Patra Chawl land scam case: సంజయ్ రౌత్ జ్యుడీషియల్ కస్టడీ 14 రోజులు పొడిగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Patra Chawl land scam case: పత్రాచాల్ భూ కుంభకోణం కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జ్యుడిషియల్ కస్టడీని ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం (PMLA) కోర్టు సోమవారం 14 రోజులు పొడిగించింది. సెప్టెంబర్ 5న జ్యుడీషియల్ కస్టడీని 14 రోజుల పాటు కోర్టు పొడిగించగా ఈ రోజుతో ముగిసింది. ఈ నేపథ్యంలో అధికారులు సంజయ్ రౌత్ను మరోసారి కోర్టు ముందు హాజరుపరిచారు. మరో వైపు సంజయ్ రౌత్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణకు నోచుకోలేదు. సంజయ్ రౌత్ పిటిషన్ను ఈ నెల 21న విచారించేందుకు కోర్టు అంగీకారం తెలిపింది. కాగా, కోర్టు ఆదేశాల మేరకు ఈడీ అధికారులు ఛార్జిషీట్ కాపీని సంజయ్ రౌత్కు అందజేశారు.
గోరేగావ్ సబర్బన్లోని పత్రాచాల్ను పునరాభివృద్ధి చేయడంలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆగస్టు 1న అరెస్టు చేసింది. మొదట్లో ఈడీ కస్టడీ అనంతరం ఆగస్ట్ 8న సంజయ్ రౌత్ను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఆగస్ట్ 22న ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం కోర్టు రౌత్ కస్టడీని సెప్టెంబర్ 5 వరకు పొడిగించింది. సెప్టెంబర్ 5న జ్యుడీషియల్ కస్టడీని 14 రోజుల పాటు కోర్టు పొడిగించగా.. అది నేటితో ముగిసింది. నేడు మరోసారి కస్టడీని కోర్టు పొడిగించింది.
Also Read
- Ram Mandir CEO: రామ మందిర్ CEOగా జితేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సింధూర్లో రహస్యం ఉందా?’ కాంగ్రెస్ అనుమానం
- Punjab: ‘‘రేప్ కేసుల సెటిల్మెంట్ దందా’’.. సీఎం మాన్, భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
- Trump-Iran: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ ప్రత్యేక సమావేశం.. ఇరాన్ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశం
- CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Jacqueline Fernandez: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు.. విచారణకు హాజరైన జాక్వెలిన్ ఫెర్నాండెజ్
ఈ ఏడాది జూన్ 28న, రూ. 1,034 కోట్ల పత్రాచాల్ భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారణకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంజయ్ రౌత్కు సమన్లు జారీ చేసింది. తిరిగి ఆగస్టులో పత్రా చాల్ ల్యాండ్ కేసుకు సంబంధించి శివసేన ఎంపీ భార్యకు కూడా ఈడీ సమన్లు పంపింది.
తాజావార్తలు
-
Ram Mandir CEO: రామ మందిర్ CEOగా జితేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సింధూర్లో రహస్యం ఉందా?’ కాంగ్రెస్ అనుమానం
-
Konda Surekha : ‘నన్ను అణచేస్తున్నారు’.. రాహుల్కు సురేఖ ఫిర్యాదు.!
-
Punjab: ‘‘రేప్ కేసుల సెటిల్మెంట్ దందా’’.. సీఎం మాన్, భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
-
Trump-Iran: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ ప్రత్యేక సమావేశం.. ఇరాన్ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశం
-
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!