Love Affair: అత్తవారింటికి వెళ్తున్నామని చెప్పి.. ప్రియుల వద్దకు చెక్కేసిన అక్కాచెల్లెళ్లు
- అత్తవారింటికి వెళ్తున్నామని చెప్పి ప్రియుల వద్దకు వెళ్లిన అక్కాచెల్లెళ్లు
- ఛత్తీస్గఢ్లోని కొండగావ్ జిల్లాలో ఘటన
- ఇద్దరు అక్కాచెల్లెళ్లకు పిల్లలు
- ఫోన్లో రాంగ్స్ కాల్స్ తో పరిచయమైన ప్రేమికులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్లోని కొండగావ్ జిల్లాలో ప్రేమ వ్యవహారం వెలుగు చూసింది. ఇక్కడ ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలిసి తల్లిగారింటికి వచ్చి.. అత్తమామల ఇంటికి వెళ్లకుండా, తమ పిల్లలను తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయారు. ఇప్పుడు వారిద్దరూ మధ్యప్రదేశ్లో ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా.. తమ లవర్స్ను పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ తిరిగి రావడానికి నిరాకరించారు. వివరాల్లోకి వెళ్తే.. ఠాకూర్పారా అడెంగా గ్రామంలో కాళేంద్రి పటేల్ అనే మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేది. తన చెల్లెలు బుధ్యారిన్ పటేల్కి కూడా కొద్ది దూరంలో అత్తమామల ఇల్లు ఉంది. అయితే.. ఆమె భర్త చనిపోయాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్దిరోజుల క్రితం అక్కాచెల్లెళ్లిద్దరూ తమ అత్తవారింటికి వెళ్తున్నట్లు తమ తల్లిదండ్రులతో చెప్పి.. తమ ప్రేమికుల వద్దకు వెళ్లి పెళ్లి చేసుకున్నారు.
Read Also: Manorathangal: 9 మంది స్టార్లు.. 9 కథలు.. కమల్ టు మోహన్ లాల్.. డోంట్ మిస్!
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
కాగా.. తమ వద్దకు వస్తారని చెప్పి రాకపోవడంతో అత్తమామలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు అక్కాచెల్లెళ్ల మొబైల్ లొకేషన్లను గుర్తించారు. మధ్యప్రదేశ్లో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు వారి కోసం వెతకగా.. షాజాపూర్కు చెందిన సీతారాం పుర్బియాతో ఒకరు.. సిహోర్ జిల్లాలోని శ్యాంపూర్కు చెందిన భైరుసింగ్ గల్వితో మరొకరు పట్టుబడ్డారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. ఓ షాకింగ్ విషయం బయటపడింది. వారి ప్రేమ కథను పోలీసులకు చెప్పారు.
ఈ ఘటనపై పోలీసులు వివరాలు చెబుతూ.. కొంతకాలం క్రితం అక్కాచెల్లెళ్లిద్దరికీ రాంగ్ కాల్స్ వచ్చాయని.. కాళేంద్రి పటేల్కి సీతారాం పూర్బియా, బుద్ధిరిన్ పటేల్కి భైరుసింగ్ గల్వీ రాంగ్ కాల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత నుంచి వీరి మధ్య ప్రేమకథ మొదలైందని.. అనంతరం అత్తమామల దగ్గరికి వెళ్తున్నామని చెప్పి ప్రేమికుల వద్దకు వెళ్లినట్లు పోలీసులు చెప్పారు. అక్కడ అక్కాచెల్లెళ్లిద్దరూ తమ ప్రేమికులను పెళ్లి చేసుకున్నారన్నారు. కాగా.. ఇద్దరు మహిళల నుంచి వాంగ్మూలాలు తీసుకున్నట్లు ఠాకూర్పర అడెంగా పోలీస్స్టేషన్ ఇన్ఛార్జ్ తెలిపారు. తమ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని చెప్పారని.. ప్రస్తుతం ఇద్దరూ మధ్యప్రదేశ్లోని వేర్వేరు జిల్లాల్లో నివసిస్తున్నారన్నారు. వారు తిరిగి రావడానికి నిరాకరించారని.. ఈ ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!