Bharat Jodo Yatra: రాహుల్తో కలిసి భారత్ జోడో యాత్రలో సిద్ధూ మూసేవాలా తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra: హత్యకు గురైన పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తండ్రి నేడు పంజాబ్లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రకు నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీని బల్కౌర్ సింగ్ సిద్ధూ కలిసిన వీడియోను పార్టీ ట్వీట్ చేసింది. ప్రముఖ పంజాబీ గాయకుడు దివంగత సిద్ధూ ముసేవాలా తండ్రి బాల్కౌర్ సింగ్ సిద్ధూరాహుల్ గాంధీతో కలిసి ద్వేషం, భయం, హింసను వ్యాప్తి చేసే శక్తులకు తగిన సమాధానం ఇచ్చారని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. పంజాబ్లోని మాన్సాలో పట్టపగలు సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యారని పేర్కొంది.
సిద్ధూ మూసేవాలాగా పేరుగాంచిన శుభదీప్ సింగ్ సిద్ధూ గతేడాది మే 29న పంజాబ్లోని మాన్సా జిల్లాలో కాల్చి చంపబడ్డాడు. కెనడాకు చెందిన లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు గోల్డీ బ్రార్ ఈ హత్యకు బాధ్యత వహించాడు. గత నెలలో అమెరికా అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు గోల్డీ బ్రార్ను అరెస్టు చేయడానికి దారితీసే ఏదైనా సమాచారం ఇస్తే రూ.2 కోట్ల బహుమతిని ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి బల్కౌర్ సింగ్ సూచించిన సంగతి తెలిసిందే. పారితోషికాన్ని కూడా తన జేబులోంచి ఇస్తానన్నారు.
Also Read
- Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
- Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
- West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
Marriage: వివాహంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. అదెలాగా అంటారా!
కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి మృతిని దృష్టిలో ఉంచుకుని 24 గంటల పాటు నిలిపివేసిన భారత్ జోడో యాత్ర ఇవాళ జలంధర్ ఖల్సా కాలేజ్ గ్రౌండ్ నుంచి తిరిగి ప్రారంభమైంది. యాత్రలో గుండెపోటు రావడంతో చౌదరి శనివారం మరణించారు. పంజాబ్లో భారత్ జోడో యాత్ర బుధవారం ఫతేఘర్ సాహిబ్లోని సిర్హింద్ నుంచి ప్రారంభమైంది. లోహ్రీ పండుగ నేపథ్యంలో శుక్రవారం యాత్రకు బ్రేక్ పడింది. సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన పాదయాత్ర జనవరి 30 నాటికి శ్రీనగర్లో ముగుస్తుంది. శ్రీనగర్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో గాంధీ జాతీయ జెండాను ఎగురవేస్తారని భావిస్తున్నారు. దీని కోసం కాంగ్రెస్ 21 ప్రతిపక్ష పార్టీల నాయకులను ఆహ్వానించింది.
आज #BharatJodoYatra में प्रसिद्ध पंजाबी गायक स्वर्गीय सिद्धू मूसेवाला के पिता बलकौर सिंह सिद्धू जी ने @RahulGandhi जी के साथ कदम मिलाकर नफ़रत, डर और हिंसा फैलाने वाली ताकतों को मुंहतोड़ जवाब दिया।
सिद्धू मूसेवाला की पंजाब के मानसा में दिनदहाड़े हत्या कर दी गई थी। pic.twitter.com/FnjwUIm6xa
— Congress (@INCIndia) January 15, 2023
తాజావార్తలు
-
Team India: ఇండియా-A జట్టులోకి మరో ఆల్రౌండర్ .. హర్ష్ దూబే అవుట్..
-
Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
-
Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
-
Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
-
Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!