Love Affair: అత్తవారింటికి వెళ్తున్నామని చెప్పి.. ప్రియుల వద్దకు చెక్కేసిన అక్కాచెల్లెళ్లు
- అత్తవారింటికి వెళ్తున్నామని చెప్పి ప్రియుల వద్దకు వెళ్లిన అక్కాచెల్లెళ్లు
- ఛత్తీస్గఢ్లోని కొండగావ్ జిల్లాలో ఘటన
- ఇద్దరు అక్కాచెల్లెళ్లకు పిల్లలు
- ఫోన్లో రాంగ్స్ కాల్స్ తో పరిచయమైన ప్రేమికులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్లోని కొండగావ్ జిల్లాలో ప్రేమ వ్యవహారం వెలుగు చూసింది. ఇక్కడ ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలిసి తల్లిగారింటికి వచ్చి.. అత్తమామల ఇంటికి వెళ్లకుండా, తమ పిల్లలను తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయారు. ఇప్పుడు వారిద్దరూ మధ్యప్రదేశ్లో ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా.. తమ లవర్స్ను పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ తిరిగి రావడానికి నిరాకరించారు. వివరాల్లోకి వెళ్తే.. ఠాకూర్పారా అడెంగా గ్రామంలో కాళేంద్రి పటేల్ అనే మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేది. తన చెల్లెలు బుధ్యారిన్ పటేల్కి కూడా కొద్ది దూరంలో అత్తమామల ఇల్లు ఉంది. అయితే.. ఆమె భర్త చనిపోయాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్దిరోజుల క్రితం అక్కాచెల్లెళ్లిద్దరూ తమ అత్తవారింటికి వెళ్తున్నట్లు తమ తల్లిదండ్రులతో చెప్పి.. తమ ప్రేమికుల వద్దకు వెళ్లి పెళ్లి చేసుకున్నారు.
Read Also: Manorathangal: 9 మంది స్టార్లు.. 9 కథలు.. కమల్ టు మోహన్ లాల్.. డోంట్ మిస్!
Also Read
- Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్తో మరింత ఆదా.!
- CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
- కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
- స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
కాగా.. తమ వద్దకు వస్తారని చెప్పి రాకపోవడంతో అత్తమామలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు అక్కాచెల్లెళ్ల మొబైల్ లొకేషన్లను గుర్తించారు. మధ్యప్రదేశ్లో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు వారి కోసం వెతకగా.. షాజాపూర్కు చెందిన సీతారాం పుర్బియాతో ఒకరు.. సిహోర్ జిల్లాలోని శ్యాంపూర్కు చెందిన భైరుసింగ్ గల్వితో మరొకరు పట్టుబడ్డారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. ఓ షాకింగ్ విషయం బయటపడింది. వారి ప్రేమ కథను పోలీసులకు చెప్పారు.
ఈ ఘటనపై పోలీసులు వివరాలు చెబుతూ.. కొంతకాలం క్రితం అక్కాచెల్లెళ్లిద్దరికీ రాంగ్ కాల్స్ వచ్చాయని.. కాళేంద్రి పటేల్కి సీతారాం పూర్బియా, బుద్ధిరిన్ పటేల్కి భైరుసింగ్ గల్వీ రాంగ్ కాల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత నుంచి వీరి మధ్య ప్రేమకథ మొదలైందని.. అనంతరం అత్తమామల దగ్గరికి వెళ్తున్నామని చెప్పి ప్రేమికుల వద్దకు వెళ్లినట్లు పోలీసులు చెప్పారు. అక్కడ అక్కాచెల్లెళ్లిద్దరూ తమ ప్రేమికులను పెళ్లి చేసుకున్నారన్నారు. కాగా.. ఇద్దరు మహిళల నుంచి వాంగ్మూలాలు తీసుకున్నట్లు ఠాకూర్పర అడెంగా పోలీస్స్టేషన్ ఇన్ఛార్జ్ తెలిపారు. తమ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని చెప్పారని.. ప్రస్తుతం ఇద్దరూ మధ్యప్రదేశ్లోని వేర్వేరు జిల్లాల్లో నివసిస్తున్నారన్నారు. వారు తిరిగి రావడానికి నిరాకరించారని.. ఈ ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్కు షాక్.. వెస్టిండీస్తో వన్డే సిరీస్కు దూరం.. అసలు కారణం ఇదే!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్తో మరింత ఆదా.!
-
CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
-
స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!