Canada : కెనడాలోని హిందూ దేవాలయాలపై దాడి.. హుండీల దొంగ దొరికేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada : కెనడాలోని అంటారియో ప్రావిన్స్లో గత కొన్ని నెలలుగా హిందూ దేవాలయాలపై అనేక దాడులు జరిగాయి. ఈ దాడులు దేశంలో మతపరమైన ఉద్రిక్తతను కూడా పెంచాయి. ఇప్పుడు దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటూ.. కెనడా పోలీసులు 41 ఏళ్ల జగదీష్ పంధర్ను అరెస్టు చేశారు. జగదీష్ పంధర్ గ్రేటర్ టొరంటో ఏరియాలోని బ్రాంప్టన్లో నివసిస్తున్నాడు. ఆయనపై ఇప్పటికే పలు అభియోగాలపై కేసులు పెండింగ్లో ఉండగా, ప్రస్తుతం బెయిల్పై బయటకు వచ్చారు. గతేడాది కూడా కొన్ని ప్రార్థనా స్థలాలను టార్గెట్ చేశాడు. అక్టోబరు 8న హిందూ దేవాలయంలోకి ప్రవేశించిన వ్యక్తిని సీసీ కెమెరాల్లో చూసినట్లు పోలీసులు చెబుతున్నారు.
Read Also:Rohit Sharma: కెప్టెన్గా రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు!
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
దీని తరువాత అతను ఆలయాన్ని ధ్వంసం చేసి, అక్కడ ఉంచిన హుండీల నుండి పెద్ద మొత్తంలో నగదుతో ఉడాయించాడు. గుడికి వెళుతున్నట్లు ఫుటేజీలో కనిపించింది. దీని తరువాత విచారణ పురోగతిలో ఒకే వ్యక్తి చాలా దేవాలయాలలో ఇలాంటి సంఘటనలకు పాల్పడ్డాడని తేలింది. అతను డర్హామ్, గ్రేటర్ టొరంటోలోని అనేక దేవాలయాలలో ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడు. ఈ ఘటనలు దేవాలయాల్లో జరిగినా వాటిని ద్వేషపూరిత నేరాలుగా గానీ, ద్వేషం కారణంగా జరిగిన ఘటనలుగా గానీ చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు. సెప్టెంబర్ నుండి అంటారియోలో కనీసం ఆరు దేవాలయాలు దెబ్బతిన్నాయి.
Read Also:PVR INOX: సౌత్ లో రచ్చ రేపే ఆఫర్ తో దిగుతున్న పీవీఆర్.. వింటే సినిమాలకి వెళ్లకుండా ఆగలేరు!
హిందూ సమాజం ఈ అంశాన్ని నిరంతరం లేవనెత్తుతోంది. ఇప్పటివరకు దెబ్బతిన్న ఆలయాలలో పికరింగ్లోని దేవి ఆలయం, అజాక్స్లోని సంకట్ మోచన్ ఆలయం, ఓషావాలోని హిందూ దేవాలయం ఉన్నాయి. ఇది కాకుండా, గ్రేటర్ టొరంటోలో మూడు దేవాలయాలపై దాడులు జరిగిన సంఘటనలు కూడా నమోదయ్యాయి. అలాంటి కొన్ని సంఘటనలు 2021లో కూడా జరిగాయి. ఇలా మొత్తం 18 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు 2022 మార్చిలో కూడా హిందూ దేవాలయాలపై దాడుల కేసుల్లో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మార్చిలో పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తుల్లో జగదీప్ పందేర్ ఒకరు. దీంతో పాటు గురుశరంజిత్ ధిండా, పర్మీందర్ గిల్, గుర్దీప్ పంధేర్లను కూడా అరెస్టు చేశారు. ఈ వ్యక్తులు ఎక్కువగా హిందూ దేవాలయాలను పాడు చేశారు. కానీ జైన దేవాలయాలు, గురుద్వారాలను కూడా ధ్వంసం చేసి దోచుకున్నారు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!