T20 World Cup 2024: మెగా టోర్నీలో భారత జట్టు వికెట్ కీపర్గా అతనికే ఛాన్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ ముగియగానే టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. 2024 జూన్ 1 నుండి వెస్టిండీస్, అమెరికాలో ఈ మెగా టోర్నీని నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మే 1తో జట్టు ప్రకటన గడువు ముగియనుంది. దీంతో ఈరోజు లేదా రేపు జట్టు ప్రకటించే అవకాశముంది. అయితే.. టీమిండియాలో వికెట్ కీపర్ గా సంజూ శాంసన్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరోవైపు.. అతనికి పోటీగా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ఆటగాళ్లు పోటీలో ఉన్నారు.
కానీ.. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా ఉన్న సంజూ శాంసన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ ల్లో 161.08 స్ట్రైక్ రేట్తో 385 పరుగులు చేశాడు. అందులో నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ జాబితాలో శాంసన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. మరోవైపు.. కేఎల్ రాహుల్ కూడా 144 స్ట్రైక్ రేట్తో 378 పరుగులు చేశాడు. రాహుల్.. ఆరెంజ్ క్యాప్ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నాడు.
Also Read
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
Chandini Chowdary: ఆడేసుకుంటున్న నెటిజన్లు.. నేనలా అనలేదంటున్న చాందిని చౌదరి
ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ జాబితాలో రిషబ్ పంత్ ఆరో స్థానంలో ఉన్నాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ 10 మ్యాచ్లలో 160.60 స్ట్రైక్ రేట్తో 371 పరుగులు చేశాడు. మూడు అర్ధ సెంచరీలు సాధించాడు. కిషన్ పెర్ఫార్మెన్స్ ఇంతవరకూ ఫర్వాలేదు. కిషన్ 9 మ్యాచ్లలో 165.62 స్ట్రైక్ రేట్తో 212 పరుగులు చేశాడు. ESPNcricinfo నివేదిక ప్రకారం.. సంజు శాంసన్ వికెట్ కీపర్గా ఎంపిక కావడం ఖాయం అని తెలుస్తోంది. ఎందుకంటే.. వీరందరి కంటే శాంసన్ రేసులో ముందు వరుసలో ఉన్నాడు.
టాప్-4 పేర్లు దాదాపు ఖరారయ్యాయి
ఐపీఎల్కు ముందే భారత టాప్-4 బ్యాట్స్మెన్ల పేర్లు ఖరారయ్యాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ పేర్లు ఆమోదం పొందడం ఖాయం. మరోవైపు.. స్టార్ ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఫిట్నెస్ ఆందోళన కలిగించే విషయమని క్రిక్ఇన్ఫో పేర్కొంది. ప్రస్తుత సీజన్లో హార్ధిక్ పెద్దగా రాణించలేదు. శివమ్ దూబే లేదా రింకూ సింగ్లో ఒకరితో పాటు సంజూ శాంసన్ లేదా కేఎల్ రాహుల్లలో ఒకరు ఉంటారని పేర్కొంది. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకోవడం ఖాయమని క్రిక్బజ్ కథనం పేర్కొంది.
తాజావార్తలు
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!