Road Accident: రోడ్డుపై నిల్చున్న ప్రయాణికులను ఢీకొట్టిన ట్రక్కు.. ముగ్గురి మృతి
Road Accident: భువనేశ్వర్ నుంచి జార్సుగూడకు బస్సు బయలుదేరింది. రాత్రి దట్టమైన చీకటిలో ప్రయాణం కొనసాగుతోంది. ఉన్నట్లుండి దారిలో బస్సు టైరు పంక్చర్ అయింది. దీంతో ప్రయాణికులు వాహనం దిగి రోడ్డుపై నిలబడ్డారు. అంతే వేగంగా వచ్చిన లారీ నలుగురు ప్రయాణికులపై దూసుకెళ్లింది. దీంతో గమ్యం చేరకముందే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అంగోల్ జిల్లా సరిహద్దులో నిన్న(గురువారం) అర్థరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరాడు.
Read Also:World Cup Final 2023: ఆ ట్రెండ్ కొనసాగితే.. భారత్దే 2023 ప్రపంచకప్!
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
అనుగోల్ జిల్లా కిషోర్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్గపాలి సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి ఝార్సుగూడకు కాలీ ప్రాచి అనే ప్రైవేట్ బస్సు వెళ్తోంది. బర్గపాలి సమీపంలో అర్థరాత్రి దురదృష్టవశాత్తు బస్సు టైరు పంక్చర్ అయింది. ఏం జరిగిందో చూసేందుకు బస్సులోని ప్రయాణికులు బస్సు నుంచి దిగి బయటకు వచ్చారు. బయట వారి కోసం యముడు ఎదురు చూస్తున్నాడని పాపం ఊహించలేకపోయారు. ప్రయాణికులు బయట నిలబడి ఉండగా వేగంగా వచ్చిన లారీ వారిని ఢీకొట్టింది. నలుగురిపై నుంచి ట్రక్కు దూసుకెళ్లింది.
Read Also:Revanth Reddy: నేడు కొడంగల్ కు రేవంత్.. కుత్బుల్లాపూర్ లో బహిరంగ సభ
గాయపడిన 4 మందిని పరిస్థితి విషమంగా ఉండడంతో మొదట కిషోర్ సిటీ ఆసుపత్రిలో చేర్చారు. వారందరి ఆరోగ్యం విషమించడంతో సంబల్పూర్ జిల్లా రెబాచోల్ ఆసుపత్రికి తరలించారు. కిషోర్ నగర్ ఆసుపత్రిలో ఒకరు మరణించగా, మిగిలిన ఇద్దరు రెబాచోల్ ఆసుపత్రిలో మరణించారు. మరొకరు ఇంకా చికిత్స పొందుతున్నారు. మృతులు సుందర్గఢ్కు చెందిన ఆనంద్ ప్రధాన్, జార్సుగూడకు చెందిన నయన్ నాయక్, ఘనశ్యామ్ బారిక్. గాయపడిన వ్యక్తిని త్రిలోచన్ నాయక్గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!