Kolkata: 28 నుంచి 144 సెక్షన్.. మోడీ రోడ్ షో అడ్డుకునేందుకేనన్న బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మే 28 నుంచి కోల్కతాలో పోలీసులు 144 సెక్షన్ను విధించారు. హింసాత్మక నిరసనలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం కారణంగా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడవద్దని 60 రోజుల పాటు పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసుల ఆంక్షలపై బీజేపీ మండిపడుతోంది. మే 28న కోల్కతాలో ప్రధాని మోడీ రోడ్షో ఉంది. ఈ ర్యాలీని ఆపడానికే సీఎం మమత నిరంకుశ చర్యకు పాల్పడుతున్నారని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Ap High Court: పిన్నెల్లికి షాకిచ్చిన హైకోర్టు..కౌంటింగ్ రోజు మాచర్లకు వెళ్లొద్దని ఆదేశం
Also Read
- Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
- PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
- Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
- Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
కోల్కతా పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 144ను అమలు చేశారు. మే 28 నుంచి 60 రోజుల పాటు ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడవద్దని ఆదేశించింది. ఇంటెలిజెన్స్ సూచించిన ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హింసాత్మక నిరసనలు ప్రజా శాంతి మరియు ప్రశాంతతకు గణనీయమైన అంతరాయాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Medha Patkar: మేధా పాట్కర్కు షాక్.. పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారణ
28.05.2024 నుంచి 26.07.2024 వరకు 60 రోజుల పాటు లేదా హింసాత్మక ప్రదర్శనలు జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ఆధారంగా తదుపరి ఆర్డర్ వరకు ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు చట్టవిరుద్ధంగా సమావేశాన్ని నిషేధిస్తూ కోల్కతా కమీషనర్ ఆఫ్ పోలీస్ IPC సెక్షన్ 144ను విధించారు. ప్రజల ప్రశాంతతకు పెద్ద ఎత్తున విఘాతం ఏర్పడి శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని సీపీ వినీత్ కుమార్ గోయల్ ఆర్డర్ జారీ చేశారు.
బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ స్పందిస్తూ.. ప్రధాని మోడీ రోడ్షోను ఆపడానికే పోలీసులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఐదు దశల ఎన్నికల తర్వాత ప్రజల అభీష్టాన్ని పసిగట్టిన సీఎం మమత ఇప్పుడు భయపడుతున్నారన్నారు. 144ని అమలు చేసి మోడీ రోడ్షోను ఆపాలని ఆమె పోలీసులను ఆదేశించారని తెలిపారు.
ఇది కూడా చదవండి: Hyderabad: బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్వేర్ ఇంజనీరైన భార్యను చంపిన భర్త..
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం