Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్కు మళ్లీ నిరాశే.. 10 రోజుల వ్యవధిలో రెండో ఫైనల్ ఓటమి!
- శ్రేయస్ అయ్యర్కు మరోసారి తప్పని నిరాశ
- 10 రోజుల వ్యవధిలో రెండో ఫైనల్ ఓటమి
- ముంబై టీ20 లీగ్ 2025లో సోబో ముంబై ఫాల్కన్స్ టీమ్ ఓటమి
- ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ జట్టు ఓటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు మరోసారి నిరాశ తప్పలేదు. 10 రోజుల వ్యవధిలో సారథిగా శ్రేయస్ మరో ఫైనల్ ఓటమిని చవి చూశాడు. జూన్ 3న జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్లో శ్రేయస్ సారథ్యం వహించిన పంజాబ్ కింగ్స్ జట్టు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిన విషయం తెలిసిందే. ముంబై టీ20 ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా గురువారం ముంబై సౌత్ సెంట్రల్ మరాఠ రాయల్స్తో జరిగిన ఫైనల్లో శ్రేయస్ కెప్టెన్సీ చేసిన సోబో ముంబై ఫాల్కన్స్ టీమ్ ఓటమిని ఎదుర్కొంది.
శ్రేయస్ అయ్యర్ అద్భుత కెప్టెన్సీ కారణంగా 11 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ఫైనల్ చేరింది. అయితే ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ చేతిలో 6 రన్స్ తేడాతో ఓడి.. తృటిలో ట్రోఫీ మిస్ అయింది. తాజాగా ముంబై ప్రీమియర్ లీగ్ 2025లోనూ శ్రేయస్కు నిరాశే ఎదురైంది. అయితే రెండు ఫైనల్లో శ్రేయస్ విఫమలయ్యాడు. ఐపీఎల్ 2025 ఫైనల్లో 2 బంతులు ఆడిన అతడు 1 రన్ చేసి పెవిలియన్ చేరాడు. ముంబై ప్రీమియర్ లీగ్ ఫైనల్లో 17 బంతుల్లో 12 రన్స్ చేసి మరోసారి తక్కువ పరుగులకే ఔట్ అయ్యాడు. శ్రేయస్ వరుసగా రెండు ఫైనల్స్లో ఓడిపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది.
Also Read
- Delhi: జనరల్ బోగీలో సీటు కోసం హత్య.. ప్రేక్షకపాత్ర వహించిన ఆర్పీఎఫ్ సిబ్బంది!
- Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్కు బెయిల్..
- Siddipet District: కసాయి తల్లి.. ప్రియుడితో ఏకాంతానికి అడ్డొచ్చాడని రెండేళ్ల కొడుకును హతమార్చిన వైనం..
- NEET UG 2026 Re-Exam: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్.. హాల్ టికెట్ చూసి మైండ్ బ్లాక్!
Also Read: END vs ENG: రవీంద్ర జడేజా ఓ జట్టులో.. కుల్దీప్ యాదవ్ మరో జట్టులో!
ముంబై ప్రీమియర్ లీగ్ ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సోబో ముంబై ఫాల్కన్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 157 రన్స్ చేసింది. మయురెష్ తండెల్ (50 నాటౌట్), హర్ష్ అగవ్ (45 నాటౌట్) రాణించారు. వైభవ్ మాలి రెండు వికెట్స్ పడగొట్టాడు. ఛేదనలో ముంబై సౌత్ సెంట్రల్ మరాఠ రాయల్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు చేసి విజయం సాధించింది. చిన్మయ్ రాజేష్ సుతార్ (53), అవైస్ ఖాన్ నౌషధ్ (38) కీలక ఇన్నింగ్స్ ఆడారు. కార్తిక్ మిశ్రా, యష్ డిచోల్కర్ తలో రెండు వికెట్స్ పడగొట్టారు.
తాజావార్తలు
-
UK Grooming Gangs: 2,50,000 మంది అమ్మాయిలపై గ్రూమింగ్ గ్యాంగ్స్ దారుణాలు.. బ్రిటన్లో అసలేం జరిగింది?
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Delhi: జనరల్ బోగీలో సీటు కోసం హత్య.. ప్రేక్షకపాత్ర వహించిన ఆర్పీఎఫ్ సిబ్బంది!
-
Samsung Galaxy M47 5G: సామ్ సంగ్ గెలాక్సీ M47 5G టీజర్ విడుదల.. Snapdragon 6 Gen 3 చిప్సెట్తో త్వరలో లాంచ్
-
Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్కు బెయిల్..
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!