Sexual harassment case: బెంగాల్ గవర్నర్కు చెందిన ఓఎస్డీకి హైకోర్టులో బిగ్ రిలీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sexual harassment case: లైంగిక వేధింపుల కేసులో పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్కు చెందిన ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)కి కూడా హైకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. ప్రస్తుతం ఆయనపై విచారణపై హైకోర్టు స్టే విధించింది. ఓఎస్డీ తనను రాజ్భవన్లో బలవంతంగా ఆపేందుకు ప్రయత్నించారని బాధితురాలు ఆరోపించింది. రాజ్భవన్లోని ఓ కాంట్రాక్టు ఉద్యోగి గవర్నర్పై తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. దీనిపై కోల్కతా పోలీసులు కూడా గవర్నర్పై విచారణ ప్రారంభించారు. కాగా, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓఎస్డీతో పాటు మరో ఇద్దరు అధికారుల పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదయ్యాయి. మే 2న రాజ్భవన్ నుంచి బయటకు రాకుండా మహిళను బలవంతంగా అడ్డుకున్నారని ఆరోపించారు.
Read Also: Manjummel Boys : ఇళయరాజా కు మంజుమ్మల్ బాయ్స్ ప్రొడ్యూసర్ కౌంటర్..
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
ఇక, ఈ కేసును విచారించిన తర్వాత జస్టిస్ అమృత సిన్హా సింగిల్ బెంచ్ మాట్లాడుతూ.. సీసీటీవీ ఫుటేజీ ఇప్పటికే దర్యాప్తు అధికారి దగ్గర అందుబాటులో ఉందన్నారు. OSDతో పాటు ఇతర అధికారులు మహిళను బలవంతంగా తిరిగి రాజ్భవన్కు పిలిపించి.. ఆపై ఆమె ఫోన్ను కూడా తీసుకెళ్లారని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారులపై విచారణను జూన్ 17వ తేదీ వరకు హైకోర్టు నిలిపివేయడంతో.. ఈ కేసు దర్యాప్తుపై ప్రభావం పడనుంది. కాగా, పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. తనను వేధింపులకు గురి చేసినప్పుడు గవర్నర్ ఛాంబర్లో ఒంటరిగా ఉన్నానని మహిళ చెప్పిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు అడ్డుకోవడం సబబు కాదన్నారు. మహిళకు, గవర్నర్కు మధ్య ఏం జరిగిందో కూడా తెలియదు.. రాజ్భవన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ మహిళ పోలీసు కేసు పెట్టిందని న్యాయవాది తెలిపారు.
Read Also: Hyderabad Metro: మెట్రో రైలు టైమింగ్స్ మార్పు.. సోమ, శుక్రవారాలు మాత్రమే..
కాగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కిషోర్ దత్తా వాదనలు వినిపించారు. విచారణ కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన విచారణ నివేదికను జూన్ 10లోగా కోర్టులో సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత కేసు తదుపరి విచారణ జరగనుంది అని చెప్పుకొచ్చింది. కోర్టు నిర్ణయంతో గవర్నర్ ఆనంద్ బోస్ తన అధికారులను అభినందించారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!