ఏప్రిల్‌ 6, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్

  • Bhuvneshwar Kumar: ఐపీఎల్ చరిత్రలో తొలి ఫాస్ట్ బౌలర్‌గా.. భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions