Iran: భద్రతా బలగాలపై సున్నీ ఇస్లామిస్ట్ గ్రూప్ దాడి.. 27 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: ఇరాన్ భద్రతా బలగాలే టార్గెట్గా సున్నీ ఇస్లామిస్ట్ గ్రూప్ దాడులకు తెగబడింది. పాకిస్తాన్-ఇరాన్ సరిహద్దుల్లోని సిస్తాన్-బలూచిస్తాన్లోని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రధాన కార్యాలయంపై జైష్ అల్-అద్ల్ దాడికి చేసింది. ఈ దాడిలో 11 మంది ఇరాన్ భద్రతా దళ సభ్యులు మరణించగా.. 16 మంది ఇతరులు చనిపోయినట్లుగా ఇరాన్ స్టేట్ మీడియా గురువారం తెలిపింది. మరో 11 మంది భద్రతా అధికారులు గాయపడ్డారు. జైష్ అల్-అద్ల్ ఉగ్రసంస్థ భద్రతా బలగాలపై రాత్రిపూట దాడులు జరిపింది. చబహార్, రాస్క్ పట్టణాలలో ఈ దాడులు జరిగినట్లుగా స్టేట్ టీవీ తెలిపింది.
Read Also: Vegetarian Thali: వెజ్ థాలీ ధరలు పెరిగాయి, నాన్-వెజ్ థాలీ ధరలు తగ్గాయి.. కారణం ఇదే..
Also Read
- Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
- F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
చాబహార్, రాస్క్ లోని గార్డ్స్ ప్రధాన కార్యాలయాలను స్వాధీనం చేసుకోవడంలో ఉగ్రవాదులు విఫలమయ్యారని ఇరాన్ డిప్యూటీ ఇంటీరియర్ మినిస్టర్ మజిద్ మిరాహ్మది తెలిపారు. షియా ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ఇరాన్లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్సులో సున్నీ జనాభా ఎక్కువగా ఉంటుంది. ఇరాన్లో ఈ జాతుల మధ్య ఘర్షణల ఫలితంగా దాడులు జరుగుతున్నాయి. బలూచీలకు ఎక్కువ హక్కుల, మెరుగైన జీవన పరిస్థితులు కోరుకుంటున్నట్లు జైష్ అల్-అద్ల్ చెబుతోంది.
పాకిస్తాన్-ఇరాన్ సరిహద్దుల్లో ఉండే ఈ ప్రాంతంలో తరుచుగా ఉగ్రవాద సంస్థ, ఇరాన్ బలగాలకు మధ్య పోరాటం కొనసాగుతోంది. మాదకద్రవ్యాల రవాణా, సున్నీ మిలిటెంట్లను అడ్డుకోవడంతో దాడులు పెద్దవిగా మారుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి మాదక ద్రవ్యాలు వెస్ట్రన్ దేశాలకు వెళ్లడానికి ఇరాన్ కీలకమైన రవాణా మార్గంగా ఉంది. డిసెంబర్ నెలలో ఇదే తీవ్రవాద సంస్థ రస్క్ పట్టణంలో ఒక పోలీస్ స్టేషన్పై దాడి చేసి 11 మంది భద్రతా సిబ్బందిని చంపింది. ఆ తర్వాత ఇరాన్ పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్న తీవ్రవాద స్థావరాలపై రాకెట్లతో దాడి చేసింది. ఆ తర్వాత ప్రతీకారంగా పాకిస్తాన్, ఇరాన్పై దాడి చేసింది.
తాజావార్తలు
-
Veera Bhadrudu : ‘వీర భద్రుడు’కు అసలు పరీక్ష ఇదే..
-
Axar Patel: మిచెల్ స్టార్క్తో చర్చ.. ఆసక్తికర సమాధానం చెప్పిన అక్షర్ పటేల్!
-
PEDDI Trailer: ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్టింగ్కు టైం ఫిక్స్.. మెగా మాస్ జాతర ఏ టైంకి షురూ అవుతుందో తెలుసా?
-
Chanakya Niti: లోకంలో అతి నిజాయితీగా ఉంటే నష్టపోతారా? మనుషుల ప్రవర్తనపై చాణక్యుడి పవర్ఫుల్ లైఫ్ లెసన్!
-
Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..