టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తన లేటెస్ట్ మూవీ ‘బైకర్’తో బాక్సాఫీస్ వద్ద మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. సినిమా విడుదలైన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ప్రసిద్ధ శ్రీరాములు థియేటర్కు వెళ్లిన శర్వానంద్, అక్కడ ప్రేక్షకులతో కలిసి సినిమా చూసి సందడి చేశారు. ఈ సందర్భంగా సినిమా పట్ల, వెండితెర పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకుంటూ ఆయన స్క్రీన్కు నమస్కరించారు. ఈ హృదయ విదారక దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read : Anil Ravipudi: వెంకీ – అనిల్ రావిపూడి సినిమాలో కృతి శెట్టి ఫిక్స్!
శర్వానంద్ కెరీర్లో ‘బైకర్’ ఒక మైలురాయిగా నిలిచిందని ప్రేక్షకులు, విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా తండ్రీకొడుకుల సెంటిమెంట్తో పాటు హై-వోల్టేజ్ బైక్ రేసింగ్ సీన్లు ఈ సినిమాకు ప్రాణం పోశాయి. రాజశేఖర్తో ఆయన కెమిస్ట్రీ, ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ విజయంతో శర్వానంద్ తన మార్కెట్ను మరింత బలోపేతం చేసుకున్నారు. సినిమా పట్ల శర్వానంద్కు ఉన్న అంకితభావం.. ప్రేక్షకులను ఆయన గౌరవించే తీరును చూసి నెటిజన్లు “నిజమైన హీరో” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకు పోతున్న శర్వానంద్ 'బైకర్'.. థియేటర్ విజిట్స్ లో భాగంగా హైదరాబాద్లోని శ్రీరాములు థియేటర్లో సందడి చేసిన హీరో శర్వా.. సినిమాపై తనకున్న అపారమైన ప్రేమను చాటుకుంటూ, వెండితెర స్క్రీన్ కు సాష్టాంగ నమస్కారం చేసిన శర్వా#Sharwanand #Biker… pic.twitter.com/wLMmNEsT5l
— NTV Breaking News (@NTVJustIn) April 5, 2026