Blast Incident: షాద్నగర్ పేలుడు ఘటన.. విషమంగా ముగ్గురి పరిస్థితి
- షాద్నగర్ పేలుడు ఘటన.. విషమంగా ముగ్గురి పరిస్థితి
- షాద్ నగర్ పరిధిలోని బూర్గుల సమీపంలో ఉన్న సౌత్ గ్లాస్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు
- ప్రమాదంలో ఇప్పటికే ఆరుగురు మృతి
- మరో ముగ్గురి పరిస్థితి విషమం.. హైదరాబాద్ తరలింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని బూర్గుల గ్రామ శివారులో శుక్రవారం భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే.. సౌత్ గ్లాసు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కంప్రెషర్ పేలడంతో ఆరుగురు మృతి చెందారు. మరోవైపు.. గాయపడ్డ 15 మంది కార్మికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒడిశా, బీహార్, యూపీ నుంచి వచ్చిన కార్మికులు ఈ కంపెనీలో ఎక్కువగా పని చేస్తున్నారు. మృతులంతా బీహార్, ఒడిశా, యూపీ వాసులే. గాజు పరిశ్రమ కావడంతో కార్మికుల మృతదేహాలు ఛిద్రం అయ్యాయి. పేలుడు ధాటికి కంపెనీకి చెందిన షెడ్ కుప్పకూలింది. ప్రమాద స్థల దృశ్యాలు కంటతడి పెట్టించాయి. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు.
Read Also: AP CM: పెన్షన్దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ..
Also Read
- Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
పొట్ట కూటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు చనిపోవడంతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది. ప్రమాద సమయంలో కంపెనీలో 150 మంది కార్మికులు ఉన్నారు. కంప్రెషర్ పేలుడు తీవ్రతకు గ్లాసు ముక్కలు కావడంతో ఎక్కువ మందికి గుచ్చుకున్నాయి. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారికి మెరుగై చికిత్స అందించాలని సీఎం రేవంత్ రెడ్డ ఆదేశించారు. ఈ దుర్ఘటన ఎలా జరిగిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. గ్యాస్ కంప్రెషర్ పేలుడు, కార్మికుల మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితులపై కేసు నమోదు చేశామన్న షాద్ నగర్ ఏసీపీ రంగస్వామి.. పేలుడు సమయంలో విధుల్లో ఉన్న మేనేజర్, సెక్షన్ ఇంఛార్జ్ మేనేజర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Read Also: Delhi Rains : ఢిల్లీలో కుండపోత వాన.. ఎయిమ్స్లో మూడపడిన ఆపరేషన్ థియేటర్లు
తాజావార్తలు
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!