ఇండియా వర్సెస్ వెస్టిండీస్ నాలుగో టీ20 మ్యాచ్ ఫ్లోరిడా వేదికగా జరుగుతుంది. అయితే, టాస్ గెలిచిన కెప్టెన్ రోవ్మెన్ పావెల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నేటి మ్యాచ్లో భారత జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగుతోంది.. అయితే, తొలి రెండు టీ20లు గెలిచిన విండీస్.. ఇవాళ మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తుంది. ఇక, మూడో టీ20లో గెలిచి కమ్బ్యాక్ ఇచ్చిన టీమిండియా ఈ సిరీస్ గెలవాలంటే మిగిలిన రెండు మ్యాచ్ ల్లోనూ తప్పక గెలవాల్సి పరిస్థితి ఏర్పాడింది. ఇషాన్ కిషన్ ప్లేస్లో మూడో టీ20లో ఆరంగ్రేటం చేసిన యశస్వి జైస్వాల్ ఒక్క పరుగే అవుట్ అయ్యాడు. శుబ్మన్ గిల్ కూడా వెస్టిండీస్ టూర్లో పెద్దగా రాణించలేదు.
Read Also: Ankita Lokhande: సుశాంత్ మాజీ ప్రియురాలి ఇంట తీవ్ర విషాదం
అయితే, శుభ్ మన్ గిల్ మూడో వన్డేలో చేసిన 85 పరుగులు తప్ప చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ రాలేదు. సూర్యకుమార్ యాదవ్, మూడో టీ20లో అద్భుతమైన పర్ఫామెన్స్తో టీమిండియాను గెలిపించాడు. మూడు టీ20ల్లో 139 పరుగులు చేసిన తిలక్ వర్మ, టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగిలిన రెండు టీ20ల్లోనూ తిలక్ వర్మ రాణిస్తే.. వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకునేందుకు ఛాన్స్ ఉంది.
Read Also: Steve Smith: అతడి వల్లే నేను బీర్ తాగకుండానే వచ్చేశా..
మూడో టీ20లో తిలక్ వర్మ 49 పరుగుల దగ్గర ఉన్నప్పుడు, హార్ధిక్ పాండ్యా సిక్సర్ కొట్టి మ్యాచ్ని గెలిపించడంతో తీవ్ర వివాదాస్పదమైంది. అదీకాకుండా దాదాపు మ్యాచ్ ఫినిష్ అయిన సమయంలో సంజూ శాంసన్ కంటే హార్ధిక్ పాండ్యా క్రీజులోకి రావడం కూడా అతనిపై అనేక విమర్శలు వచ్చాయి. భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, యజ్వేంద్ర చాహాల్ వరుసగా వికెట్లు తీశారు. అయితే భారత ఫాస్ట్ బౌలర్ల నుంచి మాత్రం ఆశించిన ప్రదర్శన రావడం లేదు. అర్ష్దీప్ సింగ్ 3 మ్యాచుల్లో 3 వికెట్లు తీయగా ముకేశ్ కుమార్ 2 వికెట్లు తీసుకున్నాడు. అక్షర్ పటేల్ అయితే అటు బ్యాటుతో కానీ, ఇటు బాల్తో కానీ ఇప్పటిదాకా సరైన ప్రదర్శన చేయలేదు.