Kolkata: 28 నుంచి 144 సెక్షన్.. మోడీ రోడ్ షో అడ్డుకునేందుకేనన్న బీజేపీ
మే 28 నుంచి కోల్కతాలో పోలీసులు 144 సెక్షన్ను విధించారు. హింసాత్మక నిరసనలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం కారణంగా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడవద్దని 60 రోజుల పాటు పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసుల ఆంక్షలపై బీజేపీ మండిపడుతోంది. మే 28న కోల్కతాలో ప్రధాని మోడీ రోడ్షో ఉంది. ఈ ర్యాలీని ఆపడానికే సీఎం మమత నిరంకుశ చర్యకు పాల్పడుతున్నారని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Ap High Court: పిన్నెల్లికి షాకిచ్చిన హైకోర్టు..కౌంటింగ్ రోజు మాచర్లకు వెళ్లొద్దని ఆదేశం
Also Read
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- AP High Court Serious: సీనియర్ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు సీరియస్.. మాకే అధికారముంటే ఈ క్షణాన్నే సస్పెండ్..!
- MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
- Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
కోల్కతా పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 144ను అమలు చేశారు. మే 28 నుంచి 60 రోజుల పాటు ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడవద్దని ఆదేశించింది. ఇంటెలిజెన్స్ సూచించిన ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హింసాత్మక నిరసనలు ప్రజా శాంతి మరియు ప్రశాంతతకు గణనీయమైన అంతరాయాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Medha Patkar: మేధా పాట్కర్కు షాక్.. పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారణ
28.05.2024 నుంచి 26.07.2024 వరకు 60 రోజుల పాటు లేదా హింసాత్మక ప్రదర్శనలు జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ఆధారంగా తదుపరి ఆర్డర్ వరకు ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు చట్టవిరుద్ధంగా సమావేశాన్ని నిషేధిస్తూ కోల్కతా కమీషనర్ ఆఫ్ పోలీస్ IPC సెక్షన్ 144ను విధించారు. ప్రజల ప్రశాంతతకు పెద్ద ఎత్తున విఘాతం ఏర్పడి శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని సీపీ వినీత్ కుమార్ గోయల్ ఆర్డర్ జారీ చేశారు.
బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ స్పందిస్తూ.. ప్రధాని మోడీ రోడ్షోను ఆపడానికే పోలీసులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఐదు దశల ఎన్నికల తర్వాత ప్రజల అభీష్టాన్ని పసిగట్టిన సీఎం మమత ఇప్పుడు భయపడుతున్నారన్నారు. 144ని అమలు చేసి మోడీ రోడ్షోను ఆపాలని ఆమె పోలీసులను ఆదేశించారని తెలిపారు.
ఇది కూడా చదవండి: Hyderabad: బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్వేర్ ఇంజనీరైన భార్యను చంపిన భర్త..
తాజావార్తలు
-
Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
-
AP High Court Serious: సీనియర్ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు సీరియస్.. మాకే అధికారముంటే ఈ క్షణాన్నే సస్పెండ్..!
-
MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
-
Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!