WC 2023: ఇండియాలో మనకు ఎవరు సపోర్ట్ ఇవ్వరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వన్డే వరల్డ్కప్-2023 మెగా ఈవెంట్ కు సమయం దగ్గర పడుతోంది. భారత్ వేదికగా అక్టోబరు 5న ఈ మెగా టోర్ని ప్రారంభం కానుంది. ఇక ఐసీసీ టోర్నీలో హాట్ ఫేవరెట్ మ్యాచ్ ఏదైనా ఉంది అంటే అది కేవలం.. టీమిండియా- పాకిస్తాన్ల మధ్య పోరు అని చెప్పాలి. అయితే ఈ దాయాదుల పోరు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుంది.
Read Also: Eiffel Tower: ఈఫిల్ టవర్కు బాంబు బెదిరింపు.. అధికారులు అలర్ట్
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
దాయాది దేశాల మధ్య అక్టోబరు 14న మ్యాచ్ జరిపేందుకు ఐసీసీ రివైజ్ షెడ్యూల్లో తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరుజట్ల బలాబలాలు, గెలుపు అవకాశాలపై క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చ కొనసాగుతుంది. ఇక సొంతగడ్డపై మ్యాచ్ జరుగనుండటం టీమిండియాకు అదనపు బలం. కాగా, దీనిపై పాకిస్తాన్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత ప్రేక్షకుల నుంచి మనకు ఎలాంటి సపోర్ట్ లభించదు అని అన్నాడు. కాబట్టి పాకిస్తాన్ ఆటగాళ్లంతా మానసికంగా మరింత బలవంతులుగా తయారు కావాలని చెప్పాడు.
Read Also: Jawaan: మళ్లీ లీకయిన ‘జవాన్’ క్లిప్.. పోలీసులకి ఫిర్యాదు!
మనం మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటే.. అంత తేలికగా అనుకున్న ఫలితాలు సాధిస్తామని షాదాబ్ ఖాన్ అన్నాడు. టీమిండియాపై విజయం సాధించడంతో పాటు ఇండియాలో వరల్డ్కప్ గెలిస్తే అంతకంటే గొప్ప విషయం ఇంకా ఏదీ ఉండదని షాదాబ్ ఖాన్ అన్నాడు. నిజానికి ప్రతి జట్టు టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. అయితే, మనకు ఎలాంటి ఆరంభం లభించింది.. ఎలా ముందుకు వెళ్తున్నామనే విషయంపైనే అంతా ఆధారపడి ఉంది.. ప్రతి జట్టుకు ప్రతి మ్యాచ్ కూడా కీలకమేనని షాదాబ్ కామెంట్స్ చేశాడు.
Read Also: INDvsWI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
కాగా.. రెండేళ్ల క్రితం టీ20 ప్రపంచకప్లో భాగంగా దుబాయ్లో టీమిండియాను పది వికెట్ల తేడాతో ఓడించిన జట్టులో షాదాబ్ ఖాన్ సభ్యుడిగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ కంటే ముందు చిరకాల ప్రత్యర్థి జట్లైన టీమిండియా- పాకిస్తాన్ సెప్టెంబరు 2న శ్రీలంక వేదికగా ఆసియా కప్ టోర్నీలో తలపడనున్నాయి. ఇందుకు సంబంధించి పాకిస్తాన్ ఇప్పటికే జట్టును ప్రకటించగా.. భారత్ మాత్రం ఇంకా జట్టును ప్రకటించలేదు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!