SBI Bank Robbery Case: ఎస్బిఐ బ్యాంక్ దోపిడీ కేసు ఛేదన.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.. రూ.5.50 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SBI Bank Robbery Case: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామిక వాడలో గత ఏడాది జూలై 27న జరిగిన ఎస్బిఐ (SBI) బ్యాంక్ దోపిడీ కేసును రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కీలకమైన అంతర్రాష్ట్ర దోపిడీ దొంగను అరెస్ట్ చేసి, భారీగా బంగారు నగలు సహా వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. పోలీసులు వివరాల ప్రకారం.. గత సంవత్సరం జూలై 27న తూముకుంట వద్ద ఉన్న ఎస్బిఐ బ్యాంక్లోని లాకర్లను గ్యాస్ కట్టర్తో తెరిచి సుమారు 11 కేజీల బంగారు నగలను అంతర్రాష్ట్ర దొంగలు దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విస్తృత దర్యాప్తు చేపట్టారు.
Cigarette Prices: సిగరెట్ ప్రియులకు చేదు వార్త.. ఇంత పెట్టి కొనడం కంటే మానుకోవడమే మంచిది భయ్యా!
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
ఈ కేసులో భాగంగా గత సంవత్సరం ఆగస్టులో హర్యానా రాష్ట్రానికి చెందిన అనిల్ పన్వర్ అనే దోపిడీ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.3.50 కోట్ల విలువ చేసే బంగారు నగలు, ఒక కారు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. దోపిడీకి గురైన మిగతా బంగారం కోసం మూడు ప్రత్యేక బృందాలతో పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగించారు. తాజాగా రాజస్థాన్కు చెందిన ఇష్ రార్ ఖాన్ అనే మరో అంతర్రాష్ట్ర దొంగను పీటీ వారెంట్ ద్వారా అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.5.50 కోట్ల విలువ చేసే బంగారు నగలు, ఒక కారు, ఒక బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad: న్యూ ఇయర్ వేళ విషాదం.. బిర్యానీ తిని ఒకరు మృతి.. అపస్మారక స్థితిలో మరో 15 మంది
ఈ దొంగలు వ్యసనాలకు బానిసలై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో బ్యాంక్ దోపిడీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. తూముకుంట బ్యాంక్ దోపిడీ అనంతరం కూడా పలు చోట్ల వీరు దొంగతనాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరు దోపిడీ దొంగలపై దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం 14 దోపిడీ కేసులు నమోదైనట్లు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఇంకా రికవరీ కావాల్సిన కొంత బంగారు నగల కోసం దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!