Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- రెండేళ్ల తర్వాత తొలి బహిరంగ ప్రసంగం చేసిన షేక్ హసీనా.
- తన ప్రభుత్వాన్ని కుట్రతో కూల్చారని ఆరోపణ.
- కోటా ఉద్యమాన్ని ప్రభుత్వ మార్పు ఉద్యమంగా మార్చారని వ్యాఖ్య.
- మహ్మద్ యూనస్పై తీవ్ర విమర్శలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రెండేళ్ల తర్వాత తొలిసారిగా మౌనం వీడారు. తొలిసారిగా బహిరంగంగా ఆమె మాట్లాడారు. 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ విడిచి భారత్ వచ్చిన ఆమె న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ ప్రసంగం సందర్భంగా ఆమె చాలా సార్లు కన్నీరు పెట్టుకున్నారు. షేక్ హసీనా తర్వాత పాలనాధికారం చేపట్టిన తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్పై తీవ్ర ఆరోపణలు చేుశారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ముందే పక్కా ప్రణాళికను రూపొందించినట్లు ఆరోపించారు. ఈ కుట్ర నిజాన్ని మహ్మద్ యూనసే స్వయంగా బయటపెట్టారని అన్నారు.
బంగ్లాదేశ్లో జరిగిందిన విద్యార్థుల స్వచ్ఛంద ఉద్యమం కాదని, ముందే రూపొందించిన ప్రభుత్వ మార్పు(రెజిమ్ ఛేంజ్) కుట్ర అని ఆరోపించారు. రిజర్వేషన్ కోటా ఉద్యమాన్ని తనను అధికారంలో నుంచి తొలగించేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మార్చి తనను అధికారంలో నుంచి తొలగించే ఉద్యమంగా మార్చారని ఆరోపించారు. ఉద్యమం మొదటి నుంచే శాంతియుతంగా లేదని హసీనా పేర్కొన్నారు. ప్రభుత్వం హైకోర్టు కోటా తీర్పుపై అప్పీల్ చేసిందని, విద్యార్థి నాయకులతో చర్చలకు సిద్ధమైందని కూడా ఆమె చెప్పారు. కొన్ని గుంపులు ఈ ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చి, ఎన్నికైన ప్రభుత్వాన్ని గద్దె దించారని ఆరోపించారు.
Also Read
- Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
- Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
- UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
2024 అల్లర్ల సమయంలో 450కి పైగా పోలీస్ స్టేషన్లకు నిప్పు పెట్టారని, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేశారని, పలువురు పోలీస్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఆమె ఆరోపించారు. తన ప్రసంగంలో 1975లో తన కుటుంబ సభ్యుల హత్యను గుర్తు చేసుకుంటూ హసీనా భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్తో పాటు 1971విమోచన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళలర్పించారు.
ఇప్పుడున్న బంగ్లాదేశ్ తాము సృష్టించింది కాదని, గత రెండేళ్లుగా బంగ్లాదేశ్లో కష్టాలు పెరిగాయని అన్నారు. తాను దేశానికి దూరంగా ఉన్నా, ప్రజలకు ఎన్నడూ దూరంగా లేనని, తన కుటుంబం బంగ్లాదేశ్ కోసం పోరాడిందని చెప్పారు. మహ్మద్ యూనస్ పోలీసుల్ని చంపిన హంతకులకు క్షమాభిక్ష ప్రసాదించారని చెప్పారు. బంగ్లాదేశ్లో మైనారిటీ వర్గాలపై దాడులు, న్యాయమూర్తులపై దాడులు చేశారని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
-
OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
-
Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!