ప్రముఖ టాలీవుడ్ సింగర్ మంగ్లీపై రూ. 10 కోట్ల మోసం కేసు నమోదైందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు టాలీవుడ్లో కలకలం రేపాయి. న్యాయవాది సుబ్బారావు చేసిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి రాగా, దీనిపై మంగ్లీ ఘాటుగా స్పందించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ ఆమె పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాది సుబ్బారావు అనే వ్యక్తి మంగ్లీ తనను ఆర్థికంగా మోసం చేసిందని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. అయితే…