CM KCR: సీఎం కేసీఆర్ నిఖార్సైన హిందూ.. గుండెల నిండా భక్తిభావం గల వ్యక్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Harish Rao Comments at Sita Ramachandra Swamy Idol Re-Installed in Valmidi: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం వల్మిడి గ్రామంలోని గుట్టపైన శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం నేడు త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంకు మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరయ్యారు.
వల్మిడిలో శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… ‘వాల్మికి మహర్షి పుట్టిన గడ్డకు గొప్ప కీర్తిని తీసుకువచ్చేలా మంత్రి ఎర్రబెల్లి కృషి చేస్తున్నారు. సీతారాములు నడియాడిన నేల, లవకుశులు జన్మించిన పుణ్యభూమిపై రామాలయం నిర్మించడం అభినందనీయం. మునుల గుట్టపై రామానుజన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. వాల్మిడి గుట్టపై రామాలయం ఉంది. ఈ రెండు గుట్టల మధ్య కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తాం. సీఎం కేసీఆర్ నిఖార్సైన హిందూ. గుండెల నిండా భక్తిభావం గల వ్యక్తి. పరిపాలకుడి కృప వల్ల విస్తారంగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉంది’ అని అన్నారు.
Also Read
- Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ "పన్నీర్ టిక్కా"ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
- Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
- Hyderabad: హైదరాబాద్లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
- Natural Skin Care: నిమ్మ తొక్కతో హోం బ్యూటీ ట్రీట్మెంట్.. కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… ‘ముఖ్యమంత్రి కేసీఆర్ దైవభక్తుడు. ఆయన నేతృత్వంలో ఆలయాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. ధూపదీప నైవేద్యాలకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.కేసీఆర్ చేసిన చండీయాగంతో వర్షాలు సంవృద్దిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉంది’ అని పేర్కొన్నారు.
Also Read: Rahkeem Cornwall: 12 సిక్స్లతో వీరవిహారం.. 48 బంతుల్లో ‘బహుబలి’ సెంచరీ!
‘వల్మిడి గుట్టపై రాముడి పాదాలు ఉన్నాయి. ఆ పాదాలపైనే ఆలయం నిర్మించాం. లవకుశులు నడియాడిన నేల ఇది. అయోధ్య, భద్రాచలం మాదిరిగా వల్మిడి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. పాలకుర్తి సోమనాథ్ ల్మక్ష్మీనరసింహా స్వామి ఆలయం, వాల్మిడి రామాలయంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.
తాజావార్తలు
-
RAAKA: ‘రాకా’లో తెలుగు బ్యూటీ ఎంట్రీ…. అల్లు అర్జున్ సినిమాతో సిరి హనుమంతుకు బిగ్ బ్రేక్!
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Jananayagan Bookings : నిరాశపరిచిన జననాయగన్ అడ్వాన్స్ బుకింగ్స్.. కూలీని టచ్ చేయడం కూడా కష్టమే
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!