SBI Bank Robbery Case: ఎస్బిఐ బ్యాంక్ దోపిడీ కేసు ఛేదన.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.. రూ.5.50 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
SBI Bank Robbery Case: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామిక వాడలో గత ఏడాది జూలై 27న జరిగిన ఎస్బిఐ (SBI) బ్యాంక్ దోపిడీ కేసును రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కీలకమైన అంతర్రాష్ట్ర దోపిడీ దొంగను అరెస్ట్ చేసి, భారీగా బంగారు నగలు సహా వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. పోలీసులు వివరాల ప్రకారం.. గత సంవత్సరం జూలై 27న తూముకుంట వద్ద ఉన్న ఎస్బిఐ బ్యాంక్లోని లాకర్లను గ్యాస్ కట్టర్తో తెరిచి సుమారు 11 కేజీల బంగారు నగలను అంతర్రాష్ట్ర దొంగలు దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విస్తృత దర్యాప్తు చేపట్టారు.
Cigarette Prices: సిగరెట్ ప్రియులకు చేదు వార్త.. ఇంత పెట్టి కొనడం కంటే మానుకోవడమే మంచిది భయ్యా!
Also Read
ఈ కేసులో భాగంగా గత సంవత్సరం ఆగస్టులో హర్యానా రాష్ట్రానికి చెందిన అనిల్ పన్వర్ అనే దోపిడీ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.3.50 కోట్ల విలువ చేసే బంగారు నగలు, ఒక కారు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. దోపిడీకి గురైన మిగతా బంగారం కోసం మూడు ప్రత్యేక బృందాలతో పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగించారు. తాజాగా రాజస్థాన్కు చెందిన ఇష్ రార్ ఖాన్ అనే మరో అంతర్రాష్ట్ర దొంగను పీటీ వారెంట్ ద్వారా అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.5.50 కోట్ల విలువ చేసే బంగారు నగలు, ఒక కారు, ఒక బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad: న్యూ ఇయర్ వేళ విషాదం.. బిర్యానీ తిని ఒకరు మృతి.. అపస్మారక స్థితిలో మరో 15 మంది
ఈ దొంగలు వ్యసనాలకు బానిసలై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో బ్యాంక్ దోపిడీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. తూముకుంట బ్యాంక్ దోపిడీ అనంతరం కూడా పలు చోట్ల వీరు దొంగతనాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరు దోపిడీ దొంగలపై దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం 14 దోపిడీ కేసులు నమోదైనట్లు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఇంకా రికవరీ కావాల్సిన కొంత బంగారు నగల కోసం దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!