Shakibal Hasan: చెక్ బౌన్స్ కేసులో స్టార్ ఆల్ రౌండర్కు అరెస్ట్ వారెంట్ జారీ
- చెక్ బౌన్స్ కేసులో స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కు అరెస్ట్ వారెంట్.
- షకీబ్ అల్ హసన్తో పాటు మరో ముగ్గురిపై అరెస్ట్ వారెంట్ జారీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shakibal Hasan: బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఈ మధ్య కాలంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. సెప్టెంబర్ 2024లో ఇంగ్లండ్లో జరిగిన కౌంటీ మ్యాచ్లో షకీబ్ బౌలింగ్ యాక్షన్ చట్టవిరుద్ధంగా ఉన్నట్లు ఫిర్యాదు అందింది. ఈ ఘటన తరువాత ఆయనపై నిషేధం విధించబడింది. బౌలింగ్ యాక్షన్ టెస్టుల్లో ఇప్పటికే రెండుసార్లు విఫలమైన షకీబ్కి ఇది పెద్ద దెబ్బగా మారింది. దీనితో, బంగ్లాదేశ్ జట్టులో ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాలేకపోయాడు. ఇది ఇలా ఉండగా.. షకీబ్కి మరొక పెద్ద దెబ్బ తగిలింది. ఐఎఫ్ఐసి బ్యాంక్కు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో షకీబ్ పై ఢాకాలోని కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
Also Read: INDW vs WIW: భారత బౌలర్ల దెబ్బకి వెస్టిండీస్ బ్యాటర్లు విలవిల.. 44 పరుగులకే ఆలౌట్
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఢాకా అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జియాదుర్ రెహమాన్ ఆదివారం షకీబ్ అల్ హసన్తో పాటు మరో ముగ్గురిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ కేసు ఐఎఫ్ఐసి బ్యాంక్ రిలేషన్షిప్ ఆఫీసర్ షాహిబుర్ రెహమాన్ దాఖలు చేయగా, రెండు చెక్కుల ద్వారా సుమారు 41.4 మిలియన్ టాకా అంటే సుమారుగా భారత కరెన్సీలో 3 కోట్ల భారతీయ రూపాయలు చెల్లించాల్సి ఉన్నా.. షకీబ్ చెల్లిచడంలో విఫలం కావడంతో అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. షకీబ్ సంస్థ “అల్ హసన్ ఆగ్రో ఫామ్ లిమిటెడ్” ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించింది. ఈ కంపెనీకి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ ఘాజీ షాగీర్ హుస్సేన్, డైరెక్టర్లు ఇమ్దాదుల్ హక్, మలైకర్ బేగం పేర్లు కూడా ఈ కేసులో ఉన్నాయి.
Also Read: Atishi Marlena: కేజ్రీవాల్ కాన్వాయ్పై దాడి వారి పనే.. ముఖ్యమంత్రి అతిశీ ఫైర్
ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న షకీబ్ బంగ్లాదేశ్కు తిరిగి రావడానికి నిరాకరించారు. దేశంలో జరుగుతున్న రాజకీయ అశాంతి, భద్రతాపరమైన సమస్యలు, ఇంకా చట్టప్రక్రియల కారణంగా దేశంలోకి తిరిగి రాకుండా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం షకీబ్ కుటుంబం అమెరికాలో స్థిరపడగా.. ఆయన బంగ్లాదేశ్కు తిరిగి వచ్చే అవకాశాలు లేవని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!