Sexual harassment case: బెంగాల్ గవర్నర్కు చెందిన ఓఎస్డీకి హైకోర్టులో బిగ్ రిలీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sexual harassment case: లైంగిక వేధింపుల కేసులో పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్కు చెందిన ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)కి కూడా హైకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. ప్రస్తుతం ఆయనపై విచారణపై హైకోర్టు స్టే విధించింది. ఓఎస్డీ తనను రాజ్భవన్లో బలవంతంగా ఆపేందుకు ప్రయత్నించారని బాధితురాలు ఆరోపించింది. రాజ్భవన్లోని ఓ కాంట్రాక్టు ఉద్యోగి గవర్నర్పై తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. దీనిపై కోల్కతా పోలీసులు కూడా గవర్నర్పై విచారణ ప్రారంభించారు. కాగా, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓఎస్డీతో పాటు మరో ఇద్దరు అధికారుల పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదయ్యాయి. మే 2న రాజ్భవన్ నుంచి బయటకు రాకుండా మహిళను బలవంతంగా అడ్డుకున్నారని ఆరోపించారు.
Read Also: Manjummel Boys : ఇళయరాజా కు మంజుమ్మల్ బాయ్స్ ప్రొడ్యూసర్ కౌంటర్..
Also Read
- Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
- Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
ఇక, ఈ కేసును విచారించిన తర్వాత జస్టిస్ అమృత సిన్హా సింగిల్ బెంచ్ మాట్లాడుతూ.. సీసీటీవీ ఫుటేజీ ఇప్పటికే దర్యాప్తు అధికారి దగ్గర అందుబాటులో ఉందన్నారు. OSDతో పాటు ఇతర అధికారులు మహిళను బలవంతంగా తిరిగి రాజ్భవన్కు పిలిపించి.. ఆపై ఆమె ఫోన్ను కూడా తీసుకెళ్లారని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారులపై విచారణను జూన్ 17వ తేదీ వరకు హైకోర్టు నిలిపివేయడంతో.. ఈ కేసు దర్యాప్తుపై ప్రభావం పడనుంది. కాగా, పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. తనను వేధింపులకు గురి చేసినప్పుడు గవర్నర్ ఛాంబర్లో ఒంటరిగా ఉన్నానని మహిళ చెప్పిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు అడ్డుకోవడం సబబు కాదన్నారు. మహిళకు, గవర్నర్కు మధ్య ఏం జరిగిందో కూడా తెలియదు.. రాజ్భవన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ మహిళ పోలీసు కేసు పెట్టిందని న్యాయవాది తెలిపారు.
Read Also: Hyderabad Metro: మెట్రో రైలు టైమింగ్స్ మార్పు.. సోమ, శుక్రవారాలు మాత్రమే..
కాగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కిషోర్ దత్తా వాదనలు వినిపించారు. విచారణ కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన విచారణ నివేదికను జూన్ 10లోగా కోర్టులో సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత కేసు తదుపరి విచారణ జరగనుంది అని చెప్పుకొచ్చింది. కోర్టు నిర్ణయంతో గవర్నర్ ఆనంద్ బోస్ తన అధికారులను అభినందించారు.
తాజావార్తలు
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
ట్రెండింగ్
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..