Chitradurga shocker: ఓ ఇంట్లో ఐదు అస్థిపంజరాలు.. అసలేం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chitradurga shocker: కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి అస్థిపంజరాల అవశేషాలు లభ్యమయ్యాయి. చిత్రదుర్గ నగరంలోని పాత బెంగళూరు రోడ్డులోని ఓ పాడుబడిన ఇంట్లో గురువారం ఐదుగురు వ్యక్తుల అస్థిపంజరాలు లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. గురువారం రాత్రి పరిస్థితిని గమనించిన పోలీసులు అప్రమత్తమై ఆ తర్వాత పరిసరాల్లో సోదాలు చేపట్టారు. ఫోరెన్సిక్ నిపుణులు రాత్రి తర్వాత అక్కడికి చేరుకుని అవశేషాల నుంచి నమూనాలను సేకరించారు. ఆ కుటుంబం పూర్తిగా ఏకాంత జీవితం గడిపిందని, ఆ ఐదుగుపు పూర్తిగా 2019లో జులైలో చివరిసారిగా కనిపించారని, అనంతరం వారి నివాసానికి తాళం వేసి ఉందని తెలిసింది. ఇప్పుడు ఇలా అస్థిపంజరాలు దొరకడం స్థానికంగా కలకలం రేపుతోంది.
Read Also: Canada : కెనడాలోని హిందూ దేవాలయాలపై దాడి.. హుండీల దొంగ దొరికేశాడు
Also Read
- Modi-Mojtaba: మోడీకి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా లేఖ.. సారాంశం ఇదే!
- Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ 'రాగి మిల్క్'.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- Modi-Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకానున్న భారత్.. ఎవరెళ్తున్నారంటే..!
- HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ స్థలం రిటైర్డ్ ఇంజనీర్ జగన్నాథరెడ్డికి చెందినదని, కొన్నాళ్లుగా అతని కుటుంబం కనిపించడం లేదని తెలిపారు. దాదాపు నాలుగైదు సంవత్సరాలుగా ఇల్లు మూసి ఉంచబడింది. 2019లో ఆ నివాసం నుంచి దుర్వాసన వచ్చింది. చనిపోయిన ఎలుక చనిపోయిందనుకుని స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయలేదు. సుమారు రెండు నెలల క్రితం, ఉదయం అక్కడ నుంచి వెళ్తున్న సమయంలో స్థానికులు ఆ ఇంటి తలుపు పగలగొట్టి ఉండడాన్ని గమనించారు, అయినప్పటికీ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆ ఇంటి వెనుక ద్వారం కూడా పగలగొట్టబడింది. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు తనిఖీలు చేపట్టడంతో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ విషయంపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఈ ఇంట్లో జగన్నాథరెడ్డి (సుమారు 80 సంవత్సరాలు), అతని భార్య ప్రేమ (70 సంవత్సరాలు), వారి కుమార్తె త్రివేణి, కుమారులు కృష్ణారెడ్డి, నరేంద్ర రెడ్డిలు నివాసముంటున్నారు. జగన్నాథరెడ్డి పెద్ద కుమారుడు మంజునాథ్ రెడ్డి కొన్నేళ్ల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వెలుగులోకి రావడంతో జగన్నాథ్ రెడ్డి బంధువు పవన్ కుమార్ మరణాలపై అనుమానాలు వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసుకు సంబంధించి తదుపరి విచారణలు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తాతా.. 18 వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసిన 80 ఏళ్ల వృద్ధుడు!
-
Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. రేపు రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు!
-
Modi-Mojtaba: మోడీకి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా లేఖ.. సారాంశం ఇదే!
-
ENE Repeat: ఈ నగరానికి ఏమైంది Repeat.. దుమ్మురేపెందుకు మళ్ళీ రెడీ
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!