Miss Indonesia Universe: లోదుస్తులను విప్పమని కోరారు.. మిస్ ఇండోనేషియా యూనివర్స్ నిర్వాహకులపై ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Miss Indonesia Universe: మిస్ ఇండోనేషియా యూనివర్స్ పోటీకి చెందిన ఆరుగురు పోటీదారులు నిర్వాహకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోటీ సమయంలో తాము టాప్లెస్ ‘బాడీ చెక్’లకు గురయ్యామని పోటీదారులు ఆరోపించారు. పోటీదారులు నివేదికను సమర్పించారని, దానిని విచారిస్తామని పోలీసులు ధృవీకరించారు. మిస్ ఇండోనేషియా యూనివర్స్ అందాల పోటీలు రాజధాని జకార్తాలో జులై 29 నుండి ఆగస్టు 3 వరకు జరిగాయి. పురుషులతో సహా 20 మంది కంటే ఎక్కువ మంది ఉన్న గదిలో భౌతిక తనిఖీ కోసం ఐదుగురిని లోదుస్తులను విప్పమని నిర్వాహకులు కోరారని పోటీదారులు ఆరోపించారు.
Also Read: AI- Jobs Loss: ఏఐతో ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన.. ఉద్యోగాలు పోతాయనే భయం
Also Read
- Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
- Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- Akhil Raj: "డెలివరీ బాయ్ని కొట్టారు.. ఉమ్మేశారు".. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
అటువంటి విచారణ అవసరం లేదని పోటీదారుల న్యాయవాది మెలిస్సా ఆంగ్రేని అన్నారు. ఆరుగురు పోటీదారులు ఫిర్యాదులు చేశారని తెలిపారు. ఫిర్యాదుదారుల్లో ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. కాళ్లు తెరవడంతోపాటు అనుచితంగా పోజులివ్వాలని అడిగారని వెల్లడించారు. “వారు నన్ను తదేకంగా చూస్తున్నట్లు అనిపించింది, నేను చాలా గందరగోళంగా, అసౌకర్యంగా ఉన్నాను” అని ఫిర్యాదు చేసిన మహిళ తెలిపింది. ఈ విషయంపై మిస్ యూనివర్స్ పోటీకి సంబంధించి నిర్వాహకులు లేదా వ్యక్తుల నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. జకార్తా పోలీసు ప్రతినిధి ట్రునోయుడో విస్ను ఎండికో మాట్లాడుతూ.. పోటీదారుల నుంచి సోమవారం నివేదిక అందిందని, దీనిపై విచారణ జరుపుతామని చెప్పారు. గతంలో ఇండోనేషియాలోని పలు మత సంఘాలు అందాల పోటీలపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం ఇండోనేషియానే కావడం గమనార్హం.
Also Read: ChatGPT : చాట్ జీపిటి లో బిగ్ చెంజెస్… వచ్చే వారం మరో కొత్త ఫీచర్స్..
థాయ్ సెలబ్రిటీ మీడియా టైకూన్, లింగమార్పిడి హక్కుల న్యాయవాది అయిన జాకపాంగ్ అన్నే జకర్జుతాటిప్ గత సంవత్సరం మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ను 20 మిలియన్ల డాలర్లకు కొనుగోలు చేశారు. ఈ ఏడాది చివర్లో ఎల్ సాల్వడార్లో జరిగే వార్షిక మిస్ యూనివర్స్ పోటీకి ఇండోనేషియా ఎంట్రీని ఎంపిక చేయడానికి జకార్తాలో పోటీ జరిగింది. 1996- 2002 మధ్యకాలంలో డొనాల్డ్ ట్రంప్ సహ-యాజమాన్యంలో ఉన్న మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న పోటీ 1952 నుంచి నడుస్తోంది.
తాజావార్తలు
-
Health Tips: టూత్ బ్రష్ ను బాత్రూమ్ లోనే పెడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది
-
Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
-
Ramayana : లాస్ ఏంజెల్స్లో ‘రామాయణ’ ట్రైలర్ లాంచ్
-
Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
-
OnePlus N6: వన్ ప్లస్ N6 భారత్ లో లాంచ్.. 8,000mAh బ్యాటరీతో బడ్జెట్ బీస్ట్!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!