MLA Shanampudi: ఢిల్లీకి పిలిచి బీజేపీ కండువా కప్పుకోమన్నారు.. సైదిరెడ్డి ఆడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Shanampudi: తనకు ఇష్టం లేకున్నా.. బలవంతంగా బీజేపీలో చేరానని హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే సానంపూడి సైదిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయనే స్వయంగా మాట్లాడిన ఆడియో సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. పార్టీ నేతలందరూ తనకు సపోర్టుగా నిలబడాలని కోరారు. ఇష్టంగా వెళ్లలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Read also: Anil Ambani: ముంబై మెట్రోలో రూ.4000కోట్ల వాటాను విక్రయించనున్న అనిల్ అంబానీ
Also Read
- CM Revanth Reddy: నియామకాలను బాధ్యతగా తీసుకున్నాం.. 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం..
- CM Revanth Reddy: రాష్ట్రంలో 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేశాం..
- Cyberabad: దారుణం.. ఆలయంలో మైనర్ బాలికపై పూజారి లైంగిక దాడి.!
- CM Revanth Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో చుక్క నీటినీ వదులుకోం.. గోల్కొండ కోట వేదికగా సీఎం రేవంత్ భరోసా..
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్ వాయిస్ రికార్డ్ సోషల్ మీడియాలో ఆడియో వైరల్ అవుతుంది. ఢిల్లీకి పిలిచి బీజేపీ కండువా కప్పుకోమన్నారు. ఎంపీ టికెట్ నీకే వస్తుందన్నారని తెలిపారు. ఇప్పుడు కండువా కప్పుకోకుంటే పార్టీ పరువు పోతుందన్నారు. కేంద్రంలో మళ్ళీ బీజేపీనే వస్తుందన్నారు. మోడీ ప్రధాని అవుతారన్నారు. ఎన్నికలపుడు డబ్బులు ఇవ్వకుండా అవతల వారికి ఇస్తే ఎలా పని చేస్తామన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి అర్ధం కావడం లేదన్నారు. రంజిత్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి పోటీ చేయడం లేదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని దింపాలని కాంగ్రెస్ వాళ్ళే అనుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 12 ఎంపీ సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉందంటున్నారని తెలిపారు. పార్టీ మారినందుకు క్షమించండి అంటూ తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నారు.
Read also: Guntur: అత్తింటి వేధింపులు, అప్పుల బాధతో ఓ కటుుంబం ఆత్మహత్యయత్నం..
మహబూబాబాద్, ఆదిలాబాద్ మాజీ ఎంపీలు సీతారాంనాయక్, గొడం నగేశ్, హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే సానంపూడి సైదిరెడ్డి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో నలుగురు బీజేపీలో చేరారు. వారికి బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ నాయకులు లక్ష్మణ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డితోపాటు పలువురు పాల్గొన్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో లోక్సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో బీఆర్ఎస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో.. సైదిరెడ్డి ఆడియో మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
Weight Loss Tips: నానబెట్టిన శనగల నీటిని తాగితే బరువుతగ్గడంతో పాటు ఆ సమస్యలు దూరం..
తాజావార్తలు
-
Vande Mataram Controversy: ‘వందేమాతరం’పై రాజకీయ దుమారం.. కాంగ్రెస్ కార్యాలయంలో ఏం జరిగింది?
-
India Test Cricket History: 94 ఏళ్ల టెస్ట్ ప్రయాణం.. 600వ మ్యాచ్కు చేరుకున్న టీమిండియా చరిత్ర ఇదే..!
-
Mahindra BE 6 SPORTEQ: మహీంద్రా BE6 స్పోర్టెక్ ఎలక్ట్రిక్ SUV విడుదల.. 683KM రేంజ్, Gemini AIతో అదిరిపోయే ఫీచర్లు
-
Saira Banu First Look: ముస్లిం అమ్మాయిని ప్రేమించే యువకుడిగా ఆది.. ఆకట్టుకుంటున్న ‘సైరాబాను’ ఫస్ట్ లుక్..
-
Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు బ్రేక్..! హిట్మ్యాన్కు మరో అవకాశం
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!