Germany : తవ్వకాల్లో లభించిన 1000 అస్థిపంజరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Germany : ప్రపంచంలోని అనేక దేశాల్లోని పురాతన ప్రదేశాల్లో తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో అనేక ఆశ్చర్యకరమైన ఆవిష్కరణలు జరుగుతాయి. జర్మనీలోని న్యూరేమ్బెర్గ్లో ఇలాంటి ఆవిష్కరణ జరిగింది. ఇందులో సామూహిక సమాధిని గుర్తించారు. ఇక్కడ రిటైర్మెంట్ హోమ్ను నిర్మిస్తున్నారు. దాని కోసమే తవ్వకం పనులు సాగుతున్నాయి. ఇది అతిపెద్ద సామూహిక సమాధులలో ఒకటిగా పరిగణించబడుతుంది. కనీసం 1000 అస్థిపంజరాలు కనుగొనబడ్డాయి. నురేమ్బెర్గ్ మధ్యలో ఉన్న సామూహిక సమాధిలో కనుగొనబడిన అస్థిపంజరాలు ప్లేగు బాధితులవి. సుమారు 1,000 అస్థిపంజరాలు కనుగొనబడ్డాయి. అందులో మొత్తం 1,500 మందికి పైగా ఉండవచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Read Also:Breaking: చైనాలో భారీ పేలుడు.. చెల్లా చెదురుగా భవనాల శిథిలాలు..!
Also Read
ఈ సమాధి ఎంత పాతదో ఇంకా తెలియరాలేదు. ఇవి 17వ శతాబ్దానికి చెందినవని భావిస్తున్నారు. కొన్ని ఎముకల రంగు ఆకుపచ్చగా ఉన్నట్లు గుర్తించారు. దీనికి కారణం సమీపంలోని రాగిమిల్లు నుండి వ్యర్థాలను ఇక్కడ పడవేయడమేనని భావిస్తున్నారు. “భవిష్యత్తులో నిర్మాణ ప్రాంతాలలో కనిపించే అన్ని మానవ అవశేషాలను మేము రక్షిస్తాము.. నిల్వ చేస్తాము” అని పురావస్తు శాస్త్రవేత్త మెలానీ లాంగ్బీన్, న్యూరేమ్బెర్గ్ హెరిటేజ్ కన్జర్వేషన్ డిపార్ట్మెంట్, చీఫ్ ఆంత్రోపాలజిస్ట్ ఫ్లోరియన్ మెల్జర్ సైన్స్ అలర్ట్తో చెప్పారు. ఐరోపాలో కనుగొనబడిన ప్లేగు బాధితుల అతిపెద్ద అత్యవసర స్మశానవాటికగా దీనిని పరిగణిస్తున్నారు.
Read Also:MLA Shanampudi: ఢిల్లీకి పిలిచి బీజేపీ కండువా కప్పుకోమన్నారు.. సైదిరెడ్డి ఆడియో వైరల్..
ఈ ప్రాజెక్టు పూర్తయితే యూరప్లో కనుగొనబడిన ప్లేగు బాధితుల్లో అతిపెద్ద అత్యవసర సమాధి అవుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్లాక్ డెత్, జస్టినియన్ ప్లేగు వంటి వినాశకరమైన అంటువ్యాధులకు బుబోనిక్ ప్లేగు కారణమని భావిస్తారు. బ్లాక్ డెత్ తర్వాత నురేమ్బెర్గ్ వంటి నగరాలు బాగా ప్రభావితమయ్యాయి. న్యూరేమ్బెర్గ్లో ప్లేగు వ్యాధితో మరణించిన ఈ వ్యక్తులను క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఖననం చేయలేదు. అత్యవసర పరిస్థితుల్లో ఉమ్మడిగా ఖననం చేశారు. ఈ వ్యక్తుల మరణ పరిస్థితులను అర్థం చేసుకోవడంతో పాటు, ఈ అవశేషాల అధ్యయనం చరిత్ర గురించి చాలా విషయాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
PoK Unrest 2026: పతనం అంచున పీఓకే.. పాలకులపై తిరగబడ్డ జనం! భారత్లో కలవడానికి పీఓకే మొగ్గు చూపుతోందా?
-
Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
-
Sing Geetham : రిలీజ్లో లాస్ట్ మినిట్ ట్విస్ట్.. వెనక్కి తగ్గిన నాగ్ అశ్విన్!
-
ISIS: మహిళలపై అకృత్యాలకు ఐసిస్ ‘హ్యాండ్బుక్’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Chhatta Bazaar Arch Collapse : హైదరాబాద్లో భారీ వర్షాల ఎఫెక్ట్.. పాతబస్తీలో కూలిన చారిత్రక కమాన్.!
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!