Andhra Pradesh: విద్యారంగంలో ప్రభుత్వం కీలక ముందడుగు.. నేడు సీఎం సమక్షంలో ఒప్పందం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది.. ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది.. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ఐబీ సిలబస్ తీసుకురానున్నారు.. రాష్ట్ర ప్రభుత్వ SCERTతో అంతర్జాతీయ విద్యా బోర్డు IB భాగస్వామ్యం కాబోతోంది.. దీనికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఒప్పందం జరగనుంది.. ఈ రోజు ఉదయం 10 గంటలకు అంతర్జాతీయ విద్యా బోర్డుతో రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీఈఆర్టీ (SCERT) ఒప్పందం చేసుకోబోతోంది.. 2025 విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్ లో విద్యా బోధన ప్రారంభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. 2025 జూన్ లో ఒకటవ తరగతికి IBలో విద్యాబోధన చేపట్టనున్నారు.. ఇక, జూన్ 2026 నుండి రెండో తరగతికి IBలో విద్యాబోధన అందించేవిధంగా ప్లాన్ చేస్తున్నారు.. క్రమంగా ఒక్కో ఏడాది ఒక్కో తరగతికి పెంచుతూ 2035 నాటికి 10వ తరగతికి ఐబీ సిలబస్ అందించనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇలా 2037 నాటికి 12వ తరగతి వరకు ఐబీ సిలబస్ ప్రారంభించనున్నారు.. అంతేకాకుండా.. విద్యార్థులకు ఐబీ, రాష్ట్ర బోర్డుల జాయింట్ సర్టిఫికేషన్ అందించనున్నారు.
Read Also: Gold Price Today: బంగారం ప్రియులకు షాక్.. వరుసగా రెండోరోజు పెరిగిన పసిడి ధరలు!
Also Read
మొత్తంగా ఈ రోజు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (SCERT) మరియు ఇంటర్నేషనల్ బాకలారియేట్ (IB) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పందంపై సంతకం చేయనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పోటీపడి గెలవడానికి విద్యార్థులను సిద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ఈ ఒప్పందం ఒక ముందడుగుగా అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి వారీగా దశలవారీగా ఐబీని ప్రవేశపెట్టనున్నారు. కాగా, విద్యారంగంలో జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద వంటి అనేక సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇంగ్లీషు ప్రాథమిక స్థాయి నుండి CBSE నుండి IBకి మారడం ద్వారా బోధనా మాధ్యమంగా మార్చబడింది. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ 3వ తరగతి నుండి ప్రవేశపెట్టబడింది. ద్విభాషా పాఠ్యపుస్తకాలు మరియు ఆక్స్ఫర్డ్ నిఘంటువుతో సహా 9 అంశాలతో కూడిన జగనన్న విద్యా కానుక కిట్లు విద్యార్థులకు సరఫరా చేయబడుతున్నాయి. తద్వారా ఆంగ్ల పాఠాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు.
Read Also: AP Govt: ఏపీ సర్కార్ ముందడుగు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్..
ఇక, బైజుస్ కంటెంట్ 4 నుండి 12వ తరగతి వరకు ఉచితంగా అందించబడుతుంది. అలాగే, 8వ తరగతి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు బైజు ప్రీ-లోడ్ చేసిన కంటెంట్తో కూడిన ఉచిత ట్యాబ్లు అందించబడుతున్నాయి. ఐబీ ప్రమాణాలకు అనుగుణంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు అప్గ్రేడేషన్ నాడు-నేడు ద్వారా చేయబడుతుంది. డిజిటల్ విద్యను ప్రోత్సహించడానికి ఆరవ తరగతి మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల విద్యార్థుల కోసం సుమారు 62,000 IFPలు వ్యవస్థాపించబడ్డాయి. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న ప్రతి పాఠశాలలో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు.. ఇలా విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!