సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్లో గవర్నర్-ప్రభుత్వం మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసును మంత్రివర్గం నుంచి తొలగించాలని మమతా బెనర్జీ ప్రభుత్వానికి గవర్నర్ సీవీ. ఆనంద బోస్ సిఫార్సు చేశారు. దీంతో రాజ్భవన్-ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. విద్యాశాఖ మంత్రి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ గవర్నర్ ఆరోపించారు.
మార్చి 30న గౌర్ బొంగో యూనివర్శిటీలో మంత్రి బ్రత్యా బసు సమక్షంలో రాజకీయ సమావేశం జరిగింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతలతో బ్రత్యా బసు పొలిటికల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లుగా గవర్నర్ కార్యాలయం భావించింది. దీంతో గవర్నర్ ఆనంద బోస్ ఈ చర్యకు పాల్పడ్డారు. పార్టీ నుంచి, మంత్రి పదవి నుంచి తొలగించాలని రాజ్భవన్ కోరింది. ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో రాజకీయ సమావేశాన్ని నిర్వహించడంతో విశ్వవిద్యాలయ వ్యవస్థకు అపఖ్యాతి వచ్చిందని గవర్నర్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Iran: భద్రతా బలగాలపై సున్నీ ఇస్లామిస్ట్ గ్రూప్ దాడి.. 27 మంది మృతి..
గవర్నర్ చర్యపై మంత్రి బసు మండిపడ్డారు. గవర్నర్ చర్య హాస్యాస్పదంగా ఉందన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. తాను కూడా గవర్నర్ను తొలగించాలని రాష్ట్రపతికి సిఫార్సు చేస్తే బాగుంటుందా? అని ప్రశ్నించారు. తాను ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
ఇది కూడా చదవండి:AP Weather: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు
ఇప్పటికే సందేశ్ఖాలీ ఘటనతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా రాజ్భవన్-రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో ఈ పరిస్థితులు ఎంత వరకు వెళ్తాయో వేచి చూడాలి.