Shubman Gill: గెలుస్తామనే నమ్మకం ఉంది.. అదే మా కొంపముంచింది!
- మూడో టెస్టులో భారత్ ఓటమి
- రవీంద్ర జడేజా పోరాటం వృథా
- ఓటమిపై స్పందించిన కెప్టెన్ శుభ్మన్ గిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్లో ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో భారత్ 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. 193 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 170 పరుగులకు ఆలౌటైంది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (61 నాటౌట్; 181 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం వృథా అయ్యింది. భారత్ టాపార్డర్, మిడిలార్డర్ వైఫల్యం కారణంగానే ఈజీగా గెలిచే టెస్టులో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇదే విషయాన్ని ఒప్పుకున్నాడు. టాపార్డర్లో 50 పరుగుల భాగస్వామ్యం నమోదై ఉంటే ఫలితం మరోలా ఉండేదని పేర్కొన్నాడు.
మ్యాచ్ అనంతరం శుభ్మన్ గిల్ మాట్లాడుతూ… ‘మ్యాచ్ ఓడినా చాలా గర్వంగా ఉంది. ఐదు రోజుల పాటు కష్టపడ్డాం. చివరి సెషన్, చివరి వికెట్ వరకూ విజయం కోసం పోరాడడం పట్ల సంతోషంగా ఉంది. నేను లక్ష్యంపై చాలా నమ్మకంగా ఉన్నాను. మంచి బ్యాటింగ్ లైనప్ ఉండటంతో మేం ఛేదిస్తామనుకున్నా. కానీ ఇంగ్లండ్ బౌలర్లు దాడి చేశారు. మా టాపార్డర్లో బహుశా రెండు 50 పరుగుల భాగస్వామ్యాలు నమోదైతే ఫలితం మరోలా ఉండేది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మా కంటే బాగా ఆడారు. బ్యాటర్లు క్రీజులో ఉన్నంత సేపు విజయంపై నమ్మకం ఉంది. ఎందుకంటే లక్ష్యం ఏమీ పెద్దది కాదు. 50-60 పరుగుల భాగస్వామ్యం వస్తే మ్యాచ్పై పట్టు సాధించవచ్చనే తెలుసు’ అని అన్నాడు.
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
‘రవీంద్ర జడేజా చాలా అనుభవజ్ఞుడు. అతనికి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకోలేదు. టెయిలెండర్స్ సాయంతో ఎక్కువసేపు బ్యాటింగ్ చేయాలనుకున్నాను. తొలి ఇన్నింగ్స్లో 80-100 ఆధిక్యం సాధిస్తే మ్యాచులో చాలా కీలకంగా మారేది. ఎందుకంటే ఈ వికెట్పై ఐదవ రోజు 150-200 పరుగులను ఛేదించడం అంత సులభం కాదు. 80 పరుగుల ఆధిక్యం ఉంటే మంచి స్థితిలో ఉండేవాళ్లం. కానీ అలా జరగలేదు. నాలుగో రోజు చివర్లో మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. ఆఖరి రెండు వికెట్లు పడాల్సింది కాదు. ఐదవ రోజు ఉదయం ఇంగ్లండ్ సరైన ప్రణాళికతో బౌలింగ్ చేసింది. టాపార్డర్లో ఓ 50 ప్లస్ పార్ట్నర్షిప్ వచ్చి ఉంటే ఫలితం అనుకూలంగా ఉండేది.ఈ మ్యాచ్లో మేం గెలవకపోయినా మంచి క్రికెట్ ఆడామని నేను అనుకుంటున్నాను. సిరీస్ మరింత రసవత్తరంగా ఉంటుంది. బుమ్రా తదుపరి టెస్ట్లో ఆడతారా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదు’ అని గిల్ తెలిపాడు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!