Uttar Pradesh: రెండేళ్లుగా అత్యాచారం.. బిడ్డను చంపేస్తేనే పెళ్లి చేసుకుంటానన్న నీచుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఓ యువకుడు పెళ్లి సాకుతో యువతిపై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సమయంలో ఆమె గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి చేసుకోమని యువతి యువకుడిని బలవంతం చేయగా.. ఈ చిన్నారిని చంపేస్తే చేసుకుంటా.. ఇలా చేయకుంటే నేను పెళ్లి చేసుకోను. దీంతో పాటు నీ అశ్లీల వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరింపులకు దిగాడు.
యువకుడి బెదిరింపుపై భయపడిన యువతి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. కాని పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ యువకుడు తనను చంపేస్తానని పదే పదే బెదిరిస్తున్నాడని యువతి ఆరోపించింది. దీంతో ఆందోళనకు గురైన ఆమె ఎస్ఎస్పీ కార్యాలయానికి చేరుకుని యువకుడిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్ఎస్పీ ఆదేశించారు.
Also Read
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
Read Also:Tomato: నా టమాటాలు పోయాయి సార్.. పూణెలో పోలీస్ స్టేషన్లో మొదటి కంప్లైంట్
కాంట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న యువతి తన వ్యక్తిగత పని కోసం నారియావాల్కు వెళ్లేది. నరియావాల్లోనే ప్రదీప్ను కలిసింది. క్రమంగా ప్రదీప్తో స్నేహం ఏర్పడి ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. పెళ్లి సాకుతో రెండేళ్లుగా ప్రదీప్ ఆమెతో సంబంధాలు కొనసాగించాడు. పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు ప్రదీప్ కొన్ని రోజులు ఆగండి, తర్వాత కోర్ట్ మ్యారేజ్ చేసుకుంటామని నమ్మించినట్లు అమ్మాయి తెలిపింది.
ఇంతలోనే తాను గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె తెలిపింది. బిడ్డ పుట్టిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ప్రదీప్ పెళ్లికి నిరాకరించాడు. బిడ్డను చంపేయండి, అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆమె నిరాకరించడంతో ప్రదీప్ చంపేస్తానని బెదిరించాడు. అంతేకాదు తన అసభ్యకర వీడియోలు, ఫొటోలను వైరల్ చేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు.
Read Also:Kishan Reddy: నేడే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు.. పాల్గొననున్న ముఖ్యనేతలు
ప్రదీప్ చర్యతో కలత చెందిన తాను బిత్రి పోలీస్ స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్య తీసుకోలేదని యువతి తెలిపింది. దీంతో ఆందోళనకు గురైన ఆమె గురువారం ఎస్ఎస్పీ కార్యాలయానికి చేరుకుని నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరింది. యువతి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్ఎస్పీ ప్రభాకర్ చౌదరి బిత్రి పోలీసు స్టేషన్ను ఆదేశించారు.
తాజావార్తలు
-
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
-
Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
-
Chinmayi: డబ్బింగ్ రూమ్లో భావోద్వేగానికి గురైన చిన్మయి శ్రీపాద
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..