Shivraj Singh Chauhan : ప్రజల్లో మార్పు తేవడమే వికసిత్ భారత్ లక్ష్యం
దేశంలోని మారుమూల ప్రజల్లోనూ మార్పు తీసుకురావడంతోపాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిందని మధ్య ప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఈ కార్యక్రమం రాజకీయాలకు వేదిక కానేకాదని, కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రకు వివిధ శాఖల అధికారులను సమన్వయం చేయడంతోపాటు లబ్దిదారులంతా ఇక్కడికి తీసుకొచ్చి ప్రజలను భాగస్వాములను చేసిన బండి సంజయ్ కుమార్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్ ప్రజలంతా ఎప్పుడైనా మధ్యప్రదేశ్ లోని తన నివాసమైన మామాజీ కా ఘర్ (మేనమామ ఇల్లు) కు రావాలని కోరారు.
వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లాకు విచ్చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తో కలిసి మానకొండూరు నియోజకవర్గంలోని కొండ పలక విచ్చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. ప్రత్యేక క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం లబ్దిదారులతో మమేకమై కేంద్ర పథకాలవల్ల ఒనగూరిన ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రసంగించారు.
Also Read
- US Sailor Attacked by Monkey: హార్మూజ్ మిషన్కు బయలుదేరిన అమెరికా సైనికుడిపై కోతి దాడి.. మందుపాతరల తొలగింపులో వింత ఘటన
- Crime: కొడుకు ప్రేమకు తండ్రికి శిక్ష.. కొట్టి మూత్రం తాగించి దారుణం..
- Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ విజయ రహస్యాన్ని బయట పెట్టిన పంజాబ్ ఆటగాడు..
- AAP Crisis: బీజేపీలోకి హర్భజన్ సింగ్.. చద్దాతో పాటు వెళ్లేది వీరే..
నరేంద్రమోదీ ప్రభుత్వం సాధించిన విజయాలతోపాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు అర్హులైన వారందరికీ వాటి ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం గత పదేళ్లుగా అమలు చేస్తున్న కేంద్ర సంక్షేమ పథకాలను, దేశం సాధించిన విజయాలను ప్రస్తావించారు. ఒకవైపు తీవ్రవాదాన్ని ఏరిపారేయడమే కాకుండా జమ్మూకాశ్మీర్ దేశంలో అంతర్భాగం చేయడంలో భాగంగా 370 ఆర్టికల్ ను రద్దు చేశారన్నారు. ముస్లిం హక్కులను కాపాడేందుకే ట్రిపుల్ తలాఖ్ చట్టాన్ని రద్దు చేశారని తెలిపారు.మోదీ పాలనలో దేశం సుసంపన్న, సుభిక్ష, శక్తిశాలీ దేశంగా మారుతోందన్నారు. ఆర్దిక ప్రగతిలో ప్రపంచంలోనే నెంబర్ వన్ కాబోతుందన్నారు.
కరోనాతో ప్రపంచమంతా అల్లాడుతుంటే అగ్రదేశాలకు సాధ్యం కాని రీతిలో ముందుగానే కరోనా వాక్సిన్ ను తయారు చేసి 200 కోట్ల డోసులను ఉచతంగా పంపిణీ చేసిన ఘనత మోదీదేనన్నారు. వీటితోపాటు 4 కోట్ల మంది ఇండ్లు నిర్మించారని, ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించారని, 10 కోట్ల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు అందించారని… 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం, గోధుములు అందిస్తున్నారని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు మోదీ విప్లవాత్మక చర్యలు తీసుకున్నారని, రైతులు, చిరు వ్యాపారులు రుణాలందక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నుండి కాపాడేందుకు బ్యాంకులే వారి వద్దకు వెళ్లి రుణాలిచ్చేలా చేసిన ఘనత మోదీదేనన్నారు. కరీంనగర్ లో జరుగుతున్న వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రజలతో మమేకమైన తరువాత మోదీ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయనే భావన కలుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జల్లా కలెక్టర్ పమేలా సత్పతితోపాటు ఇతర శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
US Sailor Attacked by Monkey: హార్మూజ్ మిషన్కు బయలుదేరిన అమెరికా సైనికుడిపై కోతి దాడి.. మందుపాతరల తొలగింపులో వింత ఘటన
-
Thalaivar 173 : సూపర్ స్టార్ రజనీ వర్సెస్ డైరెక్టర్ శంకర్.. సిల్వర్ స్క్రీన్ షేక్ అయ్యే అప్డేట్!
-
Crime: కొడుకు ప్రేమకు తండ్రికి శిక్ష.. కొట్టి మూత్రం తాగించి దారుణం..
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ విజయ రహస్యాన్ని బయట పెట్టిన పంజాబ్ ఆటగాడు..
-
AAP Crisis: బీజేపీలోకి హర్భజన్ సింగ్.. చద్దాతో పాటు వెళ్లేది వీరే..
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!