Nigeria : ఫ్యూయల్ ట్యాంకర్-ట్రక్ ఢీకొనడంతో పేలుడు, 48 మంది మృతి, 50 పశువులు సజీవ దహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nigeria : నైజీరియాలో ఆదివారం ఇంధన ట్యాంకర్ ట్రక్కును ఢీకొనడంతో పేలుడు సంభవించి 48 మంది మరణించారు. ఆ దేశ అత్యవసర సేవల ఏజెన్సీ ఈ సమాచారాన్ని ఇచ్చింది. నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లాహి బాబా-అరబ్ మాట్లాడుతూ.. ఇంధన ట్యాంకర్ ఉత్తర-మధ్య నైజర్ రాష్ట్రంలోని అగాయ్ ప్రాంతంలో పశువులను కూడా తీసుకువెళుతుందని, దీనివల్ల కనీసం 50 పశువులు సజీవ దహనమయ్యాయని చెప్పారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని బాబా-అరబ్ తెలిపారు. నైజీరియాలో ఇంధన ట్యాంకర్, మరొక ట్రక్కు మధ్య ఢీకొన్నాయి. దాని కారణంగా భారీ పేలుడు సంభవించింది. సమాచారం ప్రకారం ఈ పేలుడులో కనీసం 48 మంది ప్రాణాలు కోల్పోయారు.
50 పశువులు సజీవ దహనం
నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లాహి బాబా-అరబ్ మాట్లాడుతూ ఇంధన ట్యాంకర్ నైజర్ రాష్ట్రం ఉత్తర-మధ్యలోని అగాయ్ ప్రాంతానికి పశువులను తీసుకువెళుతోంది. దీనివల్ల కనీసం 50 పశువులు సజీవ దహనమయ్యాయని చెప్పారు. ఘటనా స్థలంలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని బాబా-అరబ్ తెలిపారు.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
Read Also:Paralympics 2024 India: పారాలింపిక్స్లో రికార్డు పతకాలు.. భారత్ విజేతల లిస్ట్ ఇదే!
ప్రశాంతంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి
బాబా-అరబ్ మొదట 30 మృతదేహాలను వెలికితీసినట్లు ధృవీకరించారు. కాని తరువాత మరో 18 మృతదేహాలను వెలికితీసినట్లు సమాచారం. మృతులను సామూహికంగా ఖననం చేసినట్లు తెలిపారు. ప్రమాదం తర్వాత ప్రజలలో పెరుగుతున్న ఆగ్రహాన్ని చూసిన నైజర్ గవర్నర్ మహమ్మద్ బాగో ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జీవిత భద్రత కోసం ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అన్నారు.
ప్రమాదాలు సర్వసాధారణం
వాస్తవానికి, నైజీరియాలో వస్తువులను రవాణా చేయడానికి సమర్థవంతమైన రైల్వే వ్యవస్థ లేదు. దీని కారణంగా ఆఫ్రికాలోని అత్యధిక జనాభా కలిగిన దేశంలో ప్రాణాంతక ట్రక్కు ప్రమాదాలు సాధారణం అయ్యాయి. నైజీరియాలోని ఫెడరల్ రోడ్ సేఫ్టీ కార్ప్స్ ప్రకారం, 2020లోనే 1531 గ్యాసోలిన్ ట్యాంకర్ ప్రమాదాలు జరిగాయి, 535 మంది మరణించారు. 1142 మంది గాయపడ్డారు.
Read Also:35 Movie : ’35 చిన్న కథ కాదు’… ఎటు చుసినా థియేటర్స్ హౌస్ ఫుల్స్ : రానా దగ్గుబాటి
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!