Singireddy Niranjan Reddy : రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో ఎరువుల నిల్వలపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. అందుబాటులో యూరియా రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. యూరియాతో పాటు అన్ని ఎరువులు సరిపడినన్ని ఉన్నాయని, రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖ, జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నదన్నారు నిరంజన్ రెడ్డి.
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
రాష్ట్రంలో 2.18 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, ప్రైవేటు డీలర్ల వద్ద 90 వేల మెట్రిక్ టన్నులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద 41 వేల మెట్రిక్ టన్నులు, మార్క్ ఫెడ్ వద్ద 81 వేల మెట్రిక్ టన్నులు, కంపెనీ గోడౌన్లలో 6 వేల మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నట్లు ఆయన తెలిపారు. అందుబాటులో యూరియాతో పాటు మొత్తం 7.57 లక్షల మెట్రిక్ టన్నుల ఇతర ఎరువులు,
ఆయా జిల్లాల పంటలసాగు, పంటల పరిస్థితిని బట్టి ఎరువుల నిల్వ ఉన్నట్లు తెలిపారు. రాబోయే నాలుగు రోజులలో అందుబాటులోకి మరో 18 వేల మెట్రిక్ టన్నుల యూరియా, రైతులు దుష్ప్రచారాన్ని నమ్మి ఎరువుల కోసం ఆందోళన చెందవద్దన్నారు నిరంజన్ రెడ్డి. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని ఆయన వెల్లడించారు.
స్పిక్ కంపెనీ యూరియా 845 మెట్రిక్ టన్నులు వరంగల్ కు, క్రిభ్కో కంపెనీకి చెందిన 1,300 మెట్రిక్ టన్నుల ఎరువులు జగిత్యాలకు చేరుకున్నాయని తెలిపారు. క్రిభ్కో కంపెనీకి చెందిన 1,300 మెట్రిక్ టన్నులు తిమ్మాపూర్ కు, ఆర్సీఎఫ్ ఎరువులు 1,446 మెట్రిక్ టన్నులు అలాగే క్రిభ్కో కంపెనీకి చెందిన 1,300 మెట్రిక్ టన్నులు సనత్ నగర్ కు, ఆర్సీఎఫ్ కంపెనీ ఎరువులు 1,246 మెట్రిక్ టన్నులు జడ్చర్లకు సోమవారం చేరుకోనున్నాయని తెలిపారు. ఎన్.ఎఫ్.సీ.ఎల్ కంపెనీ ఎరువులు 1,316 మెట్రిక్ టన్నులు నిజామాబాద్ కు, 1,320 టన్నుల ఎరువులు కామారెడ్డికి ఆదివారమే చేరుకున్నాయని తెలిపారు. ఆర్సీఎఫ్ కంపెనీ ఎరువులు 2,600 మెట్రిక్ టన్నులు మిర్యాలగూడకు ఈ నెల 13న, పీపీఎల్ ఎరువులు 550 మెట్రిక్ టన్నులు ఖమ్మం జిల్లాకు, అదేవిధంగా అదే కంపెనీ ఎరువులు వరంగల్ జిల్లాకు 750 మెట్రిక్ టన్నులు, ఈనెల 14 లేదా 15 కు చేరుకుంటాయని తెలిపారు. ఎం.ఎఫ్.ఎల్ కంపెనీకి చెందిన 1,450 మెట్రిక్ టన్నుల ఎరువులు ఈ నెల 15న జడ్చర్ల రేక్ కు చేరుకుంటుందని మొత్తం 18,038 మెట్రిక్ టన్నుల యూరియా వివిధ జిల్లాకు చేరుకుంటుందని వెల్లడించారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!