Nigeria : ఫ్యూయల్ ట్యాంకర్-ట్రక్ ఢీకొనడంతో పేలుడు, 48 మంది మృతి, 50 పశువులు సజీవ దహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nigeria : నైజీరియాలో ఆదివారం ఇంధన ట్యాంకర్ ట్రక్కును ఢీకొనడంతో పేలుడు సంభవించి 48 మంది మరణించారు. ఆ దేశ అత్యవసర సేవల ఏజెన్సీ ఈ సమాచారాన్ని ఇచ్చింది. నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లాహి బాబా-అరబ్ మాట్లాడుతూ.. ఇంధన ట్యాంకర్ ఉత్తర-మధ్య నైజర్ రాష్ట్రంలోని అగాయ్ ప్రాంతంలో పశువులను కూడా తీసుకువెళుతుందని, దీనివల్ల కనీసం 50 పశువులు సజీవ దహనమయ్యాయని చెప్పారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని బాబా-అరబ్ తెలిపారు. నైజీరియాలో ఇంధన ట్యాంకర్, మరొక ట్రక్కు మధ్య ఢీకొన్నాయి. దాని కారణంగా భారీ పేలుడు సంభవించింది. సమాచారం ప్రకారం ఈ పేలుడులో కనీసం 48 మంది ప్రాణాలు కోల్పోయారు.
50 పశువులు సజీవ దహనం
నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లాహి బాబా-అరబ్ మాట్లాడుతూ ఇంధన ట్యాంకర్ నైజర్ రాష్ట్రం ఉత్తర-మధ్యలోని అగాయ్ ప్రాంతానికి పశువులను తీసుకువెళుతోంది. దీనివల్ల కనీసం 50 పశువులు సజీవ దహనమయ్యాయని చెప్పారు. ఘటనా స్థలంలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని బాబా-అరబ్ తెలిపారు.
Also Read
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
- AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
Read Also:Paralympics 2024 India: పారాలింపిక్స్లో రికార్డు పతకాలు.. భారత్ విజేతల లిస్ట్ ఇదే!
ప్రశాంతంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి
బాబా-అరబ్ మొదట 30 మృతదేహాలను వెలికితీసినట్లు ధృవీకరించారు. కాని తరువాత మరో 18 మృతదేహాలను వెలికితీసినట్లు సమాచారం. మృతులను సామూహికంగా ఖననం చేసినట్లు తెలిపారు. ప్రమాదం తర్వాత ప్రజలలో పెరుగుతున్న ఆగ్రహాన్ని చూసిన నైజర్ గవర్నర్ మహమ్మద్ బాగో ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జీవిత భద్రత కోసం ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అన్నారు.
ప్రమాదాలు సర్వసాధారణం
వాస్తవానికి, నైజీరియాలో వస్తువులను రవాణా చేయడానికి సమర్థవంతమైన రైల్వే వ్యవస్థ లేదు. దీని కారణంగా ఆఫ్రికాలోని అత్యధిక జనాభా కలిగిన దేశంలో ప్రాణాంతక ట్రక్కు ప్రమాదాలు సాధారణం అయ్యాయి. నైజీరియాలోని ఫెడరల్ రోడ్ సేఫ్టీ కార్ప్స్ ప్రకారం, 2020లోనే 1531 గ్యాసోలిన్ ట్యాంకర్ ప్రమాదాలు జరిగాయి, 535 మంది మరణించారు. 1142 మంది గాయపడ్డారు.
Read Also:35 Movie : ’35 చిన్న కథ కాదు’… ఎటు చుసినా థియేటర్స్ హౌస్ ఫుల్స్ : రానా దగ్గుబాటి
తాజావార్తలు
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
-
Ranabaali: రణబాలి రిలీజ్పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
-
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!