Miss Indonesia Universe: లోదుస్తులను విప్పమని కోరారు.. మిస్ ఇండోనేషియా యూనివర్స్ నిర్వాహకులపై ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Miss Indonesia Universe: మిస్ ఇండోనేషియా యూనివర్స్ పోటీకి చెందిన ఆరుగురు పోటీదారులు నిర్వాహకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోటీ సమయంలో తాము టాప్లెస్ ‘బాడీ చెక్’లకు గురయ్యామని పోటీదారులు ఆరోపించారు. పోటీదారులు నివేదికను సమర్పించారని, దానిని విచారిస్తామని పోలీసులు ధృవీకరించారు. మిస్ ఇండోనేషియా యూనివర్స్ అందాల పోటీలు రాజధాని జకార్తాలో జులై 29 నుండి ఆగస్టు 3 వరకు జరిగాయి. పురుషులతో సహా 20 మంది కంటే ఎక్కువ మంది ఉన్న గదిలో భౌతిక తనిఖీ కోసం ఐదుగురిని లోదుస్తులను విప్పమని నిర్వాహకులు కోరారని పోటీదారులు ఆరోపించారు.
Also Read: AI- Jobs Loss: ఏఐతో ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన.. ఉద్యోగాలు పోతాయనే భయం
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
అటువంటి విచారణ అవసరం లేదని పోటీదారుల న్యాయవాది మెలిస్సా ఆంగ్రేని అన్నారు. ఆరుగురు పోటీదారులు ఫిర్యాదులు చేశారని తెలిపారు. ఫిర్యాదుదారుల్లో ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. కాళ్లు తెరవడంతోపాటు అనుచితంగా పోజులివ్వాలని అడిగారని వెల్లడించారు. “వారు నన్ను తదేకంగా చూస్తున్నట్లు అనిపించింది, నేను చాలా గందరగోళంగా, అసౌకర్యంగా ఉన్నాను” అని ఫిర్యాదు చేసిన మహిళ తెలిపింది. ఈ విషయంపై మిస్ యూనివర్స్ పోటీకి సంబంధించి నిర్వాహకులు లేదా వ్యక్తుల నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. జకార్తా పోలీసు ప్రతినిధి ట్రునోయుడో విస్ను ఎండికో మాట్లాడుతూ.. పోటీదారుల నుంచి సోమవారం నివేదిక అందిందని, దీనిపై విచారణ జరుపుతామని చెప్పారు. గతంలో ఇండోనేషియాలోని పలు మత సంఘాలు అందాల పోటీలపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం ఇండోనేషియానే కావడం గమనార్హం.
Also Read: ChatGPT : చాట్ జీపిటి లో బిగ్ చెంజెస్… వచ్చే వారం మరో కొత్త ఫీచర్స్..
థాయ్ సెలబ్రిటీ మీడియా టైకూన్, లింగమార్పిడి హక్కుల న్యాయవాది అయిన జాకపాంగ్ అన్నే జకర్జుతాటిప్ గత సంవత్సరం మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ను 20 మిలియన్ల డాలర్లకు కొనుగోలు చేశారు. ఈ ఏడాది చివర్లో ఎల్ సాల్వడార్లో జరిగే వార్షిక మిస్ యూనివర్స్ పోటీకి ఇండోనేషియా ఎంట్రీని ఎంపిక చేయడానికి జకార్తాలో పోటీ జరిగింది. 1996- 2002 మధ్యకాలంలో డొనాల్డ్ ట్రంప్ సహ-యాజమాన్యంలో ఉన్న మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న పోటీ 1952 నుంచి నడుస్తోంది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!