Blast Incident: షాద్నగర్ పేలుడు ఘటన.. విషమంగా ముగ్గురి పరిస్థితి
- షాద్నగర్ పేలుడు ఘటన.. విషమంగా ముగ్గురి పరిస్థితి
- షాద్ నగర్ పరిధిలోని బూర్గుల సమీపంలో ఉన్న సౌత్ గ్లాస్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు
- ప్రమాదంలో ఇప్పటికే ఆరుగురు మృతి
- మరో ముగ్గురి పరిస్థితి విషమం.. హైదరాబాద్ తరలింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని బూర్గుల గ్రామ శివారులో శుక్రవారం భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే.. సౌత్ గ్లాసు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కంప్రెషర్ పేలడంతో ఆరుగురు మృతి చెందారు. మరోవైపు.. గాయపడ్డ 15 మంది కార్మికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒడిశా, బీహార్, యూపీ నుంచి వచ్చిన కార్మికులు ఈ కంపెనీలో ఎక్కువగా పని చేస్తున్నారు. మృతులంతా బీహార్, ఒడిశా, యూపీ వాసులే. గాజు పరిశ్రమ కావడంతో కార్మికుల మృతదేహాలు ఛిద్రం అయ్యాయి. పేలుడు ధాటికి కంపెనీకి చెందిన షెడ్ కుప్పకూలింది. ప్రమాద స్థల దృశ్యాలు కంటతడి పెట్టించాయి. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు.
Read Also: AP CM: పెన్షన్దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
పొట్ట కూటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు చనిపోవడంతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది. ప్రమాద సమయంలో కంపెనీలో 150 మంది కార్మికులు ఉన్నారు. కంప్రెషర్ పేలుడు తీవ్రతకు గ్లాసు ముక్కలు కావడంతో ఎక్కువ మందికి గుచ్చుకున్నాయి. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారికి మెరుగై చికిత్స అందించాలని సీఎం రేవంత్ రెడ్డ ఆదేశించారు. ఈ దుర్ఘటన ఎలా జరిగిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. గ్యాస్ కంప్రెషర్ పేలుడు, కార్మికుల మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితులపై కేసు నమోదు చేశామన్న షాద్ నగర్ ఏసీపీ రంగస్వామి.. పేలుడు సమయంలో విధుల్లో ఉన్న మేనేజర్, సెక్షన్ ఇంఛార్జ్ మేనేజర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Read Also: Delhi Rains : ఢిల్లీలో కుండపోత వాన.. ఎయిమ్స్లో మూడపడిన ఆపరేషన్ థియేటర్లు
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..