Iran: భద్రతా బలగాలపై సున్నీ ఇస్లామిస్ట్ గ్రూప్ దాడి.. 27 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: ఇరాన్ భద్రతా బలగాలే టార్గెట్గా సున్నీ ఇస్లామిస్ట్ గ్రూప్ దాడులకు తెగబడింది. పాకిస్తాన్-ఇరాన్ సరిహద్దుల్లోని సిస్తాన్-బలూచిస్తాన్లోని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రధాన కార్యాలయంపై జైష్ అల్-అద్ల్ దాడికి చేసింది. ఈ దాడిలో 11 మంది ఇరాన్ భద్రతా దళ సభ్యులు మరణించగా.. 16 మంది ఇతరులు చనిపోయినట్లుగా ఇరాన్ స్టేట్ మీడియా గురువారం తెలిపింది. మరో 11 మంది భద్రతా అధికారులు గాయపడ్డారు. జైష్ అల్-అద్ల్ ఉగ్రసంస్థ భద్రతా బలగాలపై రాత్రిపూట దాడులు జరిపింది. చబహార్, రాస్క్ పట్టణాలలో ఈ దాడులు జరిగినట్లుగా స్టేట్ టీవీ తెలిపింది.
Read Also: Vegetarian Thali: వెజ్ థాలీ ధరలు పెరిగాయి, నాన్-వెజ్ థాలీ ధరలు తగ్గాయి.. కారణం ఇదే..
Also Read
- Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
- Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
- Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
- Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
చాబహార్, రాస్క్ లోని గార్డ్స్ ప్రధాన కార్యాలయాలను స్వాధీనం చేసుకోవడంలో ఉగ్రవాదులు విఫలమయ్యారని ఇరాన్ డిప్యూటీ ఇంటీరియర్ మినిస్టర్ మజిద్ మిరాహ్మది తెలిపారు. షియా ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ఇరాన్లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్సులో సున్నీ జనాభా ఎక్కువగా ఉంటుంది. ఇరాన్లో ఈ జాతుల మధ్య ఘర్షణల ఫలితంగా దాడులు జరుగుతున్నాయి. బలూచీలకు ఎక్కువ హక్కుల, మెరుగైన జీవన పరిస్థితులు కోరుకుంటున్నట్లు జైష్ అల్-అద్ల్ చెబుతోంది.
పాకిస్తాన్-ఇరాన్ సరిహద్దుల్లో ఉండే ఈ ప్రాంతంలో తరుచుగా ఉగ్రవాద సంస్థ, ఇరాన్ బలగాలకు మధ్య పోరాటం కొనసాగుతోంది. మాదకద్రవ్యాల రవాణా, సున్నీ మిలిటెంట్లను అడ్డుకోవడంతో దాడులు పెద్దవిగా మారుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి మాదక ద్రవ్యాలు వెస్ట్రన్ దేశాలకు వెళ్లడానికి ఇరాన్ కీలకమైన రవాణా మార్గంగా ఉంది. డిసెంబర్ నెలలో ఇదే తీవ్రవాద సంస్థ రస్క్ పట్టణంలో ఒక పోలీస్ స్టేషన్పై దాడి చేసి 11 మంది భద్రతా సిబ్బందిని చంపింది. ఆ తర్వాత ఇరాన్ పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్న తీవ్రవాద స్థావరాలపై రాకెట్లతో దాడి చేసింది. ఆ తర్వాత ప్రతీకారంగా పాకిస్తాన్, ఇరాన్పై దాడి చేసింది.
తాజావార్తలు
-
Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
-
Maa Inti Bangaram: 73 కోట్ల వసూళ్లతో అన్-స్టాపబుల్ ‘బంగారం’!
-
Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..