Uttar Pradesh: రెండేళ్లుగా అత్యాచారం.. బిడ్డను చంపేస్తేనే పెళ్లి చేసుకుంటానన్న నీచుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఓ యువకుడు పెళ్లి సాకుతో యువతిపై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సమయంలో ఆమె గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి చేసుకోమని యువతి యువకుడిని బలవంతం చేయగా.. ఈ చిన్నారిని చంపేస్తే చేసుకుంటా.. ఇలా చేయకుంటే నేను పెళ్లి చేసుకోను. దీంతో పాటు నీ అశ్లీల వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరింపులకు దిగాడు.
యువకుడి బెదిరింపుపై భయపడిన యువతి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. కాని పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ యువకుడు తనను చంపేస్తానని పదే పదే బెదిరిస్తున్నాడని యువతి ఆరోపించింది. దీంతో ఆందోళనకు గురైన ఆమె ఎస్ఎస్పీ కార్యాలయానికి చేరుకుని యువకుడిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్ఎస్పీ ఆదేశించారు.
Also Read
- Minister Narayana: హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా అమరావతి.. ప్రపంచ టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం..
- Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. "డ్రైవర్నే చంపుకోండి" అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
- Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
- Amaravati Seed Access Road: అమరావతికి మరో కీలక రహదారి.. సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన చంద్రబాబు
Read Also:Tomato: నా టమాటాలు పోయాయి సార్.. పూణెలో పోలీస్ స్టేషన్లో మొదటి కంప్లైంట్
కాంట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న యువతి తన వ్యక్తిగత పని కోసం నారియావాల్కు వెళ్లేది. నరియావాల్లోనే ప్రదీప్ను కలిసింది. క్రమంగా ప్రదీప్తో స్నేహం ఏర్పడి ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. పెళ్లి సాకుతో రెండేళ్లుగా ప్రదీప్ ఆమెతో సంబంధాలు కొనసాగించాడు. పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు ప్రదీప్ కొన్ని రోజులు ఆగండి, తర్వాత కోర్ట్ మ్యారేజ్ చేసుకుంటామని నమ్మించినట్లు అమ్మాయి తెలిపింది.
ఇంతలోనే తాను గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె తెలిపింది. బిడ్డ పుట్టిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ప్రదీప్ పెళ్లికి నిరాకరించాడు. బిడ్డను చంపేయండి, అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆమె నిరాకరించడంతో ప్రదీప్ చంపేస్తానని బెదిరించాడు. అంతేకాదు తన అసభ్యకర వీడియోలు, ఫొటోలను వైరల్ చేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు.
Read Also:Kishan Reddy: నేడే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు.. పాల్గొననున్న ముఖ్యనేతలు
ప్రదీప్ చర్యతో కలత చెందిన తాను బిత్రి పోలీస్ స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్య తీసుకోలేదని యువతి తెలిపింది. దీంతో ఆందోళనకు గురైన ఆమె గురువారం ఎస్ఎస్పీ కార్యాలయానికి చేరుకుని నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరింది. యువతి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్ఎస్పీ ప్రభాకర్ చౌదరి బిత్రి పోలీసు స్టేషన్ను ఆదేశించారు.
తాజావార్తలు
-
Wamika Gabbi : ‘DC’తో తమిళ్లో మొదటి సూపర్ హిట్ అందుకున్న వామికా
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
Minister Narayana: హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా అమరావతి.. ప్రపంచ టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం..
-
Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. “డ్రైవర్నే చంపుకోండి” అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
-
Scam 2010: రూ.24 వేల కోట్ల భారీ స్కామ్.. ఓటీటీలోకి మరో అవినీతి బాంబ్ తో వస్తున్న హన్సల్ మెహతా
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!