CM KCR: సీఎం కేసీఆర్ నిఖార్సైన హిందూ.. గుండెల నిండా భక్తిభావం గల వ్యక్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Harish Rao Comments at Sita Ramachandra Swamy Idol Re-Installed in Valmidi: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం వల్మిడి గ్రామంలోని గుట్టపైన శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం నేడు త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంకు మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరయ్యారు.
వల్మిడిలో శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… ‘వాల్మికి మహర్షి పుట్టిన గడ్డకు గొప్ప కీర్తిని తీసుకువచ్చేలా మంత్రి ఎర్రబెల్లి కృషి చేస్తున్నారు. సీతారాములు నడియాడిన నేల, లవకుశులు జన్మించిన పుణ్యభూమిపై రామాలయం నిర్మించడం అభినందనీయం. మునుల గుట్టపై రామానుజన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. వాల్మిడి గుట్టపై రామాలయం ఉంది. ఈ రెండు గుట్టల మధ్య కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తాం. సీఎం కేసీఆర్ నిఖార్సైన హిందూ. గుండెల నిండా భక్తిభావం గల వ్యక్తి. పరిపాలకుడి కృప వల్ల విస్తారంగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉంది’ అని అన్నారు.
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… ‘ముఖ్యమంత్రి కేసీఆర్ దైవభక్తుడు. ఆయన నేతృత్వంలో ఆలయాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. ధూపదీప నైవేద్యాలకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.కేసీఆర్ చేసిన చండీయాగంతో వర్షాలు సంవృద్దిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉంది’ అని పేర్కొన్నారు.
Also Read: Rahkeem Cornwall: 12 సిక్స్లతో వీరవిహారం.. 48 బంతుల్లో ‘బహుబలి’ సెంచరీ!
‘వల్మిడి గుట్టపై రాముడి పాదాలు ఉన్నాయి. ఆ పాదాలపైనే ఆలయం నిర్మించాం. లవకుశులు నడియాడిన నేల ఇది. అయోధ్య, భద్రాచలం మాదిరిగా వల్మిడి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. పాలకుర్తి సోమనాథ్ ల్మక్ష్మీనరసింహా స్వామి ఆలయం, వాల్మిడి రామాలయంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో పాత క్యాలెండర్లు ఇంకా ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం ఇది మంచిదేనా?
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!