Bharat Jodo Yatra: రాహుల్తో కలిసి భారత్ జోడో యాత్రలో సిద్ధూ మూసేవాలా తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra: హత్యకు గురైన పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తండ్రి నేడు పంజాబ్లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రకు నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీని బల్కౌర్ సింగ్ సిద్ధూ కలిసిన వీడియోను పార్టీ ట్వీట్ చేసింది. ప్రముఖ పంజాబీ గాయకుడు దివంగత సిద్ధూ ముసేవాలా తండ్రి బాల్కౌర్ సింగ్ సిద్ధూరాహుల్ గాంధీతో కలిసి ద్వేషం, భయం, హింసను వ్యాప్తి చేసే శక్తులకు తగిన సమాధానం ఇచ్చారని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. పంజాబ్లోని మాన్సాలో పట్టపగలు సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యారని పేర్కొంది.
సిద్ధూ మూసేవాలాగా పేరుగాంచిన శుభదీప్ సింగ్ సిద్ధూ గతేడాది మే 29న పంజాబ్లోని మాన్సా జిల్లాలో కాల్చి చంపబడ్డాడు. కెనడాకు చెందిన లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు గోల్డీ బ్రార్ ఈ హత్యకు బాధ్యత వహించాడు. గత నెలలో అమెరికా అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు గోల్డీ బ్రార్ను అరెస్టు చేయడానికి దారితీసే ఏదైనా సమాచారం ఇస్తే రూ.2 కోట్ల బహుమతిని ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి బల్కౌర్ సింగ్ సూచించిన సంగతి తెలిసిందే. పారితోషికాన్ని కూడా తన జేబులోంచి ఇస్తానన్నారు.
Also Read
- AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
- Danish Kaneria: "రాముడు, మోడీ, హిందుత్వాన్ని తిట్టడమే నిరసనా?".. సీజేపీ ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: టీ20ల్లో చరిత్ర సృష్టించే ఛాన్స్.. వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డు బద్దలు కొడతాడా?
- Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే "పచ్చిమిరపకాయ రోటి పచ్చడి" చేసేయండి ఇలా.!
Marriage: వివాహంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. అదెలాగా అంటారా!
కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి మృతిని దృష్టిలో ఉంచుకుని 24 గంటల పాటు నిలిపివేసిన భారత్ జోడో యాత్ర ఇవాళ జలంధర్ ఖల్సా కాలేజ్ గ్రౌండ్ నుంచి తిరిగి ప్రారంభమైంది. యాత్రలో గుండెపోటు రావడంతో చౌదరి శనివారం మరణించారు. పంజాబ్లో భారత్ జోడో యాత్ర బుధవారం ఫతేఘర్ సాహిబ్లోని సిర్హింద్ నుంచి ప్రారంభమైంది. లోహ్రీ పండుగ నేపథ్యంలో శుక్రవారం యాత్రకు బ్రేక్ పడింది. సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన పాదయాత్ర జనవరి 30 నాటికి శ్రీనగర్లో ముగుస్తుంది. శ్రీనగర్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో గాంధీ జాతీయ జెండాను ఎగురవేస్తారని భావిస్తున్నారు. దీని కోసం కాంగ్రెస్ 21 ప్రతిపక్ష పార్టీల నాయకులను ఆహ్వానించింది.
आज #BharatJodoYatra में प्रसिद्ध पंजाबी गायक स्वर्गीय सिद्धू मूसेवाला के पिता बलकौर सिंह सिद्धू जी ने @RahulGandhi जी के साथ कदम मिलाकर नफ़रत, डर और हिंसा फैलाने वाली ताकतों को मुंहतोड़ जवाब दिया।
सिद्धू मूसेवाला की पंजाब के मानसा में दिनदहाड़े हत्या कर दी गई थी। pic.twitter.com/FnjwUIm6xa
— Congress (@INCIndia) January 15, 2023
తాజావార్తలు
-
AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
-
Honor Pad X9 Max: హానర్ ప్యాడ్ X9 మ్యాక్స్ విడుదల.. 10,100 mAh బ్యాటరీ, 13- ఇంచెస్ 2.5K డిస్ప్లే
-
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను.. ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరేమో!
-
Danish Kaneria: “రాముడు, మోడీ, హిందుత్వాన్ని తిట్టడమే నిరసనా?”.. సీజేపీ ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: టీ20ల్లో చరిత్ర సృష్టించే ఛాన్స్.. వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డు బద్దలు కొడతాడా?
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!