Chandrayaan-3: చరిత్ర సృష్టించిన భారత్.. చంద్రయాన్-3 ల్యాండింగ్ విజయవంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో చరిత్రను సృష్టించింది. జాబిల్లి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అయింది. శాస్త్రవేత్తలు ఊహించిన మేరకే ల్యాండింగ్ ప్రక్రియ విజయవంతమైనట్లు తెలిసింది. చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రక్రియను యావత్ భారతావని ఉత్కంఠగా వేచిచూసింది.
Read Also: Chandrayaan 3 Live Updates: చంద్రయాన్ – 3 ల్యాండింగ్ విజయవంతం
Also Read
- Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
- Hyderabad: హైదరాబాద్లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
- Natural Skin Care: నిమ్మ తొక్కతో హోం బ్యూటీ ట్రీట్మెంట్.. కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో ల్యాండ్ అయిన మొదటి దేశంగా భారతదేశం నిలిచింది. చంద్రుని ఉపరితలాన్ని తాకిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాలోని జొహన్నస్బర్గ్ నుంచి ప్రధాని మోడీ లైవ్ను వీక్షించారు. విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అయిన వెంటనే శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. చంద్రయాన్-3 విజయంతో నా జీవితం ధన్యమైందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత్ సరికొత్త రికార్డు సృష్టించిందని ఆయన వివరించారు.
ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 5.44కి ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. ఇప్పటివరకూ అన్ని దశలనూ విజయవంతంగా పూర్తిచేసుకున్న చంద్రయాన్-3 దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ చంద్రుడిపై కాలుమోపడంతో ఈ ప్రక్రియ విజయవంతమైంది.
జాబిల్లిపై అదీ దక్షిణ ధ్రువంలో కాలు మోపడంతో.. చంద్రయాన్3 ప్రయోగం సక్సెస్ అయింది. చంద్రయాన్-2 ఫెయిల్యూర్ నుంచి నేర్చుకున్న పాఠంతో.. అలాంటి తప్పిదాలు లేకుంటే చంద్రయాన్-3ని పక్కాగా రూపొందించినట్లు ధీమా వ్యక్తం చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఏ దేశం కూడా ల్యాండ్ కానీ దక్షిణ ధ్రువంపై భారత్ దిగి చరిత్రను సృష్టించింది. పదేహేనేళ్ల క్రితం చంద్రుడిపై నీరుందని పరిశోధనల్లో కొత్త శ్వాస నింపిన భారత్.. ఎవరూ చేరలేని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండింగ్ చేసి.. జాబిల్లి దక్షిణ ధ్రువ జాడల్ని ప్రపంచానికి చూపించింది.
https://www.youtube.com/watch?v=-nnbalFsb-A
తాజావార్తలు
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
-
DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
-
Salman Khan: ‘మీరంతా ఎలా ఉన్నారు?’.. అనారోగ్య రూమర్లకు ఒక్క పోస్టుతో చెక్ పెట్టిన సల్మాన్ ఖాన్
-
Hyderabad: హైదరాబాద్లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!