Saudi Arabia–Syria: సిరియాతో దోస్తీకి సౌదీ అరేబియా సై..12 తర్వాత సంబంధాల పునరుద్ధరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఒకప్పుడు శత్రు దేశంగా ఉన్న సిరియాతో తన సంబంధాలను పునరుద్ధరించుకుంటున్నట్లు ప్రకటించారు. 12 ఏళ్లుగా సిరియాతో సంబంధాలను నిలిపివేసిన సౌదీ అరేబియా సిరియా రాజధాని డమాస్కస్లో తన రాయబారిని నియమిస్తున్నట్లు ఆదివారం వార్తలు వచ్చాయి. సంబంధాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఏడాది క్రితం సిరియాను కూడా అరబ్ లీగ్లో చేర్చారు. సౌదీ అరేబియా అధికారిక వార్తా సంస్థ, సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రకారం.. 2012 తర్వాత సిరియాలో రాజ్యం మొదటి రాయబారిగా ఫైసల్ అల్-ముజాఫైల్ను నియమించినట్లు ప్రకటించింది. 22 దేశాలతో కూడిన అరబ్ లీగ్లో సిరియా తిరిగి చేరిన ఒక సంవత్సరం తర్వాత రాయబారి నియామకానికి సంబంధించిన సౌదీ ప్రకటన వెలువడింది.
READ MORE: Independents: తగ్గుతున్న స్వతంత్రుల ప్రాబల్యం.. 1957 నుంచి 2019 వరకు గణాంకాలు ఎలా ఉన్నాయంటే..?
Also Read
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
2011లో, సిరియాలో పెద్దఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరిగాయి. వాటిని అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వం క్రూరంగా అణిచివేసింది. దీనికి నిరసనగా సౌదీ అరేబియా సిరియాతో సంబంధాలను నిలిపివేసింది. సౌదీ 2012లో సిరియాతో సంబంధాలను తెంచుకుంది. దీంతో సిరియా 14 ఏళ్లుగా అంతర్యుద్ధంలో చిక్కుకుంది. సిరియన్ తిరుగుబాటు కాలక్రమేణా అంతర్యుద్ధంగా మారింది. 14 సంవత్సరాల తర్వాత ఈ అంతర్యుద్ధం అర మిలియన్ల మంది ప్రజల ప్రాణాలను తీసింది. దీని కారణంగా 2.3 కోట్ల మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. ఈ యుద్ధం చాలా ఏళ్లు కొనసాగింది. ఫిబ్రవరి 2023లో తుర్కియే, ఉత్తర సిరియా వినాశకరమైన భూకంపంతో దెబ్బతిన్నాయి. 7.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం రెండు దేశాల్లోనూ తీవ్ర విధ్వంసం సృష్టించింది. భూకంపం కారణంగా సిరియా ప్రజలు పడుతున్న అవస్థలను చూసిన అరబ్ దేశాలు అధ్యక్షుడు అసద్తో సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.
మార్చి 2023లో.. సౌదీ అరేబియా, ఇరాన్ బీజింగ్ (చైనా రాజధాని)లో చర్చల తర్వాత దౌత్య సంబంధాలను పునఃస్థాపనకు అంగీకరించాయి. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య వివాదాలను తగ్గించే లక్ష్యంతో పెద్ద దౌత్యపరమైన విజయం సాధించింది. సిరియాలోని అసద్ ప్రభుత్వానికి, లెబనీస్ హిజ్బుల్లా గ్రూపునకు ఇరాన్ ప్రధాన రాజకీయ, సైనిక మిత్రదేశంగా ఉంది. ఇంతలో యెమెన్లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో సౌదీ అరేబియా 2015 నుంచి ఇరాన్-మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా సంకీర్ణ దళాలను నడిపించింది. ఈ వివాదం ఇటీవలి సంవత్సరాలలో సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య ప్రాక్సీ వార్గా మారింది. అయితే ఇరుపక్షాలు ఇప్పుడు సంబంధాలను పునరుద్ధరించడంతో ఇక ముందు శాంతి వాతావరణం నెలకొంటోంది.
తాజావార్తలు
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!