Germany : తవ్వకాల్లో లభించిన 1000 అస్థిపంజరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Germany : ప్రపంచంలోని అనేక దేశాల్లోని పురాతన ప్రదేశాల్లో తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో అనేక ఆశ్చర్యకరమైన ఆవిష్కరణలు జరుగుతాయి. జర్మనీలోని న్యూరేమ్బెర్గ్లో ఇలాంటి ఆవిష్కరణ జరిగింది. ఇందులో సామూహిక సమాధిని గుర్తించారు. ఇక్కడ రిటైర్మెంట్ హోమ్ను నిర్మిస్తున్నారు. దాని కోసమే తవ్వకం పనులు సాగుతున్నాయి. ఇది అతిపెద్ద సామూహిక సమాధులలో ఒకటిగా పరిగణించబడుతుంది. కనీసం 1000 అస్థిపంజరాలు కనుగొనబడ్డాయి. నురేమ్బెర్గ్ మధ్యలో ఉన్న సామూహిక సమాధిలో కనుగొనబడిన అస్థిపంజరాలు ప్లేగు బాధితులవి. సుమారు 1,000 అస్థిపంజరాలు కనుగొనబడ్డాయి. అందులో మొత్తం 1,500 మందికి పైగా ఉండవచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Read Also:Breaking: చైనాలో భారీ పేలుడు.. చెల్లా చెదురుగా భవనాల శిథిలాలు..!
Also Read
- Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
- Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
- CM Chandrababu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
ఈ సమాధి ఎంత పాతదో ఇంకా తెలియరాలేదు. ఇవి 17వ శతాబ్దానికి చెందినవని భావిస్తున్నారు. కొన్ని ఎముకల రంగు ఆకుపచ్చగా ఉన్నట్లు గుర్తించారు. దీనికి కారణం సమీపంలోని రాగిమిల్లు నుండి వ్యర్థాలను ఇక్కడ పడవేయడమేనని భావిస్తున్నారు. “భవిష్యత్తులో నిర్మాణ ప్రాంతాలలో కనిపించే అన్ని మానవ అవశేషాలను మేము రక్షిస్తాము.. నిల్వ చేస్తాము” అని పురావస్తు శాస్త్రవేత్త మెలానీ లాంగ్బీన్, న్యూరేమ్బెర్గ్ హెరిటేజ్ కన్జర్వేషన్ డిపార్ట్మెంట్, చీఫ్ ఆంత్రోపాలజిస్ట్ ఫ్లోరియన్ మెల్జర్ సైన్స్ అలర్ట్తో చెప్పారు. ఐరోపాలో కనుగొనబడిన ప్లేగు బాధితుల అతిపెద్ద అత్యవసర స్మశానవాటికగా దీనిని పరిగణిస్తున్నారు.
Read Also:MLA Shanampudi: ఢిల్లీకి పిలిచి బీజేపీ కండువా కప్పుకోమన్నారు.. సైదిరెడ్డి ఆడియో వైరల్..
ఈ ప్రాజెక్టు పూర్తయితే యూరప్లో కనుగొనబడిన ప్లేగు బాధితుల్లో అతిపెద్ద అత్యవసర సమాధి అవుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్లాక్ డెత్, జస్టినియన్ ప్లేగు వంటి వినాశకరమైన అంటువ్యాధులకు బుబోనిక్ ప్లేగు కారణమని భావిస్తారు. బ్లాక్ డెత్ తర్వాత నురేమ్బెర్గ్ వంటి నగరాలు బాగా ప్రభావితమయ్యాయి. న్యూరేమ్బెర్గ్లో ప్లేగు వ్యాధితో మరణించిన ఈ వ్యక్తులను క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఖననం చేయలేదు. అత్యవసర పరిస్థితుల్లో ఉమ్మడిగా ఖననం చేశారు. ఈ వ్యక్తుల మరణ పరిస్థితులను అర్థం చేసుకోవడంతో పాటు, ఈ అవశేషాల అధ్యయనం చరిత్ర గురించి చాలా విషయాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
-
వరంగల్ MGMలో ఒక్కసారిగా కుప్పకూలిన సీలింగ్.. ముగ్గురికి గాయాలు!
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!