Sexual harassment case: బెంగాల్ గవర్నర్కు చెందిన ఓఎస్డీకి హైకోర్టులో బిగ్ రిలీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sexual harassment case: లైంగిక వేధింపుల కేసులో పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్కు చెందిన ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)కి కూడా హైకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. ప్రస్తుతం ఆయనపై విచారణపై హైకోర్టు స్టే విధించింది. ఓఎస్డీ తనను రాజ్భవన్లో బలవంతంగా ఆపేందుకు ప్రయత్నించారని బాధితురాలు ఆరోపించింది. రాజ్భవన్లోని ఓ కాంట్రాక్టు ఉద్యోగి గవర్నర్పై తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. దీనిపై కోల్కతా పోలీసులు కూడా గవర్నర్పై విచారణ ప్రారంభించారు. కాగా, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓఎస్డీతో పాటు మరో ఇద్దరు అధికారుల పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదయ్యాయి. మే 2న రాజ్భవన్ నుంచి బయటకు రాకుండా మహిళను బలవంతంగా అడ్డుకున్నారని ఆరోపించారు.
Read Also: Manjummel Boys : ఇళయరాజా కు మంజుమ్మల్ బాయ్స్ ప్రొడ్యూసర్ కౌంటర్..
Also Read
- ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
ఇక, ఈ కేసును విచారించిన తర్వాత జస్టిస్ అమృత సిన్హా సింగిల్ బెంచ్ మాట్లాడుతూ.. సీసీటీవీ ఫుటేజీ ఇప్పటికే దర్యాప్తు అధికారి దగ్గర అందుబాటులో ఉందన్నారు. OSDతో పాటు ఇతర అధికారులు మహిళను బలవంతంగా తిరిగి రాజ్భవన్కు పిలిపించి.. ఆపై ఆమె ఫోన్ను కూడా తీసుకెళ్లారని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారులపై విచారణను జూన్ 17వ తేదీ వరకు హైకోర్టు నిలిపివేయడంతో.. ఈ కేసు దర్యాప్తుపై ప్రభావం పడనుంది. కాగా, పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. తనను వేధింపులకు గురి చేసినప్పుడు గవర్నర్ ఛాంబర్లో ఒంటరిగా ఉన్నానని మహిళ చెప్పిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు అడ్డుకోవడం సబబు కాదన్నారు. మహిళకు, గవర్నర్కు మధ్య ఏం జరిగిందో కూడా తెలియదు.. రాజ్భవన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ మహిళ పోలీసు కేసు పెట్టిందని న్యాయవాది తెలిపారు.
Read Also: Hyderabad Metro: మెట్రో రైలు టైమింగ్స్ మార్పు.. సోమ, శుక్రవారాలు మాత్రమే..
కాగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కిషోర్ దత్తా వాదనలు వినిపించారు. విచారణ కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన విచారణ నివేదికను జూన్ 10లోగా కోర్టులో సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత కేసు తదుపరి విచారణ జరగనుంది అని చెప్పుకొచ్చింది. కోర్టు నిర్ణయంతో గవర్నర్ ఆనంద్ బోస్ తన అధికారులను అభినందించారు.
తాజావార్తలు
-
ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
-
Lal Darwaza Rangam : లాల్ దర్వాజా రంగంలో భవిష్యవాణి.. ‘భయపడొద్దు’ అన్న మహంకాళి..!
-
RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్లో గుడ్న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!