Andhra Pradesh: విద్యారంగంలో ప్రభుత్వం కీలక ముందడుగు.. నేడు సీఎం సమక్షంలో ఒప్పందం..
Andhra Pradesh: విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది.. ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది.. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ఐబీ సిలబస్ తీసుకురానున్నారు.. రాష్ట్ర ప్రభుత్వ SCERTతో అంతర్జాతీయ విద్యా బోర్డు IB భాగస్వామ్యం కాబోతోంది.. దీనికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఒప్పందం జరగనుంది.. ఈ రోజు ఉదయం 10 గంటలకు అంతర్జాతీయ విద్యా బోర్డుతో రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీఈఆర్టీ (SCERT) ఒప్పందం చేసుకోబోతోంది.. 2025 విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్ లో విద్యా బోధన ప్రారంభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. 2025 జూన్ లో ఒకటవ తరగతికి IBలో విద్యాబోధన చేపట్టనున్నారు.. ఇక, జూన్ 2026 నుండి రెండో తరగతికి IBలో విద్యాబోధన అందించేవిధంగా ప్లాన్ చేస్తున్నారు.. క్రమంగా ఒక్కో ఏడాది ఒక్కో తరగతికి పెంచుతూ 2035 నాటికి 10వ తరగతికి ఐబీ సిలబస్ అందించనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇలా 2037 నాటికి 12వ తరగతి వరకు ఐబీ సిలబస్ ప్రారంభించనున్నారు.. అంతేకాకుండా.. విద్యార్థులకు ఐబీ, రాష్ట్ర బోర్డుల జాయింట్ సర్టిఫికేషన్ అందించనున్నారు.
Read Also: Gold Price Today: బంగారం ప్రియులకు షాక్.. వరుసగా రెండోరోజు పెరిగిన పసిడి ధరలు!
మొత్తంగా ఈ రోజు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (SCERT) మరియు ఇంటర్నేషనల్ బాకలారియేట్ (IB) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పందంపై సంతకం చేయనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పోటీపడి గెలవడానికి విద్యార్థులను సిద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ఈ ఒప్పందం ఒక ముందడుగుగా అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి వారీగా దశలవారీగా ఐబీని ప్రవేశపెట్టనున్నారు. కాగా, విద్యారంగంలో జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద వంటి అనేక సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇంగ్లీషు ప్రాథమిక స్థాయి నుండి CBSE నుండి IBకి మారడం ద్వారా బోధనా మాధ్యమంగా మార్చబడింది. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ 3వ తరగతి నుండి ప్రవేశపెట్టబడింది. ద్విభాషా పాఠ్యపుస్తకాలు మరియు ఆక్స్ఫర్డ్ నిఘంటువుతో సహా 9 అంశాలతో కూడిన జగనన్న విద్యా కానుక కిట్లు విద్యార్థులకు సరఫరా చేయబడుతున్నాయి. తద్వారా ఆంగ్ల పాఠాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు.
Read Also: AP Govt: ఏపీ సర్కార్ ముందడుగు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్..
ఇక, బైజుస్ కంటెంట్ 4 నుండి 12వ తరగతి వరకు ఉచితంగా అందించబడుతుంది. అలాగే, 8వ తరగతి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు బైజు ప్రీ-లోడ్ చేసిన కంటెంట్తో కూడిన ఉచిత ట్యాబ్లు అందించబడుతున్నాయి. ఐబీ ప్రమాణాలకు అనుగుణంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు అప్గ్రేడేషన్ నాడు-నేడు ద్వారా చేయబడుతుంది. డిజిటల్ విద్యను ప్రోత్సహించడానికి ఆరవ తరగతి మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల విద్యార్థుల కోసం సుమారు 62,000 IFPలు వ్యవస్థాపించబడ్డాయి. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న ప్రతి పాఠశాలలో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు.. ఇలా విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం.
తాజావార్తలు
-
SRH vs CSK: కాటేరమ్మ కొడుకుల కసివేట.. సీఎస్కేపై ఎస్ఆర్హెచ్ సూపర్ విక్టరీ..
-
Abhishek Sharma: వేగంలో సెహ్వాగ్నే మించిపోయాడు.. ఐపీఎల్లో అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర!
-
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్సింగ్ అక్కడ కూడా ఫ్లాపేనా?
-
Yuzvendra Chahal: ‘క్యూట్’ మెసేజ్ వివాదం.. చాహల్ తానియా ఛటర్జీపై పరువు నష్టం దావా వేసిన చాహల్
-
Mahesh Babu: రాజమౌళి మహేశ్కు పాస్పోర్ట్ ఇచ్చేశాడా?
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!