Shabbir Ali : బీజేపీ నోటీసులు.. టీఆర్ఎస్ సమన్ల డ్రామా నడుస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో బీజేపీ నోటీసులు.. టీఆర్ఎస్ల సమన్ల డ్రామా నడుస్తుందని విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరి డ్రామాల మధ్య ప్రజల సమస్య పక్కదారి పట్టిస్తున్నారన్నారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు.. రోజు అత్యాచారాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. వీటి మీద అసలు సమీక్షలే లేవని, బీజేపీ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. పెట్రో ధరలు పెరిగితే పట్టించుకునే నాధుడే లేడని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొంటున్నారు అని కేసీఆర్ సిట్ వేశారు.. బీజేపీ వేసిన ఎరలో ముగ్గురూ ఎమ్మె్ల్యేలు మా పార్టీ నుండి కొన్నవారే అని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. 47 ఎమ్మె్ల్యేలు ఎమ్మెల్సీలను కేసీఆర్ కొన్నాడని, సిట్ విచారణ ..కేసీఆర్ కొన్న ఎమ్మెల్యేల అంశం కూడా చేర్చాలన్నారు షబ్బీర్ అలీ. లిక్కర్ కేసులో కవిత పేరు వస్తే విచారణ కు పోవాలని, విచారణలో దోషి ఐతే జైలు కు పోతుందని, లేకుంటే ఇంటికి వస్తోందన్నారు.
Also Read : YS Jagan Mohan Reddy: ముర్ము జీవితం.. ప్రతీ మహిళకు ఆదర్శనీయం
దానికి ప్రజలకు వచ్చే ఇబ్బంది ఏంటి..? అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్.. బీజేపీ భార్యాభర్తల మాదిరిగా ఇంట్లో బాగానే ఉంటున్నారు… వీధిలోకి వచ్చి గొడవ చేస్తున్నారని షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. ధరణిలో నాదే రెండున్నర ఎకరాలు గాయబ్ అయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు. సెట్ చేస్తాం అని అధికారులు అంటున్నారని, పేదోల పరిస్థితి ఏంటని ఆయన మండిపడ్డారు. ఇట్లనే చేస్తే.. నక్సలైట్లలను ఆశ్రయించే పరిస్థితి వస్తోందన్నారు. ఈడీ నోటీసులు ఇస్తే రాహుల్.. సోనియా గాంధీ విచారణకు వెళ్లారన్నారు. . బీజేపీ నోటీసులు వస్తే భయం ఎందుకు అన్నారని, మరి బీఎల్ సంతోష్ సిట్ విచారణకు వస్తే తప్పు ఏంటని ఆయన అన్నారు. విచారణకు వచ్చి నిజాయితీ నిరూపించుకోవాలని, కవిత ఇంటికి వస్తాం అని అనడం ఏంటని, అందరిని ఆఫీసుకు పిలిచి..కవిత ని ఎందుకు పిలవరు.. ఇదేం డ్రామా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
- Team India: భారత టీ20 జట్టులో మార్పులు.. ఐదో టీ20కి సంజూ శాంసన్ ఎంట్రీ..? టీం నుంచి ఇద్దరు అవుట్..
- O Sukumari: ముట్టుకుంటే షాక్ కొట్టే పెళ్లాం.. తిరువీర్ తిప్పలు చూస్తే నవ్వాపుకోలేరు!
- China: ప్రపంచంలోనే తొలిసారి.. సముద్రంలోని వలలో రాకెట్ను దించిన చైనా!
తాజావార్తలు
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
-
IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
-
Team India: భారత టీ20 జట్టులో మార్పులు.. ఐదో టీ20కి సంజూ శాంసన్ ఎంట్రీ..? టీం నుంచి ఇద్దరు అవుట్..
-
Bhatti Vikramarka : బీఆర్ఎస్ మాయమాటలు నమ్మొద్దు..
-
O Sukumari: ముట్టుకుంటే షాక్ కొట్టే పెళ్లాం.. తిరువీర్ తిప్పలు చూస్తే నవ్వాపుకోలేరు!
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!