Sexual harassment case: బెంగాల్ గవర్నర్కు చెందిన ఓఎస్డీకి హైకోర్టులో బిగ్ రిలీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sexual harassment case: లైంగిక వేధింపుల కేసులో పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్కు చెందిన ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)కి కూడా హైకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. ప్రస్తుతం ఆయనపై విచారణపై హైకోర్టు స్టే విధించింది. ఓఎస్డీ తనను రాజ్భవన్లో బలవంతంగా ఆపేందుకు ప్రయత్నించారని బాధితురాలు ఆరోపించింది. రాజ్భవన్లోని ఓ కాంట్రాక్టు ఉద్యోగి గవర్నర్పై తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. దీనిపై కోల్కతా పోలీసులు కూడా గవర్నర్పై విచారణ ప్రారంభించారు. కాగా, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓఎస్డీతో పాటు మరో ఇద్దరు అధికారుల పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదయ్యాయి. మే 2న రాజ్భవన్ నుంచి బయటకు రాకుండా మహిళను బలవంతంగా అడ్డుకున్నారని ఆరోపించారు.
Read Also: Manjummel Boys : ఇళయరాజా కు మంజుమ్మల్ బాయ్స్ ప్రొడ్యూసర్ కౌంటర్..
Also Read
- Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
- Hyderabad: హైదరాబాద్లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
- Natural Skin Care: నిమ్మ తొక్కతో హోం బ్యూటీ ట్రీట్మెంట్.. కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
ఇక, ఈ కేసును విచారించిన తర్వాత జస్టిస్ అమృత సిన్హా సింగిల్ బెంచ్ మాట్లాడుతూ.. సీసీటీవీ ఫుటేజీ ఇప్పటికే దర్యాప్తు అధికారి దగ్గర అందుబాటులో ఉందన్నారు. OSDతో పాటు ఇతర అధికారులు మహిళను బలవంతంగా తిరిగి రాజ్భవన్కు పిలిపించి.. ఆపై ఆమె ఫోన్ను కూడా తీసుకెళ్లారని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారులపై విచారణను జూన్ 17వ తేదీ వరకు హైకోర్టు నిలిపివేయడంతో.. ఈ కేసు దర్యాప్తుపై ప్రభావం పడనుంది. కాగా, పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. తనను వేధింపులకు గురి చేసినప్పుడు గవర్నర్ ఛాంబర్లో ఒంటరిగా ఉన్నానని మహిళ చెప్పిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు అడ్డుకోవడం సబబు కాదన్నారు. మహిళకు, గవర్నర్కు మధ్య ఏం జరిగిందో కూడా తెలియదు.. రాజ్భవన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ మహిళ పోలీసు కేసు పెట్టిందని న్యాయవాది తెలిపారు.
Read Also: Hyderabad Metro: మెట్రో రైలు టైమింగ్స్ మార్పు.. సోమ, శుక్రవారాలు మాత్రమే..
కాగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కిషోర్ దత్తా వాదనలు వినిపించారు. విచారణ కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన విచారణ నివేదికను జూన్ 10లోగా కోర్టులో సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత కేసు తదుపరి విచారణ జరగనుంది అని చెప్పుకొచ్చింది. కోర్టు నిర్ణయంతో గవర్నర్ ఆనంద్ బోస్ తన అధికారులను అభినందించారు.
తాజావార్తలు
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
-
DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
-
Salman Khan: ‘మీరంతా ఎలా ఉన్నారు?’.. అనారోగ్య రూమర్లకు ఒక్క పోస్టుతో చెక్ పెట్టిన సల్మాన్ ఖాన్
-
Hyderabad: హైదరాబాద్లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!