SLBC Tunnel: టన్నెల్లో చిక్కుకున్న వారు ప్రాణాలతో ఉంటారని భావించలేం: ఎన్డీఆర్ఎఫ్
- టన్నెల్లో చిక్కుకున్న వారు ప్రాణాలతో ఉంటారని భావించలేమన్న ఎన్డీఆర్ఎఫ్ అధికారులు
- 500 మీటర్ల మేర మట్టి, సిమెంట్ రింగుల శిథిలాలతో మూసుకుపోయాయి.
- దాదాపు 2 కిలోమీటర్ల మేర నీటిలో మునిగిన రైల్వే ట్రాక్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SLBC Tunnel: SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకురావడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందని ఎన్డీఆర్ఎఫ్ (NDRF) అధికారులు స్పష్టం చేశారు. టన్నెల్ లోపల ప్రాణాలతో ఎవరు ఉన్నారో చెప్పడం సాధ్యం కాకపోయినా, శిథిలాలను పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. టన్నెల్ బోరింగ్ మిషన్ (TBM) పూర్తిగా ధ్వంసమైన కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని.. ప్రమాదం జరిగిన ప్రాంతం మొత్తం 14 కిలోమీటర వద్ద టన్నెల్లో ఉండగా, దాదాపు 500 మీటర్ల మేర మట్టి, సిమెంట్ రింగుల శిథిలాలతో మూసుకుపోయిందని అన్నారు. ఇది సహాయక చర్యలకు ప్రధాన అవరోధంగా మారిందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Dubba Rajanna Swamy: నేటి నుండి దుబ్బ రాజన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Also Read
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
- Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
శిథిలాలను తొలగించడానికి లోపలికి ప్రవేశించడానికి రైల్వే ట్రాక్నే ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు. కార్మికులు, యంత్ర పరికరాలను తరలించేందుకు ప్రత్యేకంగా రైల్వే ట్రాక్ ఏర్పాటు చేసినా.. భారీ యంత్రాలను లోపలికి తీసుకెళ్లడం ప్రస్తుతం సాధ్యం కావడం లేదని అన్నారు. అంతేకాకుండా, ప్రమాదం జరిగిన ప్రాంతంలో రైల్వే ట్రాక్ దాదాపు 2 కిలోమీటర్ల మేర నీటిలో మునిగిపోయిందని, ఆ ప్రాంతంలో నీరు నడుము లోతు వరకు చేరడంతో సహాయక చర్యలు మరింత కష్టతరమయ్యాయని అధికారులు తెలిపారు.
Read Also: Madhavaram Krishna Rao: ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్లోకి భారీగా యువకుల చేరిక..
ప్రమాదం జరిగిన ప్రాంతంలో విద్యుత్ సరఫరా కూడా నిలిపివేయడంతో, లోపలికి సహాయక బృందాలను పంపడంలో మరింత జాప్యం ఏర్పడుతోంది. శిథిలాలను తొలగించడం ఒకటి అయితే, వాటిని బయటకు తీసుకురావడం మరో పెద్ద సవాలుగా మారిందని అధికారులు తెలిపారు. శిథిలాలు పూర్తిగా TBM (Tunnel Boring Machine)పై పడిపోవడంతో, దాన్ని పూర్తిగా కట్ చేయకపోతే సహాయక చర్యలు ముందుకు సాగవని అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితులను గమనిస్తే, మొత్తం శిథిలాలను తొలగించడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం సహాయక బృందాలు శిథిలాలను తొలగించే ప్రక్రియలో నిమగ్నమై ఉండగా, మరిన్ని ప్రత్యేక యంత్రాలను రంగంలోకి దించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు. కానీ, ప్రమాద స్థలంలోని సంక్లిష్ట పరిస్థితులు సహాయక చర్యలను మరింత ఆలస్యం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
-
Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..