RN Ravi: భారతదేశంలో ‘సెక్యులరిజం’ అవసరం లేదు- తమిళనాడు గవర్నర్..
- లౌకికవాదం పేరుతో భారతదేశ ప్రజలకు "మోసం" జరిగింది
- తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కీలక వ్యాఖ్యలు
- సెక్యులరిజం యూరోపియన్ భావన.. భారతదేశంలో అవసరం లేదు- తమిళనాడు గవర్నర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లౌకికవాదం పేరుతో భారతదేశ ప్రజలకు “మోసం” జరిగిందని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆరోపించారు. సెక్యులరిజం యూరోపియన్ భావన.. అది భారతదేశంలో అవసరం లేదని తమిళనాడు గవర్నర్ పేర్కొన్నారు. ఆదివారం కన్యాకుమారిలో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగిస్తూ.. ‘‘ఈ దేశ ప్రజలపై ఎన్నో మోసాలు జరిగాయి, వాటిలో ఒకటి లౌకికవాదానికి తప్పుడు భాష్యం, లౌకికవాదం అంటే ఏమిటి? లౌకికవాదం అనేది యూరోపియన్ భావన. భారతీయ భావన కాదు.” అని ఆర్ఎన్ రవి తెలిపారు
Read Also: Stree 2: ఖాన్లు టచ్ చేయలేని విధంగా ‘స్త్రీ 2’ రికార్డ్..
Also Read
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
గవర్నర్ ఆర్ఎన్ రవి మాట్లాడుతూ.. ఐరోపాలో చర్చికి, రాజుకు మధ్య జరిగిన ఘర్షణ వల్ల సెక్యులరిజం తలెత్తిందని వివరించారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో ఎవరు సెక్యులరిజం గురించి చర్చించారని ఆయన ప్రశ్నించారు. కానీ భారత్ ధర్మానికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ వైరుధ్యాలు ఉండవు.. కాబట్టి సెక్యులరిజాన్ని ఐరోపాలోనే ఉండనివ్వండని గవర్నర్ వ్యాఖ్యానించారు.
Read Also: Fastest Fifty In Test: టెస్టు క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన ఆటగాళ్లు వీళ్లే..
1976లో రాజ్యాంగ పీఠికలో “సెక్యులరిజం” అనే పదాన్ని ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కూడా గవర్నర్ రవి విమర్శించారు. ‘‘ఇరవై అయిదేళ్ల తర్వాత, ఎమర్జెన్సీ కాలంలో అభద్రతా భావంతో ఉన్న ప్రధాని.. కొన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో రాజ్యాంగంలో లౌకికవాదాన్ని ప్రవేశపెట్టారు’’ అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
-
Trump Tariffs: అమెరికా కోర్టు నుంచి ట్రంప్కు మరో ఎదురుదెబ్బ.. 10% సుంకాలు చట్టవిరుద్ధమని కొట్టివేత
-
BCCI-IPL 2026: ఇకపై ఐపీఎల్లో ఆటగాళ్ల ఆటలు సాగవు.. సస్పెన్షన్ లేదా డిస్క్వాలిఫికేషన్!
-
AshuReddy Case : అషురెడ్డి కేసులో స్టేకు హైకోర్టు నిరాకరణ.. రంగంలోకి పోలీసులు
-
Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!