Miss Indonesia Universe: లోదుస్తులను విప్పమని కోరారు.. మిస్ ఇండోనేషియా యూనివర్స్ నిర్వాహకులపై ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Miss Indonesia Universe: మిస్ ఇండోనేషియా యూనివర్స్ పోటీకి చెందిన ఆరుగురు పోటీదారులు నిర్వాహకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోటీ సమయంలో తాము టాప్లెస్ ‘బాడీ చెక్’లకు గురయ్యామని పోటీదారులు ఆరోపించారు. పోటీదారులు నివేదికను సమర్పించారని, దానిని విచారిస్తామని పోలీసులు ధృవీకరించారు. మిస్ ఇండోనేషియా యూనివర్స్ అందాల పోటీలు రాజధాని జకార్తాలో జులై 29 నుండి ఆగస్టు 3 వరకు జరిగాయి. పురుషులతో సహా 20 మంది కంటే ఎక్కువ మంది ఉన్న గదిలో భౌతిక తనిఖీ కోసం ఐదుగురిని లోదుస్తులను విప్పమని నిర్వాహకులు కోరారని పోటీదారులు ఆరోపించారు.
Also Read: AI- Jobs Loss: ఏఐతో ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన.. ఉద్యోగాలు పోతాయనే భయం
Also Read
- Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
- Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
- Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
- Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో 'లగ్జరీ' ఫోన్.. రేపు అందుబాటులోకి..
అటువంటి విచారణ అవసరం లేదని పోటీదారుల న్యాయవాది మెలిస్సా ఆంగ్రేని అన్నారు. ఆరుగురు పోటీదారులు ఫిర్యాదులు చేశారని తెలిపారు. ఫిర్యాదుదారుల్లో ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. కాళ్లు తెరవడంతోపాటు అనుచితంగా పోజులివ్వాలని అడిగారని వెల్లడించారు. “వారు నన్ను తదేకంగా చూస్తున్నట్లు అనిపించింది, నేను చాలా గందరగోళంగా, అసౌకర్యంగా ఉన్నాను” అని ఫిర్యాదు చేసిన మహిళ తెలిపింది. ఈ విషయంపై మిస్ యూనివర్స్ పోటీకి సంబంధించి నిర్వాహకులు లేదా వ్యక్తుల నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. జకార్తా పోలీసు ప్రతినిధి ట్రునోయుడో విస్ను ఎండికో మాట్లాడుతూ.. పోటీదారుల నుంచి సోమవారం నివేదిక అందిందని, దీనిపై విచారణ జరుపుతామని చెప్పారు. గతంలో ఇండోనేషియాలోని పలు మత సంఘాలు అందాల పోటీలపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం ఇండోనేషియానే కావడం గమనార్హం.
Also Read: ChatGPT : చాట్ జీపిటి లో బిగ్ చెంజెస్… వచ్చే వారం మరో కొత్త ఫీచర్స్..
థాయ్ సెలబ్రిటీ మీడియా టైకూన్, లింగమార్పిడి హక్కుల న్యాయవాది అయిన జాకపాంగ్ అన్నే జకర్జుతాటిప్ గత సంవత్సరం మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ను 20 మిలియన్ల డాలర్లకు కొనుగోలు చేశారు. ఈ ఏడాది చివర్లో ఎల్ సాల్వడార్లో జరిగే వార్షిక మిస్ యూనివర్స్ పోటీకి ఇండోనేషియా ఎంట్రీని ఎంపిక చేయడానికి జకార్తాలో పోటీ జరిగింది. 1996- 2002 మధ్యకాలంలో డొనాల్డ్ ట్రంప్ సహ-యాజమాన్యంలో ఉన్న మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న పోటీ 1952 నుంచి నడుస్తోంది.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!