Saudi Arabia–Syria: సిరియాతో దోస్తీకి సౌదీ అరేబియా సై..12 తర్వాత సంబంధాల పునరుద్ధరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఒకప్పుడు శత్రు దేశంగా ఉన్న సిరియాతో తన సంబంధాలను పునరుద్ధరించుకుంటున్నట్లు ప్రకటించారు. 12 ఏళ్లుగా సిరియాతో సంబంధాలను నిలిపివేసిన సౌదీ అరేబియా సిరియా రాజధాని డమాస్కస్లో తన రాయబారిని నియమిస్తున్నట్లు ఆదివారం వార్తలు వచ్చాయి. సంబంధాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఏడాది క్రితం సిరియాను కూడా అరబ్ లీగ్లో చేర్చారు. సౌదీ అరేబియా అధికారిక వార్తా సంస్థ, సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రకారం.. 2012 తర్వాత సిరియాలో రాజ్యం మొదటి రాయబారిగా ఫైసల్ అల్-ముజాఫైల్ను నియమించినట్లు ప్రకటించింది. 22 దేశాలతో కూడిన అరబ్ లీగ్లో సిరియా తిరిగి చేరిన ఒక సంవత్సరం తర్వాత రాయబారి నియామకానికి సంబంధించిన సౌదీ ప్రకటన వెలువడింది.
READ MORE: Independents: తగ్గుతున్న స్వతంత్రుల ప్రాబల్యం.. 1957 నుంచి 2019 వరకు గణాంకాలు ఎలా ఉన్నాయంటే..?
Also Read
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
- AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
- Heavy Rain Alert: ఏపీపై నైరుతి రుతుపవనాల ప్రభావం.. భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ
- Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
2011లో, సిరియాలో పెద్దఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరిగాయి. వాటిని అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వం క్రూరంగా అణిచివేసింది. దీనికి నిరసనగా సౌదీ అరేబియా సిరియాతో సంబంధాలను నిలిపివేసింది. సౌదీ 2012లో సిరియాతో సంబంధాలను తెంచుకుంది. దీంతో సిరియా 14 ఏళ్లుగా అంతర్యుద్ధంలో చిక్కుకుంది. సిరియన్ తిరుగుబాటు కాలక్రమేణా అంతర్యుద్ధంగా మారింది. 14 సంవత్సరాల తర్వాత ఈ అంతర్యుద్ధం అర మిలియన్ల మంది ప్రజల ప్రాణాలను తీసింది. దీని కారణంగా 2.3 కోట్ల మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. ఈ యుద్ధం చాలా ఏళ్లు కొనసాగింది. ఫిబ్రవరి 2023లో తుర్కియే, ఉత్తర సిరియా వినాశకరమైన భూకంపంతో దెబ్బతిన్నాయి. 7.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం రెండు దేశాల్లోనూ తీవ్ర విధ్వంసం సృష్టించింది. భూకంపం కారణంగా సిరియా ప్రజలు పడుతున్న అవస్థలను చూసిన అరబ్ దేశాలు అధ్యక్షుడు అసద్తో సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.
మార్చి 2023లో.. సౌదీ అరేబియా, ఇరాన్ బీజింగ్ (చైనా రాజధాని)లో చర్చల తర్వాత దౌత్య సంబంధాలను పునఃస్థాపనకు అంగీకరించాయి. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య వివాదాలను తగ్గించే లక్ష్యంతో పెద్ద దౌత్యపరమైన విజయం సాధించింది. సిరియాలోని అసద్ ప్రభుత్వానికి, లెబనీస్ హిజ్బుల్లా గ్రూపునకు ఇరాన్ ప్రధాన రాజకీయ, సైనిక మిత్రదేశంగా ఉంది. ఇంతలో యెమెన్లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో సౌదీ అరేబియా 2015 నుంచి ఇరాన్-మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా సంకీర్ణ దళాలను నడిపించింది. ఈ వివాదం ఇటీవలి సంవత్సరాలలో సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య ప్రాక్సీ వార్గా మారింది. అయితే ఇరుపక్షాలు ఇప్పుడు సంబంధాలను పునరుద్ధరించడంతో ఇక ముందు శాంతి వాతావరణం నెలకొంటోంది.
తాజావార్తలు
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
-
AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
-
Pooja Hegde: సీఎంపైనే పూజా హెగ్డే ఆశలు!
-
Heavy Rain Alert: ఏపీపై నైరుతి రుతుపవనాల ప్రభావం.. భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ
-
Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!