Smriti Mandhana: తొలి బ్యాటర్గా స్మృతి మంధాన ప్రపంచ రికార్డు.. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు!
- స్మృతి మంధాన అరుదైన మైలురాయి
- వన్డేల్లో 5 వేల పరుగుల మైలురాయి
- ఒక క్యాలెండర్ ఏడాదిలో వెయ్యి పరుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అరుదైన మైలురాయిని అందుకుంది. ఈ ఏడాది వన్డేల్లో వెయ్యి పరుగులను పూర్తి చేసింది. దాంతో మహిళల వన్డేల్లో ఒక క్యాలెండర్ ఏడాదిలో వెయ్యి పరుగులు చేసిన తొలి బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా ఆదివారం విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో స్మృతి ఈ రికార్డు నెలకొల్పింది. ఇంతకు ముందు మరే ఇతర మహిళా క్రీడాకారిణి ఈ ఘనత సాధించలేదు.
గతంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్ 1997లో మహిళల వన్డేల్లో 80.83 సగటుతో 970 పరుగులు చేసింది. బెలిండా రికార్డును స్మృతి మంధాన బద్దలు కొట్టింది. స్మృతి మరో మైలురాయిని కూడా అందుకుంది. వన్డేల్లో 5 వేల పరుగుల మైలురాయిని చేరుకుంది. మహిళల క్రికెట్లో ఈ ఘనత సాధించిన అయిదో బ్యాటర్గా స్మృతి నిలిచింది. భారత్ తరఫున మిథాలీ రాజ్ (7805 పరుగులు) మాత్రమే ఈ మైలురాయిని దాటింది. మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా 5 వేల పరుగులు సాధించిన పిన్న వయస్కురాలు కూడా స్మృతినే. స్మృతి 112 ఇన్నింగ్స్ల్లో 5 వేల రన్స్ చేసింది. వెస్టిండీస్ ప్లేయర్ స్టెఫానీ టేలర్ (129) రికార్డును బ్రేక్ చేసింది.
Also Read
- Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
- Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
- Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
వన్డే ప్రపంచకప్ 2025లో స్మృతి మంధాన తన స్థాయిలో ఆడలేదు. శ్రీలంక, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాపై వరుసగా 8, 23, 23 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాపై మాత్రం ఆకట్టుకుంది. 66 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులు 80 రన్స్ చేసింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ 48.5 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌటైంది. స్మృతితో పాటు ప్రతీక రావల్ (75; 96 బంతుల్లో 10×4, 1×6) ఆకట్టుకుంది. ఆస్ట్రేలియా బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ (5/40) ఆకట్టుకుంది. ఛేదనలో ఆసీస్ 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. అలీసా హీలీ (142; 107 బంతుల్లో 21×4, 3×6), ఎలీస్ పెర్రీ (47 నాటౌట్; 52 బంతుల్లో 5×4, 1×6), ఆష్లీ గార్డ్నర్ (45; 46 బంతుల్లో 3×4, 1×6), ఫోబ్ లిచ్ఫీల్డ్ (40; 39 బంతుల్లో 6×4, 1×6) రాణించారు. టీమిండియాకు ఇది వరుసగా రెండో ఓటమి.
తాజావార్తలు
-
CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం ‘సంజీవని’.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
-
Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
-
Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
-
Kara: ధనుష్ ‘కర’ ఓటీటీ రిలీజ్ డేట్ను ఫిక్స్ ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!