CM KCR: సీఎం కేసీఆర్ నిఖార్సైన హిందూ.. గుండెల నిండా భక్తిభావం గల వ్యక్తి!
Minister Harish Rao Comments at Sita Ramachandra Swamy Idol Re-Installed in Valmidi: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం వల్మిడి గ్రామంలోని గుట్టపైన శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం నేడు త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంకు మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరయ్యారు.
వల్మిడిలో శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… ‘వాల్మికి మహర్షి పుట్టిన గడ్డకు గొప్ప కీర్తిని తీసుకువచ్చేలా మంత్రి ఎర్రబెల్లి కృషి చేస్తున్నారు. సీతారాములు నడియాడిన నేల, లవకుశులు జన్మించిన పుణ్యభూమిపై రామాలయం నిర్మించడం అభినందనీయం. మునుల గుట్టపై రామానుజన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. వాల్మిడి గుట్టపై రామాలయం ఉంది. ఈ రెండు గుట్టల మధ్య కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తాం. సీఎం కేసీఆర్ నిఖార్సైన హిందూ. గుండెల నిండా భక్తిభావం గల వ్యక్తి. పరిపాలకుడి కృప వల్ల విస్తారంగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉంది’ అని అన్నారు.
Also Read
- Rohit Sharma గాయంపై కీలక అప్డేట్.. కెప్టెన్ Hardik Pandya ఏమన్నాడంటే.!
- Babar Azam: ఒక్క సెంచరీతో.. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ సరసన నిలిచిన బాబర్ ఆజమ్..
- IFS Transfers : అటవీ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… ‘ముఖ్యమంత్రి కేసీఆర్ దైవభక్తుడు. ఆయన నేతృత్వంలో ఆలయాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. ధూపదీప నైవేద్యాలకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.కేసీఆర్ చేసిన చండీయాగంతో వర్షాలు సంవృద్దిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉంది’ అని పేర్కొన్నారు.
Also Read: Rahkeem Cornwall: 12 సిక్స్లతో వీరవిహారం.. 48 బంతుల్లో ‘బహుబలి’ సెంచరీ!
‘వల్మిడి గుట్టపై రాముడి పాదాలు ఉన్నాయి. ఆ పాదాలపైనే ఆలయం నిర్మించాం. లవకుశులు నడియాడిన నేల ఇది. అయోధ్య, భద్రాచలం మాదిరిగా వల్మిడి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. పాలకుర్తి సోమనాథ్ ల్మక్ష్మీనరసింహా స్వామి ఆలయం, వాల్మిడి రామాలయంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.
తాజావార్తలు
-
Rohit Sharma గాయంపై కీలక అప్డేట్.. కెప్టెన్ Hardik Pandya ఏమన్నాడంటే.!
-
Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
-
Babar Azam: ఒక్క సెంచరీతో.. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ సరసన నిలిచిన బాబర్ ఆజమ్..
-
IFS Transfers : అటవీ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?