Germany : తవ్వకాల్లో లభించిన 1000 అస్థిపంజరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Germany : ప్రపంచంలోని అనేక దేశాల్లోని పురాతన ప్రదేశాల్లో తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో అనేక ఆశ్చర్యకరమైన ఆవిష్కరణలు జరుగుతాయి. జర్మనీలోని న్యూరేమ్బెర్గ్లో ఇలాంటి ఆవిష్కరణ జరిగింది. ఇందులో సామూహిక సమాధిని గుర్తించారు. ఇక్కడ రిటైర్మెంట్ హోమ్ను నిర్మిస్తున్నారు. దాని కోసమే తవ్వకం పనులు సాగుతున్నాయి. ఇది అతిపెద్ద సామూహిక సమాధులలో ఒకటిగా పరిగణించబడుతుంది. కనీసం 1000 అస్థిపంజరాలు కనుగొనబడ్డాయి. నురేమ్బెర్గ్ మధ్యలో ఉన్న సామూహిక సమాధిలో కనుగొనబడిన అస్థిపంజరాలు ప్లేగు బాధితులవి. సుమారు 1,000 అస్థిపంజరాలు కనుగొనబడ్డాయి. అందులో మొత్తం 1,500 మందికి పైగా ఉండవచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Read Also:Breaking: చైనాలో భారీ పేలుడు.. చెల్లా చెదురుగా భవనాల శిథిలాలు..!
Also Read
- FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
- FIFA World Cup 2026 Final: పొట్టుపొట్టుగా కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. వీడియో వైరల్.!
- US - Iran War: ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. వరుస దాడులతో ఉద్రిక్తత.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఈ సమాధి ఎంత పాతదో ఇంకా తెలియరాలేదు. ఇవి 17వ శతాబ్దానికి చెందినవని భావిస్తున్నారు. కొన్ని ఎముకల రంగు ఆకుపచ్చగా ఉన్నట్లు గుర్తించారు. దీనికి కారణం సమీపంలోని రాగిమిల్లు నుండి వ్యర్థాలను ఇక్కడ పడవేయడమేనని భావిస్తున్నారు. “భవిష్యత్తులో నిర్మాణ ప్రాంతాలలో కనిపించే అన్ని మానవ అవశేషాలను మేము రక్షిస్తాము.. నిల్వ చేస్తాము” అని పురావస్తు శాస్త్రవేత్త మెలానీ లాంగ్బీన్, న్యూరేమ్బెర్గ్ హెరిటేజ్ కన్జర్వేషన్ డిపార్ట్మెంట్, చీఫ్ ఆంత్రోపాలజిస్ట్ ఫ్లోరియన్ మెల్జర్ సైన్స్ అలర్ట్తో చెప్పారు. ఐరోపాలో కనుగొనబడిన ప్లేగు బాధితుల అతిపెద్ద అత్యవసర స్మశానవాటికగా దీనిని పరిగణిస్తున్నారు.
Read Also:MLA Shanampudi: ఢిల్లీకి పిలిచి బీజేపీ కండువా కప్పుకోమన్నారు.. సైదిరెడ్డి ఆడియో వైరల్..
ఈ ప్రాజెక్టు పూర్తయితే యూరప్లో కనుగొనబడిన ప్లేగు బాధితుల్లో అతిపెద్ద అత్యవసర సమాధి అవుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్లాక్ డెత్, జస్టినియన్ ప్లేగు వంటి వినాశకరమైన అంటువ్యాధులకు బుబోనిక్ ప్లేగు కారణమని భావిస్తారు. బ్లాక్ డెత్ తర్వాత నురేమ్బెర్గ్ వంటి నగరాలు బాగా ప్రభావితమయ్యాయి. న్యూరేమ్బెర్గ్లో ప్లేగు వ్యాధితో మరణించిన ఈ వ్యక్తులను క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఖననం చేయలేదు. అత్యవసర పరిస్థితుల్లో ఉమ్మడిగా ఖననం చేశారు. ఈ వ్యక్తుల మరణ పరిస్థితులను అర్థం చేసుకోవడంతో పాటు, ఈ అవశేషాల అధ్యయనం చరిత్ర గురించి చాలా విషయాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Khadgam Re Release: దేశభక్తి సినిమాలకే బాస్.. ‘ఖడ్గం’ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది!
-
FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
-
Tesla Kids Bike: పిల్లల కోసం టెస్లా కొత్త బ్యాలెన్స్ బైక్.. పెడల్స్, మోటార్ లేకుండానే సైక్లింగ్ నేర్పించే ప్రత్యేక డిజైన్
-
spirit : స్పిరిట్ పోస్ట్పోన్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
-
Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
ట్రెండింగ్
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్