Shreyas Iyer: “ఆ ప్లేయర్స్ మళ్లీ మళ్లీ తప్పులు చేస్తున్నారు”.. ఘోర ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ ఆవేదన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer: బ్రిస్టల్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లోనూ భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో భారత్ను చిత్తు చేసి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 3-0తో కైవసం చేసుకుంది. ఈ ఏడాది జూన్లో టీమిండియా టీ20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్కు.. సారథిగా మొదటి విజయం ఇంకా దక్కలేదు. ఈ పర్యటనలో అతను టాస్లు గెలవడంలో సఫలమవుతున్నప్పటికీ, జట్టును విజయతీరాలకు చేర్చడంలో మాత్రం విఫలమవుతున్నాడు. మ్యాచ్ అనంతరం అయ్యర్ మాట్లాడుతూ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. “ఈ ఓటమి నిజంగా తీవ్రంగా నిరాశపరిచింది. బోర్డుపై మేము ఉంచిన 158 పరుగులు ఏమాత్రం సరిపోయే స్కోరు కాదు. ఇంగ్లాండ్ ఎంత వేగంగా ఈ లక్ష్యాన్ని ఛేదించిందో మనం కళ్లారా చూశాం” అని అయ్యర్ పేర్కొన్నాడు.
ఈ పేలవ బౌలింగ్పై అయ్యర్ స్పందిస్తూ.. “మేము బౌలింగ్కు వచ్చినప్పుడు, వీలైనంత వరకు ఒకే లెంగ్త్ను పునరావృతం చేయమని బౌలర్లను కోరాను. ఎందుకంటే మిడిల్ అండ్ లెగ్ స్టంప్ లైన్లో వేసిన బంతులను కొట్టడం, బౌండరీలు రాబట్టడం పిచ్పై కాస్త కష్టంగా అనిపించింది. కానీ మా ప్లాన్స్ను సరిగ్గా అమలు చేయడంలో (Execution) బౌలర్లు విఫలమయ్యారు. మేము బంతి వేగాన్ని మార్చడానికి లేదా కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి చూసినప్పుడల్లా.. ఆ లూజ్ బాల్స్ను ఇంగ్లాండ్ బ్యాటర్లు సమర్థవంతంగా వాడుకుంటూ పరుగులు సాధించారు” అని విశ్లేషించాడు. ప్రస్తుతం టీమిండియాలో యువ ఆటగాళ్లు ఉన్నారని, కాబట్టి ఓపికగా ఉండటం అవసరమని అయ్యర్ అభిప్రాయపడ్డాడు. “ఖచ్చితంగా ఇది జట్టులో మార్పులు జరుగుతున్న సమయం. కాబట్టి యువ ఆటగాళ్లు చాలా తప్పులు చేస్తారు. ఎంతో మంది యువకులు ఇక్కడి వాతావరణంలో మొదటిసారి ఆడుతున్నారు. ఇలాంటి విదేశీ పరిస్థితుల్లో ఆడేటప్పుడు పరిస్థితులకు అలవాటు పడటం, అవగాహన కలిగి ఉండటం ఎంత ముఖ్యమో వారు ఈ తప్పుల ద్వారానే నేర్చుకుంటారు. చేసిన తప్పుల నుంచి ఎంత త్వరగా నేర్చుకుంటే జట్టుకు అంత మేలు జరుగుతుంది. మా జట్టులో త్వరగా నేర్చుకునే ఆటగాళ్లు ఉన్నారని నేను నమ్ముతున్నాను. వారు తమ తప్పులను సమీక్షించుకుని, తదుపరి మ్యాచ్లో మరింత బలంగా పునరాగమనం చేస్తారని ఆశిస్తున్నాను” అని అయ్యర్ ముగించాడు.
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
మరోవైపు.. భారత్ వరుసగా వికెట్లు కోల్పోతున్నా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్రీజులో నిలబడి 49 బంతుల్లో 80 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. తన వ్యక్తిగత ప్రదర్శనపై స్పందిస్తూ.. “నా బ్యాటింగ్ ప్రదర్శన పట్ల వ్యక్తిగతంగా సంతోషంగానే ఉన్నాను. కానీ జట్టు విజయంలో భాగం కానప్పుడు ఆ ప్రదర్శనకు పెద్దగా విలువ ఉండదు. నేను ఎప్పుడు ఆడినా జట్టును గెలిపించాలనే కోరుకుంటాను, ఆ కోణంలో ఈ రోజు నిరాశే మిగిలింది. దురదృష్టవశాత్తూ ఈ రోజు మాది కాదు. తదుపరి మ్యాచ్పై దృష్టి పెడతాను” అని అన్నాడు.
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!