Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా స్మృతి మంధాన..
- ఆసియా క్రీడలు 2026 సెమీఫైనల్లో న్యూజిలాండ్ మాజీ స్టార్ సుజీ బేట్స్ రికార్డు బ్రేక్..
- టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్గా మంధాన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Mandhana: భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అరుదైన రికార్డు సృష్టించింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచింది. ఆసియా క్రీడలు 2026లో భాగంగా నేడు బంగ్లాదేశ్తో జరిగిన సెమీఫైనల్లో ఈ ఘనత సాధించింది. న్యూజిలాండ్ స్టార్ సుజీ బేట్స్ రికార్డును మంధాన అధిగమించింది.
బంగ్లాదేశ్తో మ్యాచ్కు ముందు మంధానకు రికార్డు బద్దలు కొట్టేందుకు కేవలం 7 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో మారుఫా అక్తర్ బౌలింగ్లో వరుసగా రెండు బౌండరీలు బాదిన మంధాన ఈ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. దీంతో మహిళల టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది.
Also Read
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
ఇటీవలే మహిళల క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కూడా మంధాన రికార్డు సాధించింది. మహిళల ఆసియా కప్లో భాగంగా జరిగిన మ్యాచ్లో సెంచరీ చేయడంతో మహిళల క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా కూడా తన పేరును రికార్డు పుస్తకాల్లో నిలిచింది. బంగ్లాదేశ్తో జరిగిన సెమీఫైనల్లో మంధాన మరో మైలురాయిని అందుకుంది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్గా నిలిచింది. ఈ మ్యాచ్లో ఆమె 19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేసింది.
మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరిట ఉంది. టెస్టుల్లో ఇంగ్లండ్కు చెందిన జాన్ బ్రిటిన్ అగ్రస్థానంలో ఉన్నారు. ఇప్పుడు టీ20ల్లో సుజీ బేట్స్ ను అధిగమించి స్మృతి మంధాన మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్ సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. క్వార్టర్ ఫైనల్లో జపాన్ను ఓడించిన భారత్.. వరుస విజయాలతో ఫైనల్పై కన్నేసింది. గత ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్లో భారత్ స్వర్ణ పతకం సాధించింది. ఈసారి కూడా టైటిల్ను నిలబెట్టుకోవాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు తొలి సెమీఫైనల్లో పాకిస్థాన్ను 8 వికెట్ల తేడాతో ఓడించిన శ్రీలంక ఫైనల్కు చేరుకుంది.
ఈ మధ్యనే హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు మహిళల టీ20 ఆసియా కప్ టైటిల్ను కూడా గెలుచుకుంది. శ్రీలంకను ఫైనల్లో 72 పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీని అందుకుంది. అయితే ట్రోఫీ అందజేత కార్యక్రమంలో ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ స్వీకరించేందుకు భారత జట్టు నిరాకరించడంతో అనంతరం వివాదం నెలకొంది.
తాజావార్తలు
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!