Sexual harassment case: బెంగాల్ గవర్నర్కు చెందిన ఓఎస్డీకి హైకోర్టులో బిగ్ రిలీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sexual harassment case: లైంగిక వేధింపుల కేసులో పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్కు చెందిన ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)కి కూడా హైకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. ప్రస్తుతం ఆయనపై విచారణపై హైకోర్టు స్టే విధించింది. ఓఎస్డీ తనను రాజ్భవన్లో బలవంతంగా ఆపేందుకు ప్రయత్నించారని బాధితురాలు ఆరోపించింది. రాజ్భవన్లోని ఓ కాంట్రాక్టు ఉద్యోగి గవర్నర్పై తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. దీనిపై కోల్కతా పోలీసులు కూడా గవర్నర్పై విచారణ ప్రారంభించారు. కాగా, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓఎస్డీతో పాటు మరో ఇద్దరు అధికారుల పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదయ్యాయి. మే 2న రాజ్భవన్ నుంచి బయటకు రాకుండా మహిళను బలవంతంగా అడ్డుకున్నారని ఆరోపించారు.
Read Also: Manjummel Boys : ఇళయరాజా కు మంజుమ్మల్ బాయ్స్ ప్రొడ్యూసర్ కౌంటర్..
Also Read
- 108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- PoK Protests: "మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!".. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
- Morning Diet Tips: ఉదయాన్నే ఏం తినాలి? ఏం తినకూడదు? నిపుణుల హెచ్చరిక
- Monsoon 2026: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఈ 15 రోజులు అత్యంత కీలకం.. భారీ వర్షాలు!
ఇక, ఈ కేసును విచారించిన తర్వాత జస్టిస్ అమృత సిన్హా సింగిల్ బెంచ్ మాట్లాడుతూ.. సీసీటీవీ ఫుటేజీ ఇప్పటికే దర్యాప్తు అధికారి దగ్గర అందుబాటులో ఉందన్నారు. OSDతో పాటు ఇతర అధికారులు మహిళను బలవంతంగా తిరిగి రాజ్భవన్కు పిలిపించి.. ఆపై ఆమె ఫోన్ను కూడా తీసుకెళ్లారని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారులపై విచారణను జూన్ 17వ తేదీ వరకు హైకోర్టు నిలిపివేయడంతో.. ఈ కేసు దర్యాప్తుపై ప్రభావం పడనుంది. కాగా, పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. తనను వేధింపులకు గురి చేసినప్పుడు గవర్నర్ ఛాంబర్లో ఒంటరిగా ఉన్నానని మహిళ చెప్పిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు అడ్డుకోవడం సబబు కాదన్నారు. మహిళకు, గవర్నర్కు మధ్య ఏం జరిగిందో కూడా తెలియదు.. రాజ్భవన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ మహిళ పోలీసు కేసు పెట్టిందని న్యాయవాది తెలిపారు.
Read Also: Hyderabad Metro: మెట్రో రైలు టైమింగ్స్ మార్పు.. సోమ, శుక్రవారాలు మాత్రమే..
కాగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కిషోర్ దత్తా వాదనలు వినిపించారు. విచారణ కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన విచారణ నివేదికను జూన్ 10లోగా కోర్టులో సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత కేసు తదుపరి విచారణ జరగనుంది అని చెప్పుకొచ్చింది. కోర్టు నిర్ణయంతో గవర్నర్ ఆనంద్ బోస్ తన అధికారులను అభినందించారు.
తాజావార్తలు
-
Pradeep Kumar IAS: పదవీ విరమణ రోజే సీబీఐ షాక్.. ఐఏఎస్ ప్రదీప్ కుమార్ అరెస్టు.. కారణం ఇదే!
-
Jr NTR : ఎన్టీఆర్ అన్స్టాపబుల్ లైనప్.. మూడు భారీ ప్రాజెక్టులపైనే ఫుల్ ఫోకస్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
AAA Cinemas: విశాఖలో అల్లు అర్జున్ ‘AAA’ సినిమాస్.. 8 స్క్రీన్లతో ప్రీమియం మూవీ ఎక్స్పీరియెన్స్కు సిద్ధం!
-
Vaibhav Sooryavanshi: ఏమో ఎవరికి తెలుసు.. వైభవ్ సూర్యవంశీ బలహీనతను అతడు కనిపెట్టాడేమో!
ట్రెండింగ్
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!