Mangli:రూ.10 కోట్ల మోసం ఆరోపణలపై.. కన్నీళ్లు పెట్టుకుంటూ క్లారిటీ ఇచ్చిన మంగ్లీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ టాలీవుడ్ సింగర్ మంగ్లీపై రూ. 10 కోట్ల మోసం కేసు నమోదైందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు టాలీవుడ్లో కలకలం రేపాయి. న్యాయవాది సుబ్బారావు చేసిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి రాగా, దీనిపై మంగ్లీ ఘాటుగా స్పందించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ ఆమె పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాది సుబ్బారావు అనే వ్యక్తి మంగ్లీ తనను ఆర్థికంగా మోసం చేసిందని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ ఆరోపణలను మంగ్లీ తీవ్రంగా ఖండించారు. తాను ఎంతో కష్టపడి, అంచలంచెలుగా ఈ స్థాయికి చేరుకున్నానని.. ఎవరినీ పైసా కూడా మోసం చేయాల్సిన అవసరం తనకు లేదని ఆమె మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని మూవీ సాంగ్ లోడింగ్.. థమన్ మార్క్ మ్యూజిక్ రెడీ!
Also Read
- Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
- YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
- CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
- Vijay-Governor: విజయ్కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
మీడియాతో మాట్లాడే సమయంలో మంగ్లీ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. “సోషల్ మీడియాలో వార్తలు ఎంత వేగంగా, ఎంత తప్పుగా ప్రచారమవుతాయో ఇప్పుడు అర్థమవుతోంది. కేవలం ఫేమస్ కావాలనే ఉద్దేశంతో కొందరు వ్యక్తులు తప్పుడు కేసులు పెడుతున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా నిరాధారమైన ఆరోపణలు ప్రచారం చేసి ఒకరి జీవితాన్ని, గౌరవాన్ని దెబ్బతీయొద్దు’ అని ఆమె నెటిజన్లను కోరారు. చట్టంపై తనకు నమ్మకం ఉందని, నిజం త్వరలోనే బయటకు వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!