West bengal: గవర్నర్-ప్రభుత్వం మధ్య ఘర్షణ.. కారణమిదే!
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్లో గవర్నర్-ప్రభుత్వం మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసును మంత్రివర్గం నుంచి తొలగించాలని మమతా బెనర్జీ ప్రభుత్వానికి గవర్నర్ సీవీ. ఆనంద బోస్ సిఫార్సు చేశారు. దీంతో రాజ్భవన్-ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. విద్యాశాఖ మంత్రి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ గవర్నర్ ఆరోపించారు.
మార్చి 30న గౌర్ బొంగో యూనివర్శిటీలో మంత్రి బ్రత్యా బసు సమక్షంలో రాజకీయ సమావేశం జరిగింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతలతో బ్రత్యా బసు పొలిటికల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లుగా గవర్నర్ కార్యాలయం భావించింది. దీంతో గవర్నర్ ఆనంద బోస్ ఈ చర్యకు పాల్పడ్డారు. పార్టీ నుంచి, మంత్రి పదవి నుంచి తొలగించాలని రాజ్భవన్ కోరింది. ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో రాజకీయ సమావేశాన్ని నిర్వహించడంతో విశ్వవిద్యాలయ వ్యవస్థకు అపఖ్యాతి వచ్చిందని గవర్నర్ వ్యాఖ్యానించారు.
Also Read
- Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
- Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
- Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
ఇది కూడా చదవండి: Iran: భద్రతా బలగాలపై సున్నీ ఇస్లామిస్ట్ గ్రూప్ దాడి.. 27 మంది మృతి..
గవర్నర్ చర్యపై మంత్రి బసు మండిపడ్డారు. గవర్నర్ చర్య హాస్యాస్పదంగా ఉందన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. తాను కూడా గవర్నర్ను తొలగించాలని రాష్ట్రపతికి సిఫార్సు చేస్తే బాగుంటుందా? అని ప్రశ్నించారు. తాను ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
ఇది కూడా చదవండి:AP Weather: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు
ఇప్పటికే సందేశ్ఖాలీ ఘటనతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా రాజ్భవన్-రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో ఈ పరిస్థితులు ఎంత వరకు వెళ్తాయో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!