Crime News: కీచక ప్రిన్సిపల్.. టూర్లో స్టూడెంట్ తినే అన్నంలో మత్తు ఇచ్చి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: విద్యాబుద్ధులు చెప్పి వాళ్లను తీర్చిదిద్దాల్సిన టీచర్లే విద్యార్థుల భవిష్యత్ను చిదిమేస్తున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. ప్రతీరోజు ఏదో ఒక చోట తమ దగ్గర విద్యనభ్యసిస్తున్న స్టూడెంట్లపై దాడులకు పాల్పడుతున్న కీచక టీచర్ల వార్తలు వింటూనే ఉన్నాం. అదే క్రమంలో తాజాగా ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. స్కూల్ విహార యాత్రలో విద్యార్థినికి మత్తుమందు ఇచ్చిన ప్రిన్సిపాల్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక ప్రభుత్వ స్కూల్కు చెందిన ప్రిన్సిపాల్ నవంబర్ 23న 11వ తరగతి చదువుతున్న తొమ్మిదిమంది విద్యార్థులను టూర్ నిమిత్తం బృందావనం తీసుకెళ్లాడు.
Read Also: MLC Kavitha: ముగిసిన ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ
Also Read
ఆ రాత్రి అక్కడ బస చేసేందుకు హోటల్లో రెండు గదులు బుక్ చేశాడు. ఒక రూమ్లో ఎనిమిది విద్యార్థులు ఉండగా, 17 ఏళ్ల బాలికతో కలిసి మరో గదిలో ప్రిన్సిపాల్ బస చేశాడు. ఆమె తినే ఆహారంలో మత్తుమందు కలిపాడు. మత్తులో ఉన్న ఆ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పరీక్షలో ఫెయిల్ చేస్తానని, చంపుతానని బెదిరించాడు. ఆ మరునాడు విద్యార్థులు తమ ఇళ్లకు తిరిగివచ్చారు. కాగా, బాధిత బాలిక భయపడి ముందు ఈ విషయం గురించి ఎవరితో నోరువిప్పలేదు. ఆ తర్వాత ప్రిన్సిపాల్ లైంగిక దాడి గురించి తన కుటుంబానికి తెలిపింది. ఈ నేపథ్యంలో విద్యార్థిని తండ్రి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. పరారీలో ఉన్న ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపాల్ కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
-
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
-
తెలంగాణ జలియన్వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!