T20 World Cup 2024: మెగా టోర్నీలో భారత జట్టు వికెట్ కీపర్గా అతనికే ఛాన్స్..!
ఐపీఎల్ ముగియగానే టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. 2024 జూన్ 1 నుండి వెస్టిండీస్, అమెరికాలో ఈ మెగా టోర్నీని నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మే 1తో జట్టు ప్రకటన గడువు ముగియనుంది. దీంతో ఈరోజు లేదా రేపు జట్టు ప్రకటించే అవకాశముంది. అయితే.. టీమిండియాలో వికెట్ కీపర్ గా సంజూ శాంసన్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరోవైపు.. అతనికి పోటీగా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ఆటగాళ్లు పోటీలో ఉన్నారు.
కానీ.. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా ఉన్న సంజూ శాంసన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ ల్లో 161.08 స్ట్రైక్ రేట్తో 385 పరుగులు చేశాడు. అందులో నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ జాబితాలో శాంసన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. మరోవైపు.. కేఎల్ రాహుల్ కూడా 144 స్ట్రైక్ రేట్తో 378 పరుగులు చేశాడు. రాహుల్.. ఆరెంజ్ క్యాప్ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నాడు.
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
Chandini Chowdary: ఆడేసుకుంటున్న నెటిజన్లు.. నేనలా అనలేదంటున్న చాందిని చౌదరి
ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ జాబితాలో రిషబ్ పంత్ ఆరో స్థానంలో ఉన్నాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ 10 మ్యాచ్లలో 160.60 స్ట్రైక్ రేట్తో 371 పరుగులు చేశాడు. మూడు అర్ధ సెంచరీలు సాధించాడు. కిషన్ పెర్ఫార్మెన్స్ ఇంతవరకూ ఫర్వాలేదు. కిషన్ 9 మ్యాచ్లలో 165.62 స్ట్రైక్ రేట్తో 212 పరుగులు చేశాడు. ESPNcricinfo నివేదిక ప్రకారం.. సంజు శాంసన్ వికెట్ కీపర్గా ఎంపిక కావడం ఖాయం అని తెలుస్తోంది. ఎందుకంటే.. వీరందరి కంటే శాంసన్ రేసులో ముందు వరుసలో ఉన్నాడు.
టాప్-4 పేర్లు దాదాపు ఖరారయ్యాయి
ఐపీఎల్కు ముందే భారత టాప్-4 బ్యాట్స్మెన్ల పేర్లు ఖరారయ్యాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ పేర్లు ఆమోదం పొందడం ఖాయం. మరోవైపు.. స్టార్ ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఫిట్నెస్ ఆందోళన కలిగించే విషయమని క్రిక్ఇన్ఫో పేర్కొంది. ప్రస్తుత సీజన్లో హార్ధిక్ పెద్దగా రాణించలేదు. శివమ్ దూబే లేదా రింకూ సింగ్లో ఒకరితో పాటు సంజూ శాంసన్ లేదా కేఎల్ రాహుల్లలో ఒకరు ఉంటారని పేర్కొంది. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకోవడం ఖాయమని క్రిక్బజ్ కథనం పేర్కొంది.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!