Kolkata: 28 నుంచి 144 సెక్షన్.. మోడీ రోడ్ షో అడ్డుకునేందుకేనన్న బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మే 28 నుంచి కోల్కతాలో పోలీసులు 144 సెక్షన్ను విధించారు. హింసాత్మక నిరసనలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం కారణంగా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడవద్దని 60 రోజుల పాటు పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసుల ఆంక్షలపై బీజేపీ మండిపడుతోంది. మే 28న కోల్కతాలో ప్రధాని మోడీ రోడ్షో ఉంది. ఈ ర్యాలీని ఆపడానికే సీఎం మమత నిరంకుశ చర్యకు పాల్పడుతున్నారని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Ap High Court: పిన్నెల్లికి షాకిచ్చిన హైకోర్టు..కౌంటింగ్ రోజు మాచర్లకు వెళ్లొద్దని ఆదేశం
Also Read
- Road Accident: తూర్పుగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. టాటా ఏస్ బోల్తా, ముగ్గురు మృతి!
- TMC Crisis: మమతా బెనర్జీపైనే వేటు వేసిన టీఎంసీ తిరుగుబాటు వర్గం.. కొత్త బాస్గా అరూప్ రాయ్ ప్రకటన!
- CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన 'అవ్ని కేజ్రీవాల్'.!
- Virat Kohli: "నా పని అయిపోయింది.. మళ్లీ ఆడాలనుకోవడం లేదు".. కోహ్లీ షాకింగ్ స్టేట్మెంట్..
కోల్కతా పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 144ను అమలు చేశారు. మే 28 నుంచి 60 రోజుల పాటు ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడవద్దని ఆదేశించింది. ఇంటెలిజెన్స్ సూచించిన ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హింసాత్మక నిరసనలు ప్రజా శాంతి మరియు ప్రశాంతతకు గణనీయమైన అంతరాయాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Medha Patkar: మేధా పాట్కర్కు షాక్.. పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారణ
28.05.2024 నుంచి 26.07.2024 వరకు 60 రోజుల పాటు లేదా హింసాత్మక ప్రదర్శనలు జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ఆధారంగా తదుపరి ఆర్డర్ వరకు ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు చట్టవిరుద్ధంగా సమావేశాన్ని నిషేధిస్తూ కోల్కతా కమీషనర్ ఆఫ్ పోలీస్ IPC సెక్షన్ 144ను విధించారు. ప్రజల ప్రశాంతతకు పెద్ద ఎత్తున విఘాతం ఏర్పడి శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని సీపీ వినీత్ కుమార్ గోయల్ ఆర్డర్ జారీ చేశారు.
బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ స్పందిస్తూ.. ప్రధాని మోడీ రోడ్షోను ఆపడానికే పోలీసులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఐదు దశల ఎన్నికల తర్వాత ప్రజల అభీష్టాన్ని పసిగట్టిన సీఎం మమత ఇప్పుడు భయపడుతున్నారన్నారు. 144ని అమలు చేసి మోడీ రోడ్షోను ఆపాలని ఆమె పోలీసులను ఆదేశించారని తెలిపారు.
ఇది కూడా చదవండి: Hyderabad: బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్వేర్ ఇంజనీరైన భార్యను చంపిన భర్త..
తాజావార్తలు
-
I Nobody Trailer : పృద్వి రాజ్ సుకుమారన్.. ‘ఐ-నోబడి’ ట్రైలర్.. అదిరింది
-
Road Accident: తూర్పుగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. టాటా ఏస్ బోల్తా, ముగ్గురు మృతి!
-
TMC Crisis: మమతా బెనర్జీపైనే వేటు వేసిన టీఎంసీ తిరుగుబాటు వర్గం.. కొత్త బాస్గా అరూప్ రాయ్ ప్రకటన!
-
Jamun: రోజుకు 8 నుంచి 10 నేరేడు పండ్లు.. డాక్టర్లు చెప్పిన ఆరోగ్య రహస్యం!
-
CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!
ట్రెండింగ్
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!