Sanjiv Goenka Gets Emotional: ఏడ్చిన సంజీవ్ గోయెంకా.. ఎందుకంత ఎమోషనల్.?
- లక్నో సూపర్ జెయింట్స్ యజమాని..
- భావోద్వేగానికి లోనైన సంజీవ్ గోయెంకా
- సన్రైజర్స్ హైదరాబాద్పై గెలిచిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న గోయెంకా
- ఐపీఎల్ 2026లో లక్నోకు ఇదే తొలి విజయం
- మ్యాచ్ చివరి ఓవర్లలో టెన్షన్తో ప్రార్థనలు చేసిన గోయెంకా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjiv Goenka Gets Emotional: సంజీవ్ గోయెంకా ఈ పేరుకు పెద్ద పరిచయం అక్కర్లేదు. భారతదేశ బిజినెస్ టైకూన్స్ లో ఒకరైన ఈయన ఐపీఎల్ ద్వారా భారతీయులకు మరింత చేరువయ్యారు. ఈయన సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ల్లో తన జట్టు కెప్టెన్ పై లేదా కోచ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, క్లాస్ పీకుతూ కన్పిస్తూ ఉంటాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) యజమాని అయిన సంజీవ్ గోయెంకా ఈసారి మాత్రం పూర్తి భిన్నంగా కనిపించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో లక్నో విజయం సాధించిన తర్వాత ఆయన కళ్లు చెమర్చాయి. మైదానంలోనే ఆయన ఆనందంతో కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
PCB Chairman vs IPL: ఇంత కుల్లుబోతోడివి ఏంది సామి నువ్వు.. ఐపీఎల్పై పీసీబీ ఛైర్మన్ ఏడుపు!
Also Read
ఐపీఎల్ 2026 సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్కు ఇది తొలి విజయం. తమ మొదటి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలైన లక్నోకు, హైదరాబాద్పై గెలవడం అత్యవసరంగా మారింది. ఈ గెలుపు జట్టు యజమాని సంజీవ్ గోయెంకాకు ఎంత ప్రాముఖ్యమో ఆయన ప్రవర్తనను బట్టి అర్థమవుతోంది. మ్యాచ్ చివరి ఓవర్లలో జట్టు గెలవాలని ఆయన భక్తితో ప్రార్థిస్తూ కనిపించారు. విజయం ఖాయం కాగానే తన ఉద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లు తుడుచుకుంటూ ఉండడం కెమెరాలకు చిక్కింది. గోయెంకా లోని ఈ ఎమోషనల్ యాంగిల్ చూసి అభిమానులు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు.
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్.. సన్రైజర్స్ బ్యాటింగ్ బలాన్ని పరీక్షిస్తామంటూ వారిని ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించారు. అయితే మహమ్మద్ షమీ నేతృత్వంలోని లక్నో బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో హైదరాబాద్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సన్రైజర్స్ 9 వికెట్ల నష్టానికి కేవలం 156 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఇక 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు కెప్టెన్ రిషబ్ పంత్ వెన్నెముకగా నిలిచారు. పంత్ అద్భుతమైన అర్ధసెంచరీ (68 పరుగులు) చేయగా, మరోవైపు ఎయిడెన్ మార్క్రామ్ (45 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో మరో ఒక్క బంతి మిగిలి ఉండగానే లక్నో విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో లక్నో 7వ స్థానానికి చేరుకుంది. గతంలో ఆటగాళ్లపై అసహనం వ్యక్తం చేసిన గోయెంకా, ఇప్పుడు టీమ్ గెలుపు కోసం కన్నీరు పెట్టుకోవడం చూస్తుంటే ఈ సీజన్ విజయంపై ఆయన ఎంత పట్టుదలగా ఉన్నారో స్పష్టమవుతోంది.
Sanjiv Goenka was literally in tears after Rishabh Pant finished the match. Sanjiv Goenka is very passionate about cricket, and this win means a lot to him.🥺❤️
pic.twitter.com/eO7BOeOX8K— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) April 5, 2026
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!