Revanth Reddy: నేడు కొడంగల్ కు రేవంత్.. కుత్బుల్లాపూర్ లో బహిరంగ సభ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: నేడు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలోని పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు టీపీపీసీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్రాస్ పేట్, దుద్యాల్, కొత్తపల్లి కార్నర్ మీటింగ్స్ లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు బొమ్రాస్ పేట్, మధ్యాహ్నం 2.30 గంటలకు దుద్యాల్, మధ్యాహ్నం 3.30 గంటలకు కొత్తపల్లి కార్నర్ మీటింగ్స్ లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సాయంత్రం కుత్బుల్లాపూర్ బహిరంగసభలో పాల్గొననున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల కానుంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో విడుదలకు సమయం ఫిక్స్ చేసుకుంది. ఇప్పటికే ఆరు హామీల పేరుతో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్… మేనిఫెస్టో విడుదల చేసి.. ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టోను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అలాగే తులంతోపాటు కల్యాణలక్ష్మికి కూడా బంగారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రేపు బీజేపీ మేనిఫెస్టో విడుదల కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ భవన్ లో మేనిఫెస్టోను విడుదల తర్వాత మేనిఫెస్టోలోని అంశాలను వివరించనున్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, నిరుద్యోగులకు భరోసా కల్పించేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని హస్తం నేతలు అంటున్నారు.
Also Read
- Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
- KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో అంశాలు ఇవే..!
* సిటిజన్ చార్ట్ కి చట్టబద్దత
* ధరణీ స్థానంలో భూ భారతి పోర్టల్
* పసుపు కుంకుమ పథకం కింద ఒక లక్షతో పాటు తులం బంగారం
* తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి సన్న బియ్యం పంపిణీ
* అమ్మ హస్తం పథకం పేరుతో 9 నిత్యావసర సరుకుల పంపిణీ
* ఆర్ఎంపీలకు గుర్తింపు కార్డు
* రేషన్ డీలర్లకు గౌరవ వేతనం
* వార్డు సభ్యులు గౌరవ వేతనం
* ఎంబీసీ లకు ప్రత్యేక కార్పొరేషన్
* ట్రాన్స్ జెండర్లకు ఆటోలు ,ప్రత్యేక సంక్షేమ పథకాలు
* జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకం
Uttarkashi Tunnel Collapse: ఐదు రోజులైనా టన్నెల్లోనే 40మంది.. కొనసాగుతున్న రెస్క్యూ
తాజావార్తలు
-
Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ ‘గట్ ఫీల్’ గురించే అంటూ వ్యాఖ్యలు..
-
Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
-
WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
-
KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
-
Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?