Shraddha Case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఆఫ్తాబ్ పూనావాలా నార్కో టెస్ట్ ముగిసింది. రెండు గంటలపాటు జరిగిన నార్కో టెస్టులో తన ప్రియురాలిపై జరిగిన పాశవిక హత్యను వివరించాడు. ఫోరెన్సిక్ అధికారులు దీనిని ధృవీకరించనప్పటికీ, అఫ్తాబ్ హత్య, మృతదేహాన్ని ముక్కలు చేసినట్లు అంగీకరించినట్లు వర్గాలు పేర్కొన్నాయి. శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా రోహిణిలోని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఆసుపత్రిలో గురువారం నార్కో పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన నార్కో పరీక్ష దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. ఎఫ్ఎస్ఎల్ అధికారులు, నిపుణుల సమక్షంలో జరిగిన పరీక్షలో అఫ్తాబ్ను పలు ప్రశ్నలు, సమాధానాలు అడిగారు.
Read Also: Raipur : మనీ లాండరింగ్ ఆరోపణలపై సీఎం డిప్యూటీ సెక్రటరీ అరెస్ట్
అతడిని 50కి పైగా ప్రశ్నలు అడిగినట్లు, ఇందులో భాగంగా శ్రద్ధ హత్య, మృతదేహం ఆచూకీతో సహా పలు రహస్యాలను వెల్లడించే ప్రయత్నం చేశామని అధికారులు ప్రకటించారు. గాఢనిద్రలో ఉన్న అఫ్తాబ్ని పదే పదే చప్పుడుతో నిద్రలేపి ప్రశ్నలకు సమాధానం రాబట్టామన్నారు. మధ్యాహ్నం 12.00 గంటల ప్రాంతంలో నార్కో పరీక్ష పూర్తయింది. అనంతరం గంటపాటు అబ్జర్వేషన్ రూంలో ఉంచామన్నారు. ఆ తర్వాత మళ్లీ వైద్యం చేయించాక… అర్ధరాత్రి 1.00 గంటల ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య తిరిగి తీహార్ జైలుకు తరలించారు.
Read Also: LAGOS : 11రోజులు అన్నం, నీళ్లు లేకుండా ఓడ వెనుక కూర్చుని..3,200 కి.మీ. ప్రయాణం
నార్కో టెస్ట్లో అఫ్తాబ్ ని ఏంప్రశ్నలడిగారు… ఏయే రహస్యాలు బయటపడ్డాయో వివరించేందుకు అధికారులు నిరాకరించారు. ఈ ప్రక్రియ చాలా గోప్యంగా ఉంచినట్లు చెప్పారు. నివేదిక తయారు చేసి కోర్టులో సమర్పించారు. దాని ఆధారంగానే కోర్టు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అతని పోస్ట్ నార్కో పరీక్ష కూడా జరుగుతుందని ఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సంజీవ్ గుప్తా తెలిపారు. నార్కో పరీక్ష పరీక్షను నిర్ధారించడానికి ఈ పరీక్ష జరుగుతుంది. అఫ్తాబ్ సమాధానాలను విశ్లేషించిన తర్వాత, నివేదిక సీలు చేసిన కవరులో కోర్టుకు సమర్పించనున్నారు.