Shubman Gill: గెలుస్తామనే నమ్మకం ఉంది.. అదే మా కొంపముంచింది!
- మూడో టెస్టులో భారత్ ఓటమి
- రవీంద్ర జడేజా పోరాటం వృథా
- ఓటమిపై స్పందించిన కెప్టెన్ శుభ్మన్ గిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్లో ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో భారత్ 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. 193 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 170 పరుగులకు ఆలౌటైంది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (61 నాటౌట్; 181 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం వృథా అయ్యింది. భారత్ టాపార్డర్, మిడిలార్డర్ వైఫల్యం కారణంగానే ఈజీగా గెలిచే టెస్టులో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇదే విషయాన్ని ఒప్పుకున్నాడు. టాపార్డర్లో 50 పరుగుల భాగస్వామ్యం నమోదై ఉంటే ఫలితం మరోలా ఉండేదని పేర్కొన్నాడు.
మ్యాచ్ అనంతరం శుభ్మన్ గిల్ మాట్లాడుతూ… ‘మ్యాచ్ ఓడినా చాలా గర్వంగా ఉంది. ఐదు రోజుల పాటు కష్టపడ్డాం. చివరి సెషన్, చివరి వికెట్ వరకూ విజయం కోసం పోరాడడం పట్ల సంతోషంగా ఉంది. నేను లక్ష్యంపై చాలా నమ్మకంగా ఉన్నాను. మంచి బ్యాటింగ్ లైనప్ ఉండటంతో మేం ఛేదిస్తామనుకున్నా. కానీ ఇంగ్లండ్ బౌలర్లు దాడి చేశారు. మా టాపార్డర్లో బహుశా రెండు 50 పరుగుల భాగస్వామ్యాలు నమోదైతే ఫలితం మరోలా ఉండేది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మా కంటే బాగా ఆడారు. బ్యాటర్లు క్రీజులో ఉన్నంత సేపు విజయంపై నమ్మకం ఉంది. ఎందుకంటే లక్ష్యం ఏమీ పెద్దది కాదు. 50-60 పరుగుల భాగస్వామ్యం వస్తే మ్యాచ్పై పట్టు సాధించవచ్చనే తెలుసు’ అని అన్నాడు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
‘రవీంద్ర జడేజా చాలా అనుభవజ్ఞుడు. అతనికి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకోలేదు. టెయిలెండర్స్ సాయంతో ఎక్కువసేపు బ్యాటింగ్ చేయాలనుకున్నాను. తొలి ఇన్నింగ్స్లో 80-100 ఆధిక్యం సాధిస్తే మ్యాచులో చాలా కీలకంగా మారేది. ఎందుకంటే ఈ వికెట్పై ఐదవ రోజు 150-200 పరుగులను ఛేదించడం అంత సులభం కాదు. 80 పరుగుల ఆధిక్యం ఉంటే మంచి స్థితిలో ఉండేవాళ్లం. కానీ అలా జరగలేదు. నాలుగో రోజు చివర్లో మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. ఆఖరి రెండు వికెట్లు పడాల్సింది కాదు. ఐదవ రోజు ఉదయం ఇంగ్లండ్ సరైన ప్రణాళికతో బౌలింగ్ చేసింది. టాపార్డర్లో ఓ 50 ప్లస్ పార్ట్నర్షిప్ వచ్చి ఉంటే ఫలితం అనుకూలంగా ఉండేది.ఈ మ్యాచ్లో మేం గెలవకపోయినా మంచి క్రికెట్ ఆడామని నేను అనుకుంటున్నాను. సిరీస్ మరింత రసవత్తరంగా ఉంటుంది. బుమ్రా తదుపరి టెస్ట్లో ఆడతారా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదు’ అని గిల్ తెలిపాడు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!